India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తిరుమల పరకామణిలో టీటీడీ ఔట్సోర్సింగ్ ఉద్యోగి శ్రీవారి హుండీలో బంగారం దొంగతనం చేశారు. అగ్రిగోస్ ఔట్సోర్సింగ్ ఉద్యోగి పెంచలయ్య100 గ్రాముల గోల్డ్ బిస్కెట్ ట్రాలీలో దాచి తీసుకువెళుతుండగా విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఘటనపై తిరుమల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, అతను గతంలో కూడా ఏమైనా దొంగతనాలు చేశారా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు.

తిరుపతిలో శనివారం ముని కుమార్ అనే టీటీడీ ఉద్యోగిపై చిరుత దాడి చేసినట్లు ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే పులి దాడి చేయలేదని బాధితుడు తెలిపాడు. అతను డ్యూటీ నిమిత్తం వెళ్తుండగా సైన్స్ సెంటర్ సమీపంలో పులి అటవీ ప్రాంతంలోకి వెళ్లడం చూశాడు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి కింద పడిపోగా గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సమాచారమందుకున్న డీఎఫ్ వో అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా విడుదల సందర్భంగా నెల్లూరులోని ఎస్2 థియేటర్స్ వద్ద 36 అడుగుల భారీ కటౌట్ను ఏర్పాటు చేశారు. బాలకృష్ణ అభిమానులకు సంక్రాంతి పండగ ముందే వచ్చిందని నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. కటౌట్కు 300 కిలోల పూలతో తయారుచేసిన గజమాలను కోటంరెడ్డి ఆధ్వర్యంలో అలంకరించారు.

ముని కుమార్ అనే వ్యక్తిపై చిరుత పులి దాడి చేసిన ఘటన తిరుపతిలోని సైన్స్ సెంటర్ ఎదురుగా చోటు చేసుకుంది. దీంతో బాధితుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. బైక్పై వెళ్తుండగా ఒక్కసారిగా మునికుమార్పై చిరుత దాడిచేయడంతో కిందపడ్డాడు. గుర్తించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పట్టపగలే చిరుత దాడి చేయడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

కుమారుడిని అత్త మందలించిందని ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్నట్లు నెల్లూరు పోలీసులు తెలిపారు. నగరానికి చెందిన రుబీనా(22) అంజద్కు మూడేళ్ల క్రితం వివాహం అయింది. వారికి ఇద్దరు పిల్లలు. రుబీనా రెండేళ్ల కుమారుడు సోఫాపై మూత్రం పోశాడు. దీంతో అత్త బాలుడిని మందలించింది. మనస్తాపం చెందిన రుబీనా ఇంట్లో ఉరి వేసుకుంది. కుబుంబీకులు గమనించి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.

నెల్లూరు నగరంతో పాటు జిల్లాలోని ఇతర పట్టణాల్లో ప్రైవేట్ బస్సులు నడిపేందుకు ఆసక్తి ఉన్నవారు ముందుకు వస్తే వెంటనే అనుమతిస్తామని జిల్లా కలెక్టర్ ఒ. ఆనంద్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో ప్రాంతీయ రవాణా ఆథారిటీ సమావేశం నిర్వహించారు. నెల్లూరు నగరంలో ఇప్పటికే పర్మిట్ ఉన్న రూట్లు, నూతన రూట్లలో సిటీ బస్లు తిప్పుకునేందుకు ప్రైవేట్ ఆపరేటర్లు అనుమతుల కోసం చేసిన దరఖాస్తులను ఆయన పరిశీలించారు.

తిరుపతి ఘటనలో మృతుల కుటుంబాలకు టీటీడీ బోర్డు సభ్యులు వ్యక్తిగతంగా ఆర్థికసాయం చేశారు. కోవూరు ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి రూ. 10లక్షలు ఆర్థిక సాయం చేశారు. అదేవిధంగా సుచిత్ర ఎల్ల రూ.10 లక్షలు, ఎంఎస్ రాజు రూ.3 లక్షలు తమ వంతు సాయం చేశారు.

ఇసుక ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో పదో తరగతి విద్యార్థి మృతి చెందిన ఘటన ఆత్మకూరులో చోటుచేసుకుంది. ఆత్మకూరు మండలం అప్పారావుపాలెం గ్రామానికి చెందిన జశ్వంత్ (15) పదో తరగతి చదువుతున్నాడు. బైక్పై ఆత్మకూరుకు వెళ్తున్న జశ్వంత్ను అప్పారావుపాలెం నుంచి ఇసుకలోడుతో ఆత్మకూరుకు వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పి కింద పడి ఘటనా స్థలంలోనే జశ్వంత్ మృతి చెందాడు. కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు.

రెడ్క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యులు IRCS నిబంధనల ప్రకారం పనిచేయాలని జిల్లా కలెక్టర్, మేనేజింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఆనంద్ సభ్యులకు సూచించారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్లో రెడ్క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. మేనేజింగ్ కమిటీ సభ్యులు తటస్థంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. అలా కాకుండా కొంత మంది రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో పాల్గొంటూ నిబంధనలను ఉల్లంఘించవద్దన్నారు.

జాతీయ కుష్టు వ్యాధి నివారణ కార్యక్రమంపై రూపొందించిన పోస్టర్ను కలెక్టర్ ఆనంద్ బుధవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుష్టు వ్యాధి నివారణకు మరింత ప్రచారం చేయాలని వైద్య ఆరోగ్య సిబ్బందికి సూచించారు. ప్రతి ఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.