India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆ దంపతులకు పెళ్లై ఐదేళ్లు. ఏళ్ల తర్వాత భార్య గర్భం దాల్చడంతో ఆ కుటుంబంలో ఆనందానికి అవధుల్లేవు. ఐదో నెల కావడంతో సీమంతాన్ని గ్రాండ్గా చేశారు. ఇంతలోనే విధి వెక్కిరించింది. రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో జరిగింది. చిగిళికి చెందిన వీరేశ్(33) భార్య రాజేశ్వరి సీమంతం తర్వాత చిన్నమ్మను ఆటోలో బస్తాండుకు తీసుకెళ్తుండగా ట్రక్ ఢీకొంది. ఆయన అక్కడికక్కడే మృతిచెందారు.
ఓర్వకల్ ఇండస్ట్రియల్ పార్క్.. సెమీ కండక్టర్ రంగంలో రూ.14,000 కోట్ల పెట్టుబడిని అందుకుందని మంత్రి టీజీ భరత్ తెలిపారు. ‘ఈ ప్రాజెక్ట్ ఓర్వకల్లు పారిశ్రామికవాడలో పారిశ్రామిక వృద్ధిని పెంచడమే కాక, అనేక ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. రాబోయే తరాలకు ఆర్థిక శ్రేయస్సును అందిస్తుంది. కర్నూలును ఆవిష్కరణలు, పురోగతికి కేంద్రంగా మార్చాలనే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ నిబద్ధతకు నిదర్శనం’ అని ట్వీట్ చేశారు.
నంద్యాలలో మిస్సింగ్ అయిన మహిళ ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. ఈనెల 19న ‘నంద్యాల మహిళ <<14917909>>మిస్సింగ్<<>>’ అనే కథనాన్ని Way2News ప్రచురించింది. ఈ కథనం వైరల్ కావడంతో కొందరు ఆ మహిళను గుర్తించారు. Way2News తెలియపరిచిన పోలీసుల 9121101087, 9951093349 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో మహిళను కుటుంబ సభ్యుల చెంతకు చేర్చారు. భార్యాభర్తలకు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.
ధనుర్మాసం ప్రారంభమైంది. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో మహిళలు ఉదయాన్నే ఇంటి వాకిటను శుభ్రం చేసి ముగ్గులు వేస్తారు. న్యూ ఇయర్, సంక్రాంతి వరకు రంగురంగుల రంగవళ్లులను తీర్చిదిద్దుతుంటారు. మరి మీ అందమైన ముగ్గులను మాకు పంపండి. మీ పేరుతో Way2Newsలో మేము పబ్లిష్ చేస్తాం.
● ఇలా పంపండి: ముగ్గు ఫొటో, మీ పేరు, ఊరి పేరు, పాస్పోర్టు సైజు ఫొటోను 97036 22022కు వాట్సాప్ చేయండి.
కానిస్టేబుల్ అభ్యర్థుల శారీరక సామర్థ్య పరీక్షల కోసం సిద్ధం చేస్తున్న ఏర్పాట్లను కర్నూలు జిల్లా ఎస్పీ బిందుమాధవ్ పరిశీలించారు. శారీరక ధారుఢ్య పరీక్షలు నిర్వహించే ఏపీఎస్సీ రెండో బెటాలియన్ మైదానాన్ని పరిశీలించి, చేపట్టాల్సిన పనులపై పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రాథమిక రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ నెల 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు జరగనున్నాయని తెలిపారు.
కానిస్టేబుల్ అభ్యర్థుల శారీరక సామర్థ్య పరీక్షల కోసం సిద్ధం చేస్తున్న ఏర్పాట్లను కర్నూలు జిల్లా ఎస్పీ బిందుమాధవ్ పరిశీలించారు. శారీరక ధారుఢ్య పరీక్షలు నిర్వహించే ఏపీఎస్సీ రెండో బెటాలియన్ మైదానాన్ని పరిశీలించి, చేపట్టాల్సిన పనులపై పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రాథమిక రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈనెల 30వ తేది నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు జరగనున్నాయని తెలిపారు.
నైరుతి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం కొనసాగుతుందని ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. దీని ప్రభావంతో శుక్రవారం కర్నూలు, నంద్యాల జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ధనుర్మాసం ప్రారంభమైంది. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో మహిళలు ఉదయాన్నే ఇంటి వాకిటను శుభ్రం చేసి ముగ్గులు వేస్తారు. న్యూ ఇయర్, సంక్రాంతి వరకు రంగురంగుల రంగవళ్లులను తీర్చిదిద్దుతుంటారు. మరి మీ అందమైన ముగ్గులను మాకు పంపండి. మీ పేరుతో Way2Newsలో మేము పబ్లిష్ చేస్తాం.
● ఇలా పంపండి: ముగ్గు ఫొటో, మీ పేరు, ఊరి పేరు, పాస్పోర్టు సైజు ఫొటోను 97036 22022కు వాట్సాప్ చేయండి.
రైతుల భూ సమస్యలు పరిష్కరించడమే రెవెన్యూ సదస్సుల లక్ష్యమని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. గురువారం ప్యాపిలి మండలం బూరుగలలో రెవెన్యూ సదస్సులో ఆమె పాల్గొన్నారు. రైతులకు ఏ సమస్య వచ్చినా రెవెన్యూ అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రజల నుంచి భూ సంబంధిత సమస్యలపై వినతిపత్రాలు స్వీకరించి, త్వరతిగతిన పరిష్కరించాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
కర్నూలు జిల్లా అస్పరి మండలంలోని ఓ గ్రామంలో మతిస్థిమితం లేని ఓ మహిళ(35)పై బుధవారం హనుమంతు అనే కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మహిళను ఆశ్రమంలో విడిచిపెడతానని తల్లిదండ్రులకు నచ్చజెప్పి తీసుకెళ్లిన అతను.. ఆశ్రమానికి తీసుకెళ్లకుండా తన ఇంటికి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ట్రైనీ డీఎస్పీ ఉషశ్రీ తెలిపారు.
Sorry, no posts matched your criteria.