Kurnool

News March 30, 2024

ప్రతాపరెడ్డి కుటుంబానికి అండగా ఉంటా: తుగ్గలిలో సీఎం జగన్

image

పత్తికొండ మాజీ ఎమ్మెల్యే దివంగత నేత తమ్మారెడ్డి కుమారులు ప్రతాపరెడ్డి, ప్రహల్లాద రెడ్డి ఒకేసారి అనారోగ్య కారణాల వల్ల మృతి చెందడంతో బాధాకరమని సీఎం జగన్ అన్నారు. తుగ్గలి సిద్ధం బస్సు యాత్రకు శనివారం వచ్చిన జగన్ వారి ఫొటోలకు నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతాపరెడ్డి, ప్రహల్లాద రెడ్డి కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు, నాయకునికి అండగా ఉంటామని భరోసానిచ్చారు.

News March 30, 2024

నేను లోకల్ వ్యక్తినే: డాక్టర్ పీవీ పార్థసారథి

image

ఆదోని MLA టికెట్ కూటమి బీజేపీ అభ్యర్థి డాక్టర్ పీవీ పార్థసారథికి ఖరారు అయిన విషయం తెలిసిందే. నియోజకవర్గంలో నాయకులు ఆయనను నాన్ లోకల్ అన్న విమర్శకు కౌంటర్ ఇచ్చారు. తాను లోకల్ వ్యక్తినే అని గత 10 ఏళ్లుగా ఇక్కడ డెంటల్ క్లినిక్ నిర్వహిస్తున్నానని అన్నారు. నియోజకవర్గ ప్రజల సమస్యలు తనకు బాగా తెలుసు అన్నారు. నాయకులు వారి రాజకీయ స్వలాభం కోసం చేస్తున్న విమర్శలు తన విజయాన్ని ఆపలేవు అన్నారు.

News March 30, 2024

పత్తికొండ: అత్యధిక మెజార్టీ ఆ మహిళకే…!

image

పత్తికొండ నియోజకవర్గంలో ఇప్పటివరకు జరగిన అసెంబ్లీ ఎన్నికలలో కంటే 2019 ఎన్నికలలో కే. శ్రీదేవీ YCP నుంచి పోటీచేసి TDP అభ్యర్థి కే.ఈ శ్యాంబాబుపై 42.065 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలకు కూడా YCP అధిష్ఠానం ఈమెకే మళ్లీ అవకాశమిచ్చింది. ఈమెకు ప్రత్యర్థిగా TDP అధిష్ఠానం కూడా కే. ఈ శ్యాంబాబును బరిలో దింపింది. మరి వీరిద్దరిలో గెలుపు ఎవరి సొంతమవుతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

News March 30, 2024

కర్నూలు : బైకు చక్రంలో చున్నీ చుట్టుకుని మహిళ మృతి

image

కర్నూలు జిల్లాకు చెందిన మాధవీలత(25) తెలంగాణలో మృతి చెందింది. స్థానికుల కథనం మేరకు మరికల్ మండలంలో భర్తతో కలిసి గ్యాస్ పొయ్యి మరమ్మతులు చేస్తూ గుడిసెలో జీవించేవారు. అయితే శుక్రవారం కోయిలసాగర్ జలాశయం వద్ద బైకుకు చున్నీ చుట్టుకుని కిందపడడంతో తలకు బలమైన గాయమైంది. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. అయితే ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

News March 30, 2024

నాడు వైసీపీ ప్రభుత్వంలో మంత్రి.. నేడు TDP MLA అభ్యర్థి

image

జగన్ కేబినెట్‌లో మొన్నటి వరకు ఉన్న గుమ్మనూరు జయరాం, YCPని వీడిన విషయం తెలిసిందే. TDPలో చేరిన ఆయనకు నిన్న చంద్రబాబు గుంతకల్లు టికెట్ కేటాయించారు. YCPలో ఆయనకు కర్నూలు MP టికెట్ ఇచ్చినా వద్దనుకొని ఆలూరు టికెట్ కోసం ప్రయత్నించారు. ఆపై ఆ పార్టీనే వీడారు. ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఆలూరు టికెట్‌ను టీడీపీ వీరభద్ర గౌడ్‌కు ఇచ్చింది. ఈయన పక్క నియోజకవర్గం గుంతకల్లు నుంచి బరిలో దిగుతున్నారు.

