Nellore

News September 14, 2024

సూళ్లూరుపేట: ప్రేమ వ్యవహారం.. థియేటర్‌లో విద్యార్థిపై కత్తితో దాడి

image

తిరుపతిలోని సినిమా థియేటర్‌లో ఎంబీయూ యూనివర్శిటీ విద్యార్థి లోకేశ్‌పై కార్తీక్ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. దాడి అనంతరం కార్తీక్‌తో పాటు మరో యువతి కావ్య పరారయ్యారని పోలీసులు తెలిపారు. అయితే ఈ దాడికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కార్తీక్, కావ్యది సూళ్లూరు పేట కాగా, బాధితుడిది ప్రకాశం జిల్లా గిద్దలూరుగా గుర్తించారు.

News September 14, 2024

మాజీ సీఎం జగన్‌కు సోమిరెడ్డి కౌంటర్

image

మాజీ సీఎం జగన్‌‌కి సర్వేపల్లి MLA సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. విజయవాడకు వచ్చిన వరదలపై జగన్ విమర్శిస్తున్న తీరును తప్పుబట్టారు. విపత్తులు ఎదుర్కోవడంలో సీఎం చంద్రబాబు దిట్ట అయితే , రూ. లక్షల కోట్లు దాచుకోవడంలో జగన్ రోల్ మోడల్ అని ఎద్దేవా చేశారు. జగన్ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

News September 14, 2024

నెల్లూరు: ఈనెల 20న మెగా జాబ్ మేళా

image

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 20న నెల్లూరు జిల్లాలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణాభివృద్ధి అధికారి సి. విజయవినీల్ కుమార్ తెలిపారు. కాకుటూరులోని విక్రమ సింహపురి యూనివర్శిటీ, కోవూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ , ఆత్మకూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలలో ఉదయం 9.30 – 2 గంటల వరకు మేళా జరుగుతుందన్నారు. 10,ఇంటర్, డిగ్రీ, డిప్లమో, ఐటిఐ చేసిన వారు అర్హులు.

News September 14, 2024

సూళ్లూరుపేట: మిస్సైన అమ్మాయి ఆచూకీ లభ్యం

image

సూళ్లూరుపేట పట్టణంలో శుక్రవారం ట్యూషన్ కోసమని ఇంటి నుంచి వెళ్లి ఆఫ్రీన్(12) మిస్సైన సంగతి తెలిసిందే. అయితే బాలిక ప్రస్తుతం చెన్నై పోలీసుల చెంత సురక్షితంగా ఉన్నట్లు కుటుంబీకులు తెలిపారు. పాప చెన్నైకి వెళ్లి ఓ ఆటో ఎక్కి తనను బీచ్ వద్దకు చేర్చమని ఆటో వ్యక్తికి చెప్పగా అతనికి అనుమానం వచ్చి పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. దీంతో పోలీసులు కుటుంబీకులు సమాచారాన్ని చేరవేసినట్లు తెలిపారు.

News September 14, 2024

నెల్లూరు: రిజిస్ట్రేషన్ శాఖలో ముగ్గురు అధికారులపై వేటు

image

నెల్లూరు రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయంలో జరిగిన ఆక్రమ రిజిస్ట్రేషన్ పై ఉన్నతాధికారులు కన్నెర్ర చేశారు. కార్పొరేషన్ పరిధిలో నిషేధిత జాబితాలో ఉన్న భూమిని నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేశారు. ఇందులో కీలకంగా వ్యవహరించిన జాఫర్, మిల్కిరోషన్, సింహాద్రిలను సస్పెండ్ చేసినట్లు డీఐజీ కిరణకుమార్ తెలిపారు.

News September 14, 2024

పోలీసుల సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎస్పీ

image

పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం ప్రతి శుక్రవారం పోలీసు వెల్ఫేర్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నెల్లూరు ఎస్పీ జి.కృష్ణ కాంత్ తెలిపారు. జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లు, ఆయా విభాగాలలో విధులు నిర్వర్తిస్తున్న 36 మంది పోలీసులు వారి యొక్క సమస్యల గురించి తెలుసుకున్నారు. ట్రాన్స్ ఫర్లు, రిక్వెస్ట్‌లు, మెడికల్ సమస్యలు వంటి సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు.

News September 13, 2024

సంగం బ్యారేజ్ కి గౌతంరెడ్డి పేరు తొలగింపు

image

సంగం బ్యారేజ్ కి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనలో పెట్టిన పేరును కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చాక తొలగింపు చర్యలకు శ్రీకారం చుట్టింది. తాజాగా శుక్రవారం బ్యారేజ్ వద్ద బోర్డుపై ఏర్పాటు చేసిన మేకపాటి గౌతం రెడ్డి పేరును వైట్ వాస్ వేసి తొలగించారు. దీంతో పలువురు వైసీపీ నేతలు అసహనం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో పెట్టిన పేర్లను తొలగించాలని కూటమి ప్రభుత్వం జీవో జారీ చేసింది.

News September 13, 2024

నెల్లూరు డీఆర్డిఏ ఉద్యోగులకు బదిలీల కౌన్సెలింగ్

image

ఇవాళ ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 46 మండలాల సీసీ, ఎమ్మెస్ సీసీలకు డీఆర్డీఏ పీడీ సాంబశివా రెడ్డి కౌన్సెలింగ్ నిర్వహించారు. ముందుగా 5 సంవత్సరాలు ఒకే మండలంలో పనిచేసిన సిబ్బందికి నియోజకవర్గం వారీగా కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగ్‌లు కేటాయించారు. మధ్యాహ్నం రిక్వెస్ట్ పెట్టిన ఉద్యోగులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారని అసోసియేషన్ సభ్యులు తెలిపారు.

News September 13, 2024

చిల్లకూరు: మామిడి తోటలో మృతదేహం లభ్యం

image

చిల్లకూరు మండల పరిధిలోని చేడిమాల-తొణుకుమాల గ్రామాల మధ్య ఓ మామిడి తోటలో కాపలాదారు ఒక వ్యక్తి మృతదేహం గురువారం బయట పడింది. ఎస్ఐ సురేశ్ బాబు మాట్లాడుతూ.. మామిడి తోట కాపలాదారులు కనబడటంలేదని, మామిడి తోట యజమాని ఫిర్యాదు చేశారన్నారు. తోటను పరిశీలించడంతో మట్టి పూడ్చిన విషయం గమనించి తవ్వడంతో మృతదేహం బయట పడినట్లు ఆయన తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్ఐ తెలిపారు.

News September 13, 2024

నెల్లూరు: టీడీపీలోకి వైసీపీ కార్పొరేటర్లు

image

నెల్లూరు కార్పొరేషన్‌లోని పలువురు కార్పొరేటర్లు నేడో, రేపో టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. కొందరు కార్పొరేటర్లు గురువారం మంత్రి నారాయణ సన్నిహితుడు విజయభాస్కర్ రెడ్డిని కలిశారు. ముజీర్, పి.వెంకటేశ్వర్లురెడ్డి, సంక్రాంతి కల్యాణ్, కర్తం ప్రతాప్ రెడ్డి, వందవాసి రంగా, కాయల సురేశ్ వీబీఆర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. మొదటి విడతలో 16 మంది చేరికకు రంగం సిద్ధమైంది. మిగతా 27 మంది కూడా టీడీపీలో చేరే అవకాశం ఉంది.