Nellore

News September 11, 2024

విఆర్ లో ఉన్న ఎస్సైలకు పోస్టింగ్‌లు

image

నెల్లూరు జిల్లా వీఆర్లో ఉన్న సివిల్ ఎస్ఐలతోపాటు, ఇటీవలే ఏఎస్ఐ నుంచి ఎస్ఐగా ఉద్యోగోన్నతి పొందిన వారికి అటాచ్మెంట్ పై పోలీసు స్టేషన్లో పోస్టింగ్ కల్పిస్తూ ఎస్పీ జీ కృష్ణకాంత్ ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించారు. చిన్నబజారుకు ఎస్ఎం బాషా, నెల్లూరు రూరల్ కు ఆర్ సుధీర్ కుమార్, ఆత్మకూరుకు కే శ్రీనివాసులురెడ్డి, కావలి-2 ఎస్ కే గౌష్ బాషా, కోవూరుకు ఎస్ కే ఖాదర్ బాషా తదితరులు ఉన్నారు.

News September 11, 2024

గూడూరు: డీఎస్పీని ఆశ్రయించిన ప్రేమ జంట

image

తమకు పెద్దల నుంచి రక్షణ కల్పించాలంటూ ప్రేమ జంట బుధవారం గూడూరు డీఎస్పీని ఆశ్రయించింది. గూడూరు పట్టణానికి చెందిన సాయికుమార్, బళ్లారికి చెందిన దివ్య గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లికి నిరాకరించడంతో వారే పెళ్లిచేసుకుని డీఎస్పీని ఆశ్రయించారు. తమతల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందని కాపాడాలని కోరారు. ప్రస్తుతం వారి జంట రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

News September 11, 2024

నెల్లూరు జిల్లాలో కొండెక్కిన ఉల్లి ధర

image

నెల్లూరు జిల్లాలో ఉల్లి ధర రోజురోజుకూ పెరుగుతోంది. కిలో రూ.60 నుంచి రూ.70 వరకు విక్రయిస్తుండటంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. కర్ణాటక, పుణే నుంచి దిగుమతి అవుతున్న సరకు.. అక్కడే కిలో రూ.50 వరకు ఉండటంతో రవాణా ఖర్చులతో ఇక్కడికి చేరే సరికి మరింత పెరుగుతోందని వ్యాపారులు చెబుతున్నారు. మహారాష్ట్రలో కొత్త పంట మార్కెట్‌కు రాకపోవడంతో కొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వారు తెలిపారు.

News September 11, 2024

పోలేరమ్మ జాతరకు ఏర్పాట్లను పగడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్

image

ఈనెల 11వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జరగనున్న వెంకటగిరి పోలేరమ్మ తల్లి జాతర ఏర్పాట్లను పగడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతి కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఆయన మంగళవారం ఎస్పీ సుబ్బారాయుడు, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, వీఆర్వో పెంచల కిషోర్ సంబంధిత శాఖల అధికారులు కలిసి ఆయన జాతర ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు.

News September 10, 2024

కోర్టులో లొంగిపోయిన నెల్లూరు మేయర్ భర్త

image

నెల్లూరు కార్పొరేషన్‌లో జరిగిన సంతకాల ఫోర్జరీ అభియోగం కేసులో మేయర్ భర్త జయవర్ధన్ నిందితుడిగా ఉన్నారు. గత కొన్ని రోజులుగా పోలీసులు జయవర్ధన్ ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఇప్పటికే ఈ కేసులో టౌన్ ప్లానింగ్ అధికారులను అరెస్ట్ చేసిన విషయం తెలిసింది. కీలక నిందితుడిగా జయవర్ధన్ మంగళవారం కోర్టులో లొంగిపోయారు. ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

