India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కర్నూలు ఓటర్ల జాబితాలో ఓటు లేకపోతే వెంటనే నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సృజన తెలిపారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 15 వరకు గడువు ఉందని ఆమె పేర్కొన్నారు. జిల్లాల్లో మొత్తం 20,30,377 మంది ఓటర్లు ఉన్నారని, ఇందులో పురుషులు 10,01,971, స్త్రీలు 10,28,096 మంది కాగ, ఇతరులు 310 ఉన్నారు. ఇప్పటికి ఓటరు జాబితాలో పేరు లేని వాళ్ళు నమోదు చేసుకోవాలని తెలిపారు.
పెద్దకడబూరు మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో పదో తరగతి పరీక్షలకు హాజరైన సింధు అనే విద్యార్థిని అస్వస్థతకు గురైన ఘటన మంగళవారం జరిగింది. పరీక్ష హాల్లో అస్వస్థతకు గురై ఒక్కసారిగా కుప్పకూలడంతో అధికారులు, ఎస్ఐ మహేశ్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక పీహెచ్సీకి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్లో ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు.
శ్రీశైలానికి 20 కి.మీ దూరం గల దట్టమైన అభయారణ్యంలో వెలసిన కోరిన కోరికలు తీర్చే ఇష్టకామేశ్వరి అమ్మవారిని సినీ దర్శకులు సముద్ర ఖని మంగళవారం దర్శించుకున్నారు. మల్లన్న దర్శనార్థమై వచ్చిన ఆయన ముందుగా నల్లమల అటవీ ప్రాంతంలోని ఇష్టకామేశ్వరి దేవాలయాన్ని సందర్శించి అనంతరం శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట స్థానికుడు కోటి ఉన్నారు.
ఐదేళ్ల చిన్నారి రోజంతా గదిలో బందీ అయిన ఘటన కర్నూలు ఆసుపత్రిలో జరిగింది. ఓర్వకల్లు(M) తిప్పాయిపల్లెకు చెందిన ఉస్సేనయ్య, మౌనికల కొడుకు సుజిత్ పుట్టుకతో మూగ, చెవుడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరారు. ఆదివారం తల్లి బయటకు వెళ్లగా బాలుడు ఎనస్థీషీయా HOD గదిలోకి వెళ్లాడు.గదిని శుభ్రంచేసి బాలుడిని గమనించకుండా తాళం వేశారు. వెతికినా బాలుడి ఆచూకీ లభించలేదు. సోమవారం గది తలుపులు తెరవగా సుజిత్ అందులో ఉన్నారు.
కర్నూలు జిల్లాలో 14మంది ఎమ్మెల్యే, 2 ఎంపీ అభ్యర్థులను వైసీపీ అదిష్ఠానం ప్రకటించింది. వీరిలో 1988లో జన్మించిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థి గంగుల బ్రిజేంద్రారెడ్డి అందరికంటే వయస్సులో చిన్నవారు. ఆయన తర్వాత స్థానంలో 1988లో జన్మించిన నంద్యాల శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఉన్నారు. అందరి కంటే ఎక్కువ వయస్సు కల్గిన అభ్యర్థిగా 1954లో జన్మించిన నంద్యాల ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మానందరెడ్డి ఉన్నారు.
ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమైనట్లు క్యాంపు ఆఫీసర్, ఆర్ఐఓ ఎస్విఎస్ గురువయ్య శెట్టి వెల్లడించారు. సోమవారం కర్నూలులోని టౌన్ మోడల్ జూనియర్ కళాశాలలో మూల్యాంకనం జరిగిందన్నారు. ప్రతిరోజు మూల్యాంకనానికి హాజరయ్యే అధ్యాపకులు ఉదయం నుంచి సాయంత్రం వరకు తప్పనిసరిగా క్యాంపులో ఉండాలన్నారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు 15, మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు 15 జవాబు పత్రాలను మూల్యాంకనం చేయాల్సి ఉంటుందన్నారు.
కర్నూలు జిల్లా వ్యాప్తంగా టెన్త్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. ఎక్కడా వాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పరీక్ష నిర్వహించారు. మొదటి రోజు పరీక్షకు 33,144 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా.. 32,334 మంది మాత్రమే హాజరయ్యారు. 810 మంది గైర్హాజరయ్యారు. సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు దాదాపుగా 44 పరీక్ష కేంద్రాలను పరిశీలించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కే.శామ్యూల్ వెల్లడించారు.
కోడ్ ఉల్లంఘన ఫిర్యాదులను వివిధ మాధ్యమాల ద్వారా స్వీకరించడం జరుగుతోందని కలెక్టర్ జి.సృజన తెలిపారు. ఫిర్యాదులను సీ-విజిల్ యాప్లో కానీ, హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కానీ, కర్నూలు జిల్లా టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 7755కు కానీ, కాల్ సెంటర్ 08518-220125కు కానీ ఫిర్యాదు చేయవచ్చన్నారు. ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేసే వారు డిఐపిఆర్ఓ_కర్నూలు ట్విట్టర్ అకౌంట్కు ఫిర్యాదును ట్యాగ్ చేయవచ్చన్నారు.
కర్నూలు రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో పీజీ సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. సోమవారం జరిగిన పీజీ కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షకు సోమవారం నాడు 90 శాతం విద్యార్థులు హాజరైనట్లు యూనివర్శిటీ అధికారులు వెల్లడించారు. మొత్తం 558 మంది విద్యార్థులకు గాను.. 53 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని పేర్కొన్నారు.
జాతీయ సమ సమాజం పార్టీ నుంచి కర్నూలు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఏపీ రామయ్య యాదవ్ తెలిపారు. సమాజ హితం కోసం సమసమాజ స్థాపనకై తమ పార్టీ ఆవిర్భవించిందని స్పష్టంచేశారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలు ప్రజల తాగునీటి సమస్యను తీర్చి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి కృషి చేస్తానని అన్నారు. ప్రజలు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే కర్నూలును అభివృద్ధి చేస్తానన్నారు.
Sorry, no posts matched your criteria.