Kurnool

News November 11, 2024

యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా రవికుమార్, నవీన్ పాటి

image

యూటీఎఫ్ కర్నూలు జిల్లా నూతన కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా రవికుమార్, నవీన్ పాటి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గూడూరులో జరిగిన జిల్లా స్వర్ణోత్సవ మహాసభల్లో నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా రవికుమార్, ప్రధాన కార్యదర్శిగా నవీన్ పాటి, ఆర్థిక కార్యదర్శిగా యెహోషువ, సహాధ్యక్షులుగా హేమంత్ కుమార్, జీవిత, గౌరవాధ్యక్షుడిగా దావీదు ఎన్నికయ్యారు.

News November 11, 2024

పరిశ్రమలు & వాణిజ్య శాఖకు రూ.3,127 కోట్లు

image

2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పరిశ్రమలు & వాణిజ్య శాఖకు రూ.3,127 కోట్లతో బడ్జెట్ కేటాయింపును ఆ శాఖ మంత్రి టీజీ భరత్ అసెంబ్లీలో ప్రతిపాదించారు. పారిశ్రామిక అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చేందుకు పారిశ్రామిక అభివృద్ధి పాలసీ 4.0 తీసుకొచ్చామని, పారిశ్రామిక వాడల ఏర్పాటు ప్రత్యేక విధానం తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు.

News November 11, 2024

కర్నూలు నుంచి రాజమండ్రి జైలుకు వైసీపీ నేత తరలింపు

image

వైసీపీ నేత బోరుగడ్డ అనిల్‌ను కర్నూలు నుంచి రాజమండ్రి జైలుకు తరలించారు. ఆదివారం రాత్రి కర్నూలు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఆయనకు కస్టడీ ముగియడంతో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కోర్టులో హాజరుపరిచారు. అనిల్‌కు 14 రోజుల రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేశ్‌పై సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో దూషించారంటూ టీడీపీ నేతలుఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

News November 11, 2024

నేడు ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు: మంత్రి ఫరూక్

image

తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఇవాళ మైనారిటీ సంక్షేమ దినోత్సవం నిర్వహించనున్నట్లు మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. ముఖ్య అతిథులుగా CM చంద్రబాబు, డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఏర్పాట్లను పరిశీలించారు. భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ 137వ జయంతి సందర్భంగా నేడు జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందజేయనున్నారు.

News November 11, 2024

కర్నూలు, నంద్యాల జిల్లాల ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గళం వినిపిస్తారా?

image

నేటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు ఉమ్మడి కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఎన్నికల అనంతరం జరుగుతున్న తొలి బడ్జెట్ సమావేశం కావడంతో ప్రజల్లోనూ, నాయకుల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలకు ముందు గ్రామ సమస్యలు, యువతకు ఉద్యోగాలు వంటి అంశాలపై ఎన్నికైన ఎమ్మెల్యేలు హామీలు గుమ్మరించారు. మరి వాటి అమలుకు నిధులు వచ్చేలా అసెంబ్లీలో గళం వినిపిస్తారా, లేదా? మీరేమంటారు?

News November 11, 2024

నంద్యాల: భక్తులతో కళకళలాడుతున్న శైవ క్షేత్రాలు

image

కార్తీక మాసం రెండో సోమవారం కావడంతో నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రాలు భక్తులతో కళకళలాడుతున్నాయి. వేకువజాము నుంచి ఆలయాలకు చేరుకొని పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం కార్తీక దీపాలు వెలిగించి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. శ్రీశైలం, మహానంది, యాగంటి, ఓంకారం, రుద్రకోడూరు, భోగేశ్వరం ఆలయాలు కిటకిటలాడుతున్నాయి.

News November 11, 2024

కర్నూలు: 1988-1993 పూర్వ విద్యార్థుల సమ్మేళ్లనం

image

తుగ్గలి మండలం పెండేకల్ (ఆర్.ఎస్.) జెడ్.పి.హెచ్.యస్ లో 1988-1993 వరకు చదివిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం నిర్వహించారు. గురువుల సమక్షంలో సరస్వతి దేవి చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. తమతో పాటు విద్యను అభ్యసించి మృతి చెందిన 9 మంది విద్యార్థులను స్మరించుకొని వారికి నివాళులర్పించారు. పాఠశాలకు ప్రింటింగ్ ప్రెస్ జిరాక్స్ మిషన్‌ను బహుకరించారు.

News November 11, 2024

కర్నూలు జిల్లాలో TODAY TOP NEWS

image

* నందవరం: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
* శ్రీశైలంలో డ్రోన్ కలకలం.. ఆలయ సిబ్బంది అదుపులో యువకులు
* ఆదోనిలో వైసీపీ నుంచి బీజేపీలోకి చేరికలు
* ఎమ్మిగనూరు: గుండెపోటుతో యువకుడు మృతి
* ఎమ్మిగనూరులో ఈ నెల12న జాబ్ మేళా
* నంద్యాల: రేపు ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ: కలెక్టర్ రాజకుమారి గణియా
* కర్నూలు: టీడీపీ యాదవులకు తీరని అన్యాయం చేసింది: అయ్యన్న యాదవ్

News November 10, 2024

వైసీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను గాలికి వదిలేసింది: ఎంపీ

image

వైసీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను గాలికి వదిలేసిందని ఎంపీ నాగరాజు అన్నారు. ఆదివారం కర్నూలు ప్రభుత్వ టౌన్ మోడల్ హైస్కూలులో జిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులు, ఎంఈఓ, హెచ్ఎంలను సన్మానించారు. ఎంపీ మాట్లాడుతూ.. జిల్లాలో విద్యారంగం బలోపేతానికి తన వంతు కృషి చేస్తానన్నారు. డీఈవో శామ్యూల్ పాల్, ప్రధానోపాధ్యాయుల సంఘం నాయకులు పాల్గొన్నారు.

News November 10, 2024

‘మచిలీపట్నం-ధర్మవరం రైలు బెంగళూరు వరకు పొడిగించండి’

image

నంద్యాల మీదుగా ప్రయాణించే మచిలీపట్నం-ధర్మవరం రైలును బెంగళూరు వరకు పొడిగించాలని సౌత్ వెస్ట్రన్ రైల్వేను దక్షిణ మధ్య రైల్వే కోరింది. ఈ రైలు ధర్మవరం చేరుకున్న తర్వాత 7.40 గంటల పాటు ట్రాక్‌పై ఉండటం వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ఈ రైలును బెంగళూరు వరకు పొడిగించాలని అభ్యర్థించింది. SWR అంగీకారంతో ఇది సాకారం కానుంది.