News March 30, 2024

పీఓలు, ఏపీఓలకు శిక్షణ కార్యక్రమాలు: కలెక్టర్

image

ఈనెల 30, ఏప్రిల్ 01 తేదీల్లో పీఓలు, ఏపీఓలకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ డా.జి.సృజన పేర్కొన్నారు. శుక్రవారం కర్నూలు కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి మాన్ పవర్ మేనేజ్మెంట్, ట్రైనింగ్ మేనేజ్మెంట్, ఈవీఎం నోడల్ అధికారులు, ఆర్వోలతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా ఏర్పాట్లపై సమీక్షించారు.

News March 29, 2024

కర్నూలు: ఎన్నికల ఉల్లంఘనలపై కొరడా.. విధుల నుంచి తొలగింపు

image

సి విజిల్ యాప్ ద్వారా ఇప్పటివరకు 95 ఫిర్యాదులు రాగా అందులో 65 సహేతుకమైన ఫిర్యాదులపై విచారించి చర్యలు తీసుకున్నామని కలెక్టర్ సృజన చెప్పారు. 53 ఫిర్యాదులను నిర్దేశించిన 100 నిమిషాల్లో పరిష్కరించామన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి 20మంది వాలంటీర్లు, డీఆర్ డీఏ-వైకేపీ ఆర్పీ ఒకరు, నగరపాలక సంస్థ డ్రైవర్ (ఆప్కాస్) ఒకరు, హెచ్. కైరవాడి సహకార సొసైటీ అటెండర్ ఒకరు కలిపి 23మంది తొలగించామన్నారు

News March 29, 2024

ఆలూరు టికెట్ కేటాయించిన చంద్రబాబు.. వీడిన ఉత్కంఠ

image

ఆలూరు TDP MLA టికెట్ వీరభద్ర గౌడ్‌కు టీడీపీ అధిష్ఠానం కేటాయించింది. దీంతో ఆలూరు అసెంబ్లీ టికెట్ కేటాయింపుపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. అటు ఇటీవలే టీడీపీలో చేరిన గుమ్మనూరు జయరాం గుంతకల్లు నుంచి పోటీ చేస్తారని అధిష్టానం ప్రకటించింది. దీంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు ఖరారు కాగా.. ఆదోనికి కూటమిలో భాగంగా BJP అభ్యర్థి పార్థసారథిని ప్రకటించారు.

News March 29, 2024

నంద్యాలలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

image

రాష్ట్రంలోనే అత్యధికంగా నంద్యాలలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని, కర్నూలు జిల్లాలో 41.09 డిగ్రీలు నమోదైనట్లు అమరావతి వాతావరణం కేంద్రం వెల్లడించింది. రాయలసీమ ప్రాంతాల్లో 31 మండలాల్లో 31 వడగాలులు వీచాయి. నంద్యాల జిల్లాలో 9, కర్నూలు 2 మండలాల్లో వడగాలులు వీచినట్లు తెలిపారు. ఇవాళ నంద్యాల జిల్లాలో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

News March 29, 2024

కర్నూలు: నేడు CM, మాజీ CM పర్యటన

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలో CM, మాజీ CM ఇవాళ పర్యటించనున్నారు. బనగానపల్లెలో TDP అధినేత చంద్రబాబు ‘ప్రజాగళం’ కార్యక్రమంలో భాగంగా స్థానిక పెట్రోల్ బంక్ వద్ద నిర్వహించే రోడ్ షోలో ఆయన పాల్గొననున్నారు. అనంతరం బహిరంగ సభలో CBN ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అలాగే మరో వైపు సీఎం జగన్ ఎమ్మిగనూరు వైడబ్ల్యూసీఎస్ మైదానంలో సాయంత్రం ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రలో పాల్గొంటున్నారు.