Kurnool

News December 23, 2024

PGRSకు 80 ఫిర్యాదులు: నంద్యాల ఎస్పీ

image

నంద్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆధ్వర్యంలో సోమవారం PGRS కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి ఎస్పీ అర్జీలను స్వీకరించారు. PGRS కార్యక్రమానికి 80 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ప్రతి ఫిర్యాదును సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎస్పీ అధిరాజ్ సింగ్ హామీ ఇచ్చారు. ASP యుగంధర్ బాబు పాల్గొన్నారు.

News December 23, 2024

చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించండి: కలెక్టర్

image

చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించి చేనేత కార్మికులకు చేయూతను అందించాలని కలెక్టర్ జి.రాజకుమారి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా బనగానపల్లె మండలం, నందివర్గం గ్రామ చేనేత స్టాల్‌ను ప్రారంభించి అధికారుల చేత చేనేత వస్త్రాలను కొనుగోలు చేయించారు. పేద స్థితిలో ఉన్న చేనేత సొసైటీలను ఆదరించి చేనేత ఉత్పత్తిదారులకు చేయూతను అందించాలని కలెక్టర్ తెలిపారు.

News December 23, 2024

ఫెయిల్‌ అయ్యానని.. ఆదోనిలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

image

ఆదోనిలో సోమవారం విషాద ఘటన జరిగింది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి కాలనీకి చెందిన నవీన్ (20) అనే బీటెక్ విద్యార్థి పరీక్షల్లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో ఊరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నవీన్ బీటెక్ పరీక్షల్లో కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు. దీంతో తన గదిలో ఊరివేసుకున్నాడు. ఘటనపై టూ టౌన్ పోలీసులు కేసున మోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

News December 23, 2024

కర్నూలు జిల్లాలో టీచర్ కిడ్నాప్.. కారణమిదేనా?

image

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం అల్లుగుండు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు మునీర్ అహ్మద్ మూడోసారి కిడ్నాప్‌కి గురైన విషయం తెలిసిందే. అయితే దీనికి భూవివాదమే కారణమని తెలుస్తోంది. కర్నూలు సెంట్రల్ స్కూల్ వెనుక ఉన్న రూ.20 కోట్ల విలువచేసే భూవివాదమే కారణమని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ భూవివాదంలో మునీర్ ఇప్పటికే ఫిర్యాదుదారుగా ఉన్నారు. ప్రస్తుతం, దీనిపై ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతోంది.

News December 23, 2024

కర్నూలు జిల్లాలో రేషన్ డీలర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

image

కర్నూలు జిల్లాలో 201 డీలర్ పోస్టులను శాశ్వత ప్రాతిపాదికన భర్తీ చేసేందుకు కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో కర్నూలు డివిజన్‌లో 76, ఆదోని డివిజన్లో 80, పత్తికొండ డివిజన్లో 45 పోస్టులు ఉన్నాయన్నారు. అభ్యర్థులను రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అర్జీలను డిసెంబర్ 30వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు అందజేయాలని కోరారు.

News December 23, 2024

కర్నూలు: రైతు సొంత వైద్యం.. 30 గొర్రెలు మృతి

image

30 గొర్రెలు మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలంలో జరిగింది. తిమ్మందొడ్డి గ్రామానికి చెందిన చిన్నకు సుమారు 600 గొర్రెలు ఉన్నాయి. వాటికి బలం వచ్చేందుకు వైద్యుల అనుమతి లేకుండానే సొంతంగా టానిక్ తాపారు. వికటించడంతో సుమారు 30 గొర్రెలు మృతిచెందాయి. టానిక్ అధిక డోసు ఇవ్వడంతోనే మృత్యువాతపడినట్లు పశువైద్యుల రిపోర్టులో తేలింది. భారీ నష్టం జరగడంతో బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.

News December 23, 2024

పత్తికొండ గ్రామ చరిత్ర తెలుసా?

image

పత్తికొండలో పూర్వం ఒక గొర్రెల కాపరి అడవిలో గొర్రెలు మేపుతూ.. క్రమంగా అడవిని నరికి పత్తి పండించాడని రాజుల చరిత్ర తెలిసిన వారు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో పంటలు బాగా పండటంతో ఇతరులు వచ్చి పంటలు పండిస్తూ ఉండిపోయారట. ఇలా గ్రామంగా ఏర్పడిన తర్వాత విజయనగర యువ రాజు వేంకటరాజా ఈ గ్రామాన్ని సమీపంలోని కొండ ప్రాంతానికి తరలించాడని చరిత్ర. అందువల్ల ఈ గ్రామానికి పత్తికొండ అనే పేరు వచ్చిందని గ్రామస్థులు అంటున్నారు.

News December 23, 2024

నేడు కలెక్టరేట్‌లో ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ

image

నంద్యాల పట్టణం కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్ హలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించనున్నట్లు కలెక్టర్ రాజకుమారి తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే ప్రక్రియను పబ్లిక్ గ్రీవెన్స్ ద్వారా చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 9:15 గంటలకు అధికారులు హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు.

News December 22, 2024

చిరుత సంచారంపై ఫారెస్టు అధికారి ఆరా

image

పెద్దకడబూరులోని 76 కాలువ సమీపంలో పిల్లగుండ్లు పరిసర పొలాల్లో వారం రోజులుగా చిరుత సంచారం కలకలం రేపుతోంది. చిరుత సంచారానికి సంబంధించి దాని పాదాల జాడలు పొలాల్లో కనిపించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సమాచారం తెలుసుకున్న ఫారెస్టు అధికారి సమీవుల్లా చిరుత సంచారంపై పొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి, చిరుత జాడలను పరిశీలించారు. చిరుత కనిపిస్తే సమాచారం ఇవ్వాలని రైతులకు సూచించారు.

News December 22, 2024

రోడ్డు ప్రమాదంలో నర్సు మృతి

image

దోర్నాల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీశైల దేవస్థానం వైద్యశాల నర్సు మల్లిక మృతి చెందారు. శ్రీశైలానికి చెందిన ఆమె.. భర్త, పాపతో కలిసి కర్నూలుకు షాపింగ్ నిమిత్తం నిన్న వెళ్లారు. రాత్రి పుష్ప-2 సినిమా చూసి, తిరుగు పయనమయ్యారు. తెల్లవారుజామున మంచు కారణంగా వారు ప్రయాణిస్తున్న కారు టూరిస్ట్ బస్సును ఢీకొంది. మల్లిక అక్కడికక్కడే మృతి చెందగా.. ఆమె భర్త, పాపకు ఏమీ కాలేదని వారి సన్నిహితులు తెలిపారు.