Nellore

News January 16, 2025

ఫ్లెమింగో ఫెస్టివల్‌ను విజయవంతం చేయండి: కలెక్టర్

image

ఈ నెల 18, 19, 20వ తేదీలలో సూళ్లూరుపేటలో జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్‌ను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ కోరారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. చాలా కాలం తరువాత ఈ పండుగను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నామని అన్నారు. గ్రామాలలో ప్రజలందరికి ఈ సమాచారం అందించాలన్నారు. పండుగకు వచ్చే సందర్శకులకు తాగునీరు, టాయిలెట్స్, వైద్య సౌకర్యం ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

News January 16, 2025

నెల్లూరు: తిరుగు ప్రయాణంలో నిలువ దోపిడి

image

సంక్రాంతికి సొంతూర్లకు వచ్చి తిరిగి వెళ్లేవారికి ప్రయాణం ఖరీదుగా మారింది. నెల్లూరుజిల్లా నుంచి హైదరాబాదు, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాలకు వెళ్లేవారికి RTC అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. అవి సరిపోకపోవడంతో ప్రైవేటు ట్రావెల్స్‌ను ఆశ్రయించారు. దీంతో వారు టికెట్ రేట్లను రెండింతలు పెంచి నిలువ దోపిడి చేస్తున్నారు. తప్పనిసరిగా వెళ్లాల్సిరావడంతో ప్రజలు అధిక ధరలు చెల్లించి ప్రయాణిస్తున్నారు.

News January 16, 2025

నెల్లూరు: మహిళపై అత్యాచారయత్నం

image

ఓ మహిళపై అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన సంగం మండలంలో చోటుచేసుకుంది. సిద్దీపురం గ్రామానికి చెందిన నాయబ్ రసూల్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన ఓ మహిళపై బుధవారం మధ్యాహ్నం అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఆమె ప్రతిఘటించడంతో కత్తితో దాడి చేసి పరారయ్యాడు. ఆమె ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ రాజేశ్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

News January 16, 2025

ఆ ఇద్దరూ వీఆర్ లా కళాశాల విద్యార్థులే

image

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా యడవల్లి లక్ష్మణరావు, హరిహరనాథ శర్మల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఇద్దరు న్యాయమూర్తులు నెల్లూరులోని వీఆర్ లా కళాశాలలో న్యాయ విద్యను అభ్యసించారు. కర్నూలుకు చెందిన హరిహరనాథశర్మ న్యాయవాదిగా అక్కడే ప్రాక్టీస్ చేయగా, ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన లక్ష్మణరావు సొంత జిల్లాతో పాటు నెల్లూరు, కావలిలోనూ ప్రాక్టీస్ చేశారు.

News January 16, 2025

నెల్లూరు: రూ.21 కోట్ల మద్యం తాగేశారు

image

సంక్రాంతి పర్వదినం సందర్భంగా నెల్లూరు జిల్లాలో మద్యం ఏరులై పారింది. కేవలం ఐదు రోజుల్లో రూ.21 కోట్ల విలువైన మద్యాన్ని తాగేశారు. ముఖ్యంగా భోగి, కనుమ పండగ రోజుల్లో మద్యం దుకాణాల వద్ద తీవ్రమైన రద్దీ ఏర్పడింది. ఉదయం నుంచి రాత్రి వరకు మద్యం ప్రియులు దుకాణాల వద్ద బారులుతీరి కనిపించారు. ప్రధాన బ్రాండ్ల మద్యం స్టాక్ అయిపోయినా ఏది ఉంటే అదే కొనుగోలు చేశారు.

News January 16, 2025

ఉదయగిరిలో జోరుగా కోడిపందేలు

image

సంక్రాంతి పండగ సందర్భంగా ఉదయగిరి మండలంలోని పలు గ్రామాల్లో జోరుగా కోడిపందేలు జరుగుతున్నాయి. పోలీసు అధికారుల ఆదేశాలు ఉన్నప్పటికీ బేఖాతర్ చేస్తూ కోడిపందేలు నిర్వహించారు. మండలంలోని జి. చెరువుపల్లి, జి చెర్లోపల్లి, వెంకట్రావుపల్లి, కృష్ణంపల్లి పలు గ్రామాల్లో ఏర్పాటుచేసిన కోడిపందేలను తిలకించేందుకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

News January 16, 2025

పర్యాటకులకు అవసరమైన ఏర్పాట్లు చేయాల: జేసీ

image

పక్షుల పండుగకు వచ్చే పర్యాటకులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా ఆదేశించారు. బుధవారం ఆయన నేలపట్టు పక్షుల కేంద్రంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏ శాఖకు సంబంధించిన అధికారులు ఆ శాఖకు సంబంధించిన ఏర్పాట్లను చేపట్టాలన్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకొని చెరువు కట్టపై వన్ వే కోసం భారీ కేట్స్, వాహనాల రాకపోకలకు రహదారులపై పోలీస్ అవుట్ పోస్టులు ఏర్పాటు చేయాలన్నారు.

News January 15, 2025

నెల్లూరులో చికెన్, మటన్ రేట్లు ఎలా ఉన్నాయంటే..

image

కనుమ పండుగ సందర్భంగా నెల్లూరు జిల్లాలో చికెన్, మటన్ ధరలు ఇలా ఉన్నాయి. broiler live – రూ.120, broiler retail rate -రూ.170, skin chicken -రూ.220, skinless chicken -రూ.240, lollipop -రూ.250, leg piece -రూ.260, boneless -రూ.360 గా ఉన్నాయి. మటన్ ధరలు మాత్రం రూ.800 నుంచి రూ.1000 వరకు ఉన్నాయి.
గమనిక.. ఒక్కొ ప్రాంతంలో ఒక్కోవిధంగా ధరలు ఉండొచ్చు.

News January 15, 2025

శ్రీహరికోట: ఇస్రో ఛైర్మన్ భాద్యతల స్వీకరణ

image

ఇస్రో నూతన ఛైర్మన్‌గా వి.నారాయణన్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. సోమనాథ్ పదవి కాలం ముగియటంతో ఆయన స్థానంలో ఆయన నియమితులయ్యారు. ఈ సందర్భంగా నారాయణన్‌ను టీమ్, సోమనాథ్ అభినందించారు. ఇస్రో అభివృద్ధిలో ఆయన కీలకం కానున్నారు. ఈ నెల14 నుంచి ఛైర్మన్ పదవి కాలం ప్రారంభమవుతుంది.

News January 14, 2025

శ్రీహరికోట: ఇస్రో ఛైర్మన్ భాద్యతల స్వీకరణ

image

శ్రీహరికోట ఇస్రో నూతన ఛైర్మన్‌గా వి.నారాయణన్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. సోమనాథ్ పదవి కాలం ముగియటంతో ఆయన స్థానంలో ఆయన నియమితులయ్యారు. ఈ సందర్భంగా నారాయణన్‌ను టీమ్, సోమనాథ్ అభినందించారు. ఇస్రో అభివృద్ధిలో ఆయన కీలకం కానున్నారు. ఈ నెల14 నుంచి ఛైర్మన్ పదవి కాలం ప్రారంభమవుతుంది.