News September 10, 2024

సర్వేపల్లి: బాధితులకు పారిశ్రామికవేత్తల భారీ సాయం

image

వరద బాధితులను ఆదుకునేందుకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పారిశ్రామిక వేత్తలు భారీ సాయం ప్రకటించారు. రూ.2.97 కోట్ల విలువైన చెక్కులను సీఎం చంద్రబాబు నాయుడికు మంగళవారం అందజేశారు. జెమిని ఎడిబుల్ ఆయిల్స్ అండ్ ఫాట్స్ కంపెనీ రూ.2 కోట్లు, ఎస్ఈఐఎల్ పవర్ ప్రాజెక్టు ప్రతినిధులు రూ.50 లక్షలు, పలు కంపెనీల ప్రతినిధులు కలిసి రూ.47 లక్షలను అందజేశారు. దాతలకు ధన్యవాదాలు తెలిపారు.

News September 10, 2024

విజయవాడకు అండగా నిలిచిన నెల్లూరు

image

నెల్లూరు పారిశ్రామిక వేత్తలు పలువురు తమ మంచి మనసు చాటుకున్నారు. విజయవాడ వరద బాధితులను ఆదుకొనేందుకు తమ వంతు సాయం అందించారు. సోమిరెడ్డి సమక్షంలో జెమినీ ఎడిబుల్ ఆయిల్స్& ఫ్యాట్ లిమిటెడ్ రూ.2కోట్లు, పామాయిల్ పారిశ్రామిక వేత్తలు రూ.50 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. విజయవాడ కలెక్టరేట్‌లో మంగళవారం చంద్రబాబుకు చెక్కు అందించారు.

News September 10, 2024

నాయుడుపేట: సముద్రంలో యువకుని మృతదేహం లభ్యం

image

వినాయక నిమజ్జనానికి వచ్చి తూపిలిపాలెం సముద్రంలో గల్లంతైన నాయుడుపేటకు చెందిన యువకుడు మునిరాజా (22) మృతదేహం మంగళవారం మధ్యాహ్నం లభ్యమయ్యింది. నిమజ్జనానికి సోమవారం నాయుడుపేట నుంచి వెళ్లిన యువకులలో ఫయాజ్ మృతి చెందిన విషయం తెలిసిందే. అతనికి స్నేహితుడైన ముని రాజా మృతదేహం కూడా మంగళవారం లభ్యమయింది. ప్రాణ స్నేహితులుగా ఉన్న ఇద్దరి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News September 10, 2024

నెల్లూరు జిల్లాలో ర్యాట్ ఫీవర్?

image

అల్లూరుకు చెందిన వ్యక్తి ర్యాట్ ఫీవర్‌తో బాధపడుతున్నట్లు సమాచారం. అతనికి వైరల్ ఫీవర్ ఎక్కువవ్వడంతో చెన్నైలో వైద్యం చేయించుకున్నారు. ఆదివారం మళ్లీ అనారోగ్యానికి గురవ్వగా నెల్లూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. దీనిపై అల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. వెంకటేశ్వరావు వివరణ ఇచ్చారు. ర్యాట్ ఫీవర్ ప్రాణాంతకమని, తాగేనీటిలో ఎలుకలు, పందికొక్కులు మూత్ర విసర్జన చేయడం వలన ఆ వ్యాధి సోకుతుందన్నారు.

News September 10, 2024

నేడు నెల్లూరు, కావలిలో జాబ్ మేళా

image

యువతకు ఉపాధి కల్పించేందుకు ఈ నెల 10న నెల్లూరు, కావలిలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ఎం.వినయ్ కుమార్ తెలిపారు.పది, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, ఉన్నత చదువులు చదివిన వారు అర్హులన్నారు. ఆరోజు ఉదయం 10.30 నుంచి నెల్లూరు దర్గా మిట్టలోని డీకేడబ్ల్యూ మహిళా కళాశాల , కావలి R&B, జిల్లా ఉపాధి, నైపుణ్యాభివృద్ధి కార్యాలయాలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు ధ్రువపత్రాలతో హాజరుకావాలన్నారు.