India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం అల్లుగుండు ప్రభుత్వ పాఠశాలలో టీచర్ మునీర్ అహ్మద్ కిడ్నాప్ అయినట్టు తెలుస్తోంది. క్లాస్ రూములో ఉండగానే కిడ్నాప్ చేశారంటూ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మునీర్ అహ్మద్ కిడ్నాప్ కావడం ఇది మూడోసారి అని, కర్నూలు సెంట్రల్ స్కూల్ వెనుక రూ.20 కోట్లు విలువ చేసే భూ వివాదంలో కిడ్నాప్ చేశారని ఆరోపిస్తున్నారు. మునీర్ అహ్మద్ సోదరుడు మక్బూల్ బాషా కూడా కనిపించడం లేదని అంటున్నారు.
గడివేముల మండల విలేకరి మహబూబ్ బాషా గుండెపోటుతో ఆదివారం తెల్లవారుజామున మృతిచెందారు. 4 రోజుల నుంచి అస్వస్థతతో చికిత్స తీసుకుని కోలుకున్నారు. శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో ‘Iam Back’ అంటూ వాట్సప్ స్టేటస్ పెట్టారు. అయితే నేడు అకాల మరణంతో కుటుంబ సభ్యులు, తోటి విలేకరులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈయన APUWJ సభ్యుడిగా పాత్రికేయ
రంగానికే వన్నెతెచ్చిన వ్యక్తిగా పేరు గడించారని పలువురు విలేకరులు కొనియాడారు.
మతిస్థిమితం లేని మహిళపై ఆత్యాచారం చేసిన జోగి హనుమంతును శనివారం రిమాండుకు తరలించినట్లు సీఐ మస్తాన్ వల్లి తెలిపారు. గత నెల 17న మతిస్థిమితం లేని మహిళను ఆదోనిలో అనాథాశ్రమంలో చేర్పిస్తానని మహిళ తల్లిదండ్రులతో నచ్చజెప్పి తీసుకొని జోగి హనుమంతు తన స్వగ్రామం ఆస్పరి మండలం ముత్తుకూరుకు తీసుకొచ్చాడు. ఇంటిలో బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అరెస్టు చేసి, రిమాండ్కు పంపామన్నారు.
నంద్యాల జిల్లాలో మత్స్య శాఖ వనరులను అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ జీ.రాజకుమారి మత్స్య శాఖ ఉప డైరెక్టర్ రాఘవరెడ్డిని ఆదేశించారు. శనివారం కలెక్టర్ ఛాంబర్లో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. అత్యల్పంగా చేపల పెంపకం మన జిల్లాలోనే ఉందన్నారు. మత్స్య సంపద అభివృద్ధి చెందడానికి కృషి చేయాలన్నారు.
కర్నూలు జిల్లా పరిధిలో ఈనెల ప్రారంభమైన రెవెన్యూ సదస్సులో ఇప్పటి వరకు 5,586 అర్జీలు స్వీకరించినట్లు జిల్లా కలెక్టర్ పీ.రంజిత్ బాషా పేర్కొన్నారు. అలాగే శనివారం ఆదోని రెవెన్యూ డివిజన్లోని కుర్నూరులో 11, పూలచింతలో 4, రాళ్లదొడ్డిలో 15, ఆగశన్నూరులో 11, కగళ్లులో 2, ముచ్చగేరిలో 1, ఆరెకల్లో 35, మార్లమడికిలో 13, కౌతాళంలో 51, పలు గ్రామాల్లో భూ సమస్యలపై అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు.
ప్రజలు, రైతులు తమ సమస్యలపై రెవిన్యూ సరస్సులలో అందించిన దరఖాస్తులను ఆన్లైన్లో పొందుపరచాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. శనివారం కలెక్టర్ ఛాంబర్ నుంచి జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులకు సూచనలు, సలహాలు చేశారు. నిర్ణీత సమయంలోపు అర్జీలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. తహశీల్దార్ ఆఫీసులలో రికార్డు రూములు సక్రమంగా ఉంచుకోవాలన్నారు.
వెల్దుర్తి జడ్పీ బాలుర పాఠశాలను శనివారం డీఈవో శ్యాముల్ పాల్ తనిఖీ చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన PAL ల్యాబ్లను, తరగతి గదిని తనిఖీ చేశారు. తరగతి గది దుమ్ము, ధూళి, చెత్తాచెదారంతో ఉండి కనీస వెలుతురు లేకుండా ఉండటంతో ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు బోధనను, టెక్నాలజీని సులభతరంగా అర్థం చేసుకోవడానికి ప్రభుత్వం PAL ల్యాబ్లను తీసుకుని వచ్చిందన్నారు.
ఆటో డ్రైవర్ గొప్ప మనసు చాటుకున్నాడు. దివ్యాంగురాలిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఆదర్శంగా నిలిచాడు. సీ.బెళగల్(మం) పొనకల్కు చెందిన దివ్యాంగురాలు వెంకటేశ్వరమ్మ, గూడూరు(మం) సంగాలకు చెందిన ఆటో డ్రైవర్ మద్దిలేటి ప్రేమించుకున్నారు. నందవరం(మం) గురజాలలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో దివ్యాంగుల సాధికారత ఫోరం JAC అధ్యక్షుడు నాగరాజు సమక్షంలో శనివారం పెళ్లి చేసుకుని ఇద్దరూ ఒక్కటయ్యారు.
కర్నూలులోని ఓ పాఠశాల ఆవరణలో 441 మంది విద్యార్థులతో 1వ ప్రపంచ ధ్యాన దినోత్సవ వేడుకలను శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి పుల్లారెడ్డి కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ సురేశ్, ప్రధానోపాధ్యాయురాలు మీనాక్షి హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం విద్యావేత్త రాజశేఖర్ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు ప్రతిరోజూ క్రమం తప్పకుండా ధ్యానం చేయాలని సూచించారు.
ఇష్టం లేని పని చేయలేక ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం అనంతపురంలో చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దతుంబలంకి చెందిన శివ (14) తల్లిదండ్రుల బలవంతంపై అనంతపురంలో తన అన్నతో కలిసి సెంట్రింగ్ పనులు చేస్తున్నాడు. తాను వ్యవసాయం చేసుకుంటానని సెంట్రింగ్ పనులు చేయలేనని తల్లిదండ్రులకు చెప్పినా వినకపోవడంతో అనంతపురంలోని తన గదిలో ఉరేవేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు టూ టౌన్ పోలీసులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.