Kurnool

News March 30, 2025

కర్నూలు జిల్లాలో చికెన్ ధర రూ.200

image

కర్నూలు జిల్లాలో పలు చోట్ల చికెన్ ధర రూ.200 నుంచి రూ.220 వరకు పలుకుతోంది. కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, తదితర ప్రాంతాల్లో లైవ్ కోడి కిలో రూ.120 ఉండగా.. స్కిన్‌ రూ.180, స్కిన్ లెస్ రూ.200 చొప్పున విక్రయిస్తున్నారు. 2 నెలల క్రితం రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కలకలం నేపథ్యంలో చికెన్ అమ్మకాలు తగ్గి, మటన్, చేపల విక్రయాలు పెరిగాయి. దీంతో కిలో మటన్ రూ.900, చేపలు రూ.300 చొప్పున అమ్ముతున్నారు.

News March 30, 2025

కర్నూలు జిల్లా ప్రజలకు ఎస్పీ విజ్ఞప్తి

image

మార్చి 31న రంజాన్ పండుగ ను పురస్కరించుకొని సోమవారం పోలీస్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రిసల్ సిస్టం) కార్యక్రమంను రద్దు చేస్తున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు సుదూర ప్రాంతాల నుంచి వ్యయప్రయాసలతో పీజీఆర్ఎస్ కార్యక్రమానికి రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

News March 30, 2025

ఒకే కుటుంబంలో ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు

image

క్రిష్ణగిరి మండల పరిధిలోని పెనుమాడలో ఇటీవల విడుదలైన ప్రభుత్వ ఉద్యోగాలలో ఒకే కుటుంబంలో 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినట్లు గ్రామస్థులు తెలిపారు. ఇందులో ఇద్దరు అసిస్టెంట్ లోకో పైలట్, ఇద్దరు జిల్లా కోర్టులో ప్రాసెస్ సర్వర్, ఒకరు ఏపీ హైకోర్టులో సబర్డినేట్ ఉద్యోగాలు సాధించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. మారుమూల గ్రామంలో ఉద్యోగాలు రావడంతో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు.

News March 30, 2025

పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దు: కలెక్టర్

image

ఈనెల 31న రంజాన్ పండుగను పురస్కరించుకొని సోమవారం కర్నూలు కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రిసల్ సిస్టం) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు లెక్టర్ పీ.రంజిత్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి, వ్యయ ప్రయాసలతో జిల్లా కేంద్రానికి రావొద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

News March 30, 2025

చలివేంద్రాలు, మజ్జిగ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేయండి: కలెక్టర్

image

రోజురోజుకూ ఎండ వేడిమి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడకుండా ఆయా శాఖల పరంగా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పీ.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. శనివారం హీట్ వేవ్‌కు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చేయాల్సిన ఏర్పాట్లపై కలెక్టర్ సంబంధిత శాఖల జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి గ్రామంలో చలివేంద్రాలు, మజ్జిగ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.

News March 29, 2025

ఈ ఉగాది, రంజాన్ ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలి: ఎస్పీ

image

జిల్లా ప్రజలకు తెలుగు నూతన సంవత్సరము ఉగాది, రంజాన్ పండుగ శుభాకాంక్షలను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఈ ఉగాది ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. రంజాన్ పండుగను ముస్లిం సోదర, సోదరీమణులందరూ సంతోషంగా జరుపుకోవాలని కోరారు. అల్లాహ్ దీవెనలతో జిల్లా ప్రజలకు సకలశుభాలు కలగాలని పేర్కొన్నారు.

News March 29, 2025

తాగునీటి సమస్య లేకుండా తగిన చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

జిల్లాలో తాగునీటి సమస్య లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని, అన్ని గ్రామాలు తిరిగి, తాగునీటి సమస్యలు ఉన్న చోట వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పీ.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. శనివారం తాగునీటి సమస్యల పరిష్కారం, ఉపాధి హామీ పనుల పురోగతిపై అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రెండు రోజుల్లో తాగునీటి సమస్య పరిష్కారంపై నివేదికను పంపించాలి అధికారులను ఆదేశించారు.

News March 29, 2025

వొకేషనల్ పరీక్షకు 117 మంది గైర్హాజరు: డీఈవో

image

పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా శనివారం జరిగిన వొకేషనల్ సబ్జెక్టులో 117 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేదని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ వెల్లడించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా జరిగిన పరీక్షల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని అన్నారు. పరీక్షలు పకడ్బందీగా, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా నిర్వహించామన్నారు.

News March 29, 2025

ఊపిరి ఉన్నంత వరకు టీడీపీలోనే: కర్నూలు ఎంపీ

image

తన లాంటి సామాన్యుడిని ఎంపీని చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తెలిపారు. శనివారం కర్నూలులో జరిగిన టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. ఊపిరి ఉన్నంత వరకు తాను టీడీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ పాలన సాగిస్తున్నారని చెప్పారు. టీడీపీ పేదల పార్టీ అని తెలిపారు.

News March 29, 2025

భర్త చేతిలో భార్య దారుణ హత్య

image

ఉమ్మడి కర్నూలు జిల్లా వెలుగోడు మండలం మోత్కూర్ గ్రామం మజార తిమ్మనిపల్లిలో భార్యను భర్త హత్య చేశాడు. పశువుల లక్ష్మీదేవి(35)ని భర్త చిన్న మధుకృష్ణ శుక్రవారం మధ్యాహ్నం గొడ్డలితో తలపై కొట్టగా బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.