India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కర్నూలు జిల్లాలో విషాద ఘటన జరిగింది. గద్వాల జిల్లా వడ్డేపల్లి(M) పైపాడుకు చెందిన వీరేశ్ కూలీ పనులకు కర్నూలు జిల్లా గోనెగండ్ల(M) ఎన్గోడ్కు వచ్చారు. ఇదే ఊరిలో శుక్రవారం ఓ శుభకార్యం జరిగింది. వీరేశ్ కుమారుడు జగదీశ్(6) ఫోన్తో ఆడుకుంటూ సాంబార్ గిన్నెపై కూర్చున్నాడు. మూత జారిపోవడంతో సాంబారులో పడిపోయాడు. కేకలు విన్న తల్లిదండ్రులు వెంటనే కర్నూలుకు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు.
YCP సోషల్ మీడియా యాక్టివిస్టులకి అండగా నిలిచేందుకు ఉమ్మడి జిల్లాల వారీగా పలువురు నేతలతో కూడిన బృందాలను YCP నియమించింది. YCP అధినేత వైఎస్ జగన్ ఆదేశాలతో ఆ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి మాజీ MLA హఫీజ్ ఖాన్, ఆలూరు YCP నేత సురేందర్ రెడ్డి నియమితులయ్యారు.
కర్నూలు కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం జిల్లా రోడ్ల భద్రత చర్యలపై కమిటీ సమావేశంను జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, ఎస్పీ జి. బిందు మాధవ్ ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. జిల్లాలో రోడ్డు భద్రత నియమాలు పాటించే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టరు, ఎస్పీ అధికారులకు సూచించారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో శుక్రవారం కర్నూలు, నంద్యాల జిల్లాలో వర్షాలు కురిసే అవకాశముందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కాగా ఇది పంట చేతికి వచ్చే సమయం కావడంతో వర్షం సూచనలు రైతులను బెంబెలేత్తిస్తున్నాయి. ఆరుగాలం పండించిన పంట నీటి పాలవుతుందేమోనని భయాందోళనకు గురువుతున్నారు. పంటను కాపాడుకునేందుకు అవస్థలు పడుతున్నారు.
కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలంలోని కుందూ నదిలో దూకబోతున్న విద్యార్థిని కానిస్టేబుల్ నాగిరెడ్డి కాపాడినట్లు ఎస్ఐ జగన్మోహన్ తెలిపారు. ఎస్ఐ వివరాల మేరకు.. నంద్యాల మండలం చాబోలుకి చెందిన ఓ విద్యార్థి బడికి వెళ్లడం లేదని తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపం చెందిన విద్యార్థి ఆత్మహత్యకు యత్నించగా కానిస్టేబుల్ నాగిరెడ్డి గమనించి కాపాడారు. తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.
రాష్ట్రంలో సీఎం చంద్రబాబు పాలనలతోనే మైనార్టీల సంక్షేమం సాధ్యపడుతుందని రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన మౌలానా ముస్తాక్ అహ్మద్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం వెలుగోడు పట్టణంలోని అరబిక్ కళాశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీలో పనిచేసే ప్రతి కార్యకర్తకు తప్పనిసరిగా గుర్తింపు ఉంటుందని, అందుకు తానే చక్కటి ఉదాహరణ అని వెల్లడించారు.
ఆదోని పట్టణంలోని మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లో పోసాని కృష్ణ మురళిపై జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. వైసీపీ హయాంలో పవన్ కళ్యాణ్పై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారని జనసేన పట్టణ అధ్యక్షుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. అదే విధంగా పత్తికొండలో టీడీపీ నాయకులు పోసానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నటుడు పోసాని కృష్ణ మురళిపై చర్యలు తీసుకోవాలని బనగానపల్లి జర్నలిస్టు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. TTD ఛైర్మన్ బీఆర్ నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసానిపై చర్యలు తీసుకోవాలని సీఐ ప్రవీణ్ కుమార్కు వారు వినతిపత్రం అందజేశారు. ఆ వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామని తెలిపారు. వెంకటసుబ్బయ్య, గుర్రప్ప, రామచంద్రారెడ్డి, వెంకటేశ్వర్లు, జవహర్, వెంకట రాముడు, శేఖర్, ఓబులేసు, నాగేశ్, సుధాకర్ పాల్గొన్నారు.
నంద్యాల జిల్లా వెలుగోడు పట్టణం ఎస్సీ కాలానికి చెందిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై విష్ణు నారాయణ వివరాల మేరకు.. తల్లిదండ్రులు బయటకి వెళ్లిన సమయంలో 19 ఏళ్ల యువతి ఇంట్లో ఉరేసుకుంది. బంధువుల ఇంటికెళ్లి తిరిగొచ్చిన తల్లిదండ్రులు కూతురి బలవన్మరణాన్ని గమనించి బోరున విలపించారు. అయితే ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
కర్నూలు జిల్లా కోసగి మండలంలో 13ఏళ్ల బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డ వైసీపీ నేత, సర్పంచ్ హుసేనిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు కార్యకర్తలు వినోద్, సూరిని కూడా అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు ఎస్సై చంద్రమోహన్ చెప్పారు. వారిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు వివరించారు. అత్యాచారయత్నం అనంతరం పరారీలో ఉన్న నిందితులను కోసిగి గ్రామ శివారులో అదుపులో తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.