Kurnool

News April 10, 2025

కర్నూలుతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్

image

కర్నూలు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా బుధవారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా హౌసింగ్, పిజిఆర్ఎస్, పీఆర్ వన్ యాప్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, తాగునీరు, రీసర్వే, ఐవిఆర్ఎస్ వంటి అంశాలపై డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేశారు. ఈ సమావేశంలో పలు కీలక విషయాలు పరిశీలించి, అధికారులకు నిబంధనలు, ఆదేశాలు జారీ చేశారు.

News April 9, 2025

కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు.!

image

➤ ఓటర్ల సమస్య పరిష్కరిస్తాం: కలెక్టర్
➤ కర్నూలు: ముగిసిన 10th పేపర్ వాల్యూయేషన్
➤ మంత్రాలయం: రేషన్ షాపుల్లో రసీదులు తీసుకోవాలి
➤ జగన్‌‌ను తక్షణమే అరెస్ట్ చేయాలి: సోమిశెట్టి
➤ఆదోనిలో గ్యాస్ లీకై చెలరేగిన మంటలు
➤మంత్రాలయంలో ఫుడ్ కమిషన్ ఛైర్మన్ ఆగ్రహం
➤ఆదోని: ‘అసాంఘిక కార్యకలాపాల నివారణ మా లక్ష్యం’
➤జిల్లా వ్యాప్తంగా వినతులు స్వీకరించిన టీడీపీ నాయకులు

News April 9, 2025

కర్నూలు: ముగిసిన 10th పేపర్ వాల్యూయేషన్

image

10వ తరగతి పరీక్షలకు సంబంధించి అన్ని సబ్జెక్టుల మూల్యాంకనం బుధవారం నాటికి పూర్తయిందని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ తెలిపారు. జిల్లాకు వచ్చిన 192725 పేపర్లు 7 రోజులపాటు మూల్యాంకనం నిర్వహించామని డీఈఓ వివరించారు. ఓపెన్ ఇంటర్మీడియట్ మూల్యాంకనం ఆరు రోజులలో 100% పూర్తయిందన్నారు. మూల్యాంకనానికి వచ్చిన వారికి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.

News April 9, 2025

పత్తికొండ: మీ ఊర్లో నీటి సమస్య ఉందా.. ఫోన్ చేయండి!

image

పత్తికొండ రెవెన్యూ డివిజన్ పరిధిలోని గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తితే తమకు తెలియజేయాలని రెవెన్యూ డివిజనల్ అధికారి భరత్ నాయక్ ప్రజలను కోరారు. పత్తికొండ, తుగ్గలి, మద్దికెర, క్రిష్ణగిరి, ఆలూరు, హాళహార్వి, ఆస్పరి, దేవనకొండ మండలాల పరిధిలోని గ్రామాల ప్రజలు హెల్ప్ లైన్ నంబర్ 8520796952కు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7.30 వరకు నీటి సమస్యపై ఫిర్యాదు చేయొచ్చని చెప్పారు.

News April 9, 2025

కర్నూలు: ముగిసిన 10th మూల్యాంకనం

image

10వ తరగతి పరీక్షలకు సంబంధించి అన్ని సబ్జెక్టుల మూల్యాంకనం బుధవారం నాటికి పూర్తయిందని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ తెలిపారు. జిల్లాకు వచ్చిన 192725 పేపర్లు 7 రోజులపాటు మూల్యాంకనం నిర్వహించామని డీఈఓ వివరించారు. ఓపెన్ ఇంటర్మీడియట్ మూల్యాంకనానికి ఆరు రోజులలో 100% పూర్తయిందన్నారు. మూల్యాంకనానికి వచ్చిన వారికి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.

News April 9, 2025

మెప్మా ఉత్పత్తులకు గిన్నిస్ రికార్డు: ఎమ్మిగనూరు కమిషనర్

image

ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీలోని మహిళా స్వయం సహాయక బృందాల్లో, ఒక్క రోజులోనే లక్షకు పైగా మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులను విక్రయించారు. దీంతో వారికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం దక్కింది. ఈ విషయాన్ని ఎమ్మిగనూరు మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన మిషన్ నుంచి ప్రశంసలు అందుకున్నట్లు వారు తెలిపారు.

News April 9, 2025

విషాదం.. ఎల్లెల్సీలో ఈతకు వెళ్లి బాలుడి మృతి

image

అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు అనుమేశ్ ఎల్లెల్సీలో ఈతకు వెళ్లి మృతి చెందడంతో చిన్నకడబూరుకు చెందిన తల్లిదండ్రులు హనుమంతు, నాగలక్ష్మి శోకసంద్రంలో మునిగిపోయారు. ఎల్లెల్సీ పక్కన ఉన్న తమ పొలంలో పని చేసుకుంటున్న తల్లిదండ్రులకు కుమారుడి మృతి విషయం గుండెపగిలేలా చేసింది. పుట్టుకతో అనుమేశ్‌కు మాట రాకపోయినా కంటికి రెప్పలా కాపాడుకున్నామని తండ్రి హనుమంతు రోదించారు.

News April 9, 2025

కర్నూలు: 1,78,466 పేపర్ల మూల్యాంకనం

image

10వ తరగతి పరీక్షలకు సంబంధించి అన్ని సబ్జెక్టుల మూల్యాంకనం మంగళవారం నాటికి 1,78,466 పేపర్ల మూల్యాంకనం జరిగింది. ఆరవ రోజు మూల్యాంకనం ముగిసే సమయానికి 93%గా నమోదయినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ తెలిపారు. 114 మంది చీఫ్ ఎగ్జామినర్లు,682 మంది అసిస్టెంట్ చీఫ్ ఎగ్జామినర్లు, 215 మంది స్పెషల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. ఓపెన్ ఇంటర్‌కు సంబంధించి మూల్యంకనం పూర్తయినట్లు వెల్లడించారు.

News April 8, 2025

కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు.!

image

➤ ఆదోని: తల్లి మందలించిందని యువతి ఆత్మహత్య
➤ కర్నూలు రేంజ్‌లో సీఐల బదిలీలు
➤ వైసీపీ కార్యకర్తలపై దాడులను సహించం: కాటసాని
➤ సీతమ్మకు తాళి.. క్షమాపణ చెప్పిన ఆలూరు MLA
➤ ఆదోని MLA డౌన్ డౌన్ అంటూ TDP నినాదాలు
➤ కోడుమూరు: ‘పొలం ఆన్ లైన్ చేయమంటే లైంగికంగా వేధిస్తున్నారు’
➤ పెద్దకడబూరు: ఈతకు వెళ్లి బాలుడి మృతి.

News April 8, 2025

మెప్మా ఉత్పత్తులకు గిన్నిస్ రికార్డు: ఎమ్మిగనూరు కమిషనర్

image

ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీలోని మహిళా స్వయం సహాయక బృందాల్లో, ఒక్క రోజులోనే లక్షకు పైగా మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులను విక్రయించారు. దీంతో వారికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం దక్కింది. ఈ విషయాన్ని ఎమ్మిగనూరు మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన మిషన్ నుంచి ప్రశంసలు అందుకున్నట్లు వారు తెలిపారు.