India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కర్నూలు జిల్లాలో మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ బుధవారం పేర్కొన్నారు. ఆయా మండలాల్లోని పోలీసు స్టేషన్లలో పబ్లిక్ ప్రదేశాల్లో క్యూఆర్ కోడ్లు ఏర్పాటు చేసి, వాటిని స్కాన్ చేసి డ్రగ్స్ సంబంధించిన సమాచారం తెలపాలని ప్రజలను కోరుతున్నారు.

డబ్బు కోసం యువతిని నగ్న చిత్రాలతో బెదిరిస్తున్న కర్నూలు(D) కల్లూరు(M) తటకనాపల్లికి చెందిన హరీశ్ను అరెస్టు చేసినట్లు ఆలమూరు SI అశోక్ తెలిపారు. కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు చెప్పారు. మూడేళ్ల క్రితం ఓ యాప్ ద్వారా యువతి పరిచయమైందని తెలిపారు. నగ్నంగా వీడియో కాల్ మాట్లాడటంతో స్క్రీన్ షాట్స్ తీసి మూడు ఇన్స్టా ఖాతాల్లో పోస్ట్ చేసి వేధించాడని వెల్లడించారు.

కర్నూలులోని డీమార్ట్ వెనక ఉన్న టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో నలుగురిని నాల్గో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ బాబు ప్రసాద్ వివరాల ప్రకారం.. టీడీపీ కార్యాలయంపై ప్రభాకర్ నాయుడు, కాశీ, రహంతుల్లా, సలాంఖాన్ దాడికి పాల్పడ్డారు. వేటకొడవళ్లు, కత్తులతో కార్యాలయంలోని శేఖర్ గౌడ్పై దాడికి యత్నించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.

ప్రభుత్వ కాలేజీలో చదివి ఇంటర్లో 987 మార్కులు సాధించిన యువతి ధృతికాబాయిని మంత్రి నారా లోకేశ్ సన్మానించారు. ల్యాప్ టాప్, గోల్డ్ మెడల్ అందజేసి అభినందించారు. ధృతికాబాయి ఎమ్మిగనూరులోని బనవాసి గురుకుల జూనియర్ కళాశాలలో చదివారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులు ప్రభుత్వ విద్య పరువును కాపాడారని మంత్రి అన్నారు.

గూడూరులో పుష్పరాజ్, ఉదయ్ కిరణ్, ఫయాజ్ అనే యువకులను కర్నూలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వారిపై గుంటూరులో సైబర్ క్రైం కేసు నమోదైంది. వారి ఆదేశాల మేరకు వీరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

చిప్పగిరి మండలంలోని నేమకల్లు గ్రామ పశువైద్య అధికారిగా కమలమ్మ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ పనిచేసిన మహేశ్ ఇతర విధుల బాధ్యతల కారణంగా వెళ్లడంతో ఆమె ఈ విధుల్లో చేరారు. ఆమె మాట్లాడుతూ రైతులకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కరిస్తామన్నారు. పశువులకు వచ్చే రోగాలకు వెంటనే టీకాలు వేయించుకోలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో పశు వైద్యశాలకు వచ్చినా వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

కర్నూలు జిల్లాలో 21,92,047 రేషన్ కార్డులలో 19,56,828 యూనిట్లకు ఈకేవైసీ పూర్తి కాగా, 1,82,991 యూనిట్లకు ఇంకా పూర్తి చేయాల్సి ఉందని జేసీ నవ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈకేవైసీ పూర్తి కాని వ్యక్తుల పేర్లు ఈపీఓఎస్ మెషిన్లో రెడ్ మార్కుతో చూపిస్తుందన్నారు. ఏప్రిల్ 30 లోపు ఎన్ఎఫ్ఎస్ఓ కార్డుదారులు దేశవ్యాప్తంగా, ఎన్ఎన్ఎఫ్ఎస్ఓ కార్డు దారులు రాష్ట్రంలో ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చని తెలిపారు.

➤ ఉమ్మడి కర్నూల్ జిల్లాలో 240 పోస్టులు.!
➤కర్నూలులో మెరుగైన వైద్యం: మంత్రి భరత్
➤ కొలిమిగుండ్ల: ఉద్యోగం రాక యువకుడి ఆత్మహత్య
➤ ఆళ్లగడ్డలో టీడీపీ నేతపై దుండగుల దాడి
➤ మహానందిలో మిస్టరీగానే వ్యక్తి మరణం
➤ దేవనకొండ: హార్ట్ స్ట్రోక్తో యువకుడి మృతి
NOTE: ‘‘పైన టూల్ బార్లో లొకేషన్ మీద, తర్వాత ‘V’ సింబల్ని క్లిక్ చేసి మన గ్రామ/మండల/నియోజకవర్గ/జిల్లా ఎడిషన్ వార్తలను కేవలం 5 నిమిషాల్లోనే తెలుసుకోండి.

మహానంది సమీపంలోని అరటి తోటలో నిన్న గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుడి వివరాల కోసం రంగంలోకి దిగన ఫోరెన్సిక్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది నమూనాలను సేకరించారు. ఇదిలా ఉండగా మృతదేహానికి ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మహానందిలోని ఈశ్వర్ నగర్ శివారులో ఉన్న శ్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు. మృతి చెందిన వ్యక్తి ఎవరనేది ఇప్పటికీ మిస్టరీగానే మారింది.

నంద్యాలలో కొన్ని నెలలుగా చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. మద్దికేర గ్రామానికి చెందిన దూదేకుల షాహిద్, పందిపాడు గ్రామానికి చెందిన దూదేకుల దస్తగిరిని సోమవారం అరెస్టు చేసి వారి నుంచి బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఒంటరి మహిళలే టార్గెట్గా దొంగతనాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.