Nellore

News September 10, 2024

జిల్లాలో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాలు: కలెక్టర్ ఆనంద్

image

ఈనెల 14 నుంచి అక్టోబర్ 2 వరకు స్వభావ్ స్వచ్ఛత – సంస్కార్ స్వచ్ఛత పేరుతో నెల్లూరు జిల్లాలో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ ఒ.ఆనంద్‌ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా స్థాయిలో 15 మంది అధికారులతో ప్రత్యేక స్టీరింగ్ కమిటీని నియమించామన్నారు. జిల్లా వ్యాప్తంగా అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాలు, బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించాలన్నారు.

News September 9, 2024

గూడూరులో రైలు కింద పడి వ్యక్తి దుర్మరణం

image

గూడూరులో ప్రమాదవశాత్తు రైలు కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం చోటుచేసుకుంది. గంగా కావేరి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న వ్యక్తి గూడూరు వద్ద కిందకు దిగాడు. మళ్లే ఎక్కే క్రమంలో రైలు కింద పడి దుర్మరణం పాలయ్యాడు. సదరు వ్యక్తి శరీరం రెండు ముక్కలు కావడంతో ప్రయాణికులు భయపడిపోయారు. కాగా.. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News September 9, 2024

తూపిలిపాలెం బీచ్ ఘటన.. ఇద్దరు మృతి

image

ఉమ్మడి నెల్లూరు జిల్లా వాకాడు మండలం తూపిలి పాలెం బీచ్ వద్ద వినాయక చవితి నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. సముద్రంలో వినాయకుడి నిమజ్జనం చేస్తుండగా నీటిలో మునిగి ఇద్దరు యువకులు మృతి చెందారు. నాయుడుపేట నుంచి వినాయక నిమజ్జనం కోసం బీచ్‌కు వచ్చిన యువకుల్లో ముగ్గురు గల్లంతయ్యారు. వారిలో మునిరాజా, ఫయాజ్ మృతి చెందగా.. మరో యువకుడిని గజ ఈతగాళ్లు కాపాడారు.

News September 9, 2024

3 నెలల బిడ్డ తల్లిదండ్రులకు అప్పగింత

image

నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్‌లో మూడు నెలల చంటిబిడ్డను గుర్తుతెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. సాయంత్రం వరకు పసికందు సంబంధికులు ఎవరూ రాకపోవడంతో ఆ బిడ్డను నెల్లూరులోని శిశు గృహకు తరలించారు. ఈ క్రమంలో తమ బిడ్డ కనిపించడం లేదని చిన్న బజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులకు బస్టాండ్ వద్దని దొరికిన శిశువును చూపారు. తమ బిడ్డే అని చెప్పడంతో అధికారులు ఆ పసికందును తల్లిదండ్రులకు అప్పగించారు.

News September 9, 2024

వాకాడు: నిమజ్జనానికెళ్లి సముద్రంలో గల్లంతు

image

వినాయక నిమజ్జనం సందర్భంగా వాకాడు మండలం తూపిలిపాలెం సముద్రతీరంలో ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. పోలీసులు ఇద్దరిని రక్షించగా.. మరొకరి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. సముద్రంలో వినాయకుడిని నిమజ్జనం చేసే సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 9, 2024

నెల్లూరు: వినాయక నిమజ్జనంలో అపశ్రుతి

image

నెల్లూరు జిల్లాలో వినాయక నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి ఓ యువకుడు మృతి చెందాడు. కావలి పట్టణంలోని ఇంద్రానగర్‌కు చెందిన మొగిలి రమేష్(27) సోమవారం 3వ రోజు వినాయకుడి నిమజ్జనానికి తుమ్మలపెంట వెళుతుండగా.. కొలదిన్నె గిరిజన కాలనీ సమీపంలో ట్రాక్టర్ పైనుంచి కిందపడ్డాడు. టైర్ అతడి పైనుంచి వెళ్లడంతో రమేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News September 9, 2024

నెల్లూరు నుంచి శబరిమలకు ఒంటికాలితో యాత్ర

image

నెల్లూరు నగరానికి చెందిన అక్కరపాక సురేశ్ ఆచారి వికలాంగుడు. అయినప్పటికీ ఒంటికాలితో శబరిమల పాదయాత్ర చేపట్టాడు. ఈ నెల నాలుగవ తేదీన నెల్లూరులో బయలుదేరి పెంచలకోన మీదుగా శబరిమలకు పాదయాత్రగా బయలుదేరాడు. సోమవారం ఆయన పాదయాత్ర నెల్లూరు జిల్లా కలువాయి మండలం దాచూరు చేరుకుంది. ఇలా సురేశ్ ఆచారి ఇదివరకు రెండుసార్లు పాదయాత్ర చేపట్టి మూడవసారి మొక్కు తీర్చుకునేందుకు శబరిమలకు బయలుదేరినట్లు తెలిపారు.

News September 9, 2024

నెల్లూరు: పునాస మామిడికి గిరాకీ ఎక్కువే

image

నెల్లూరు జిల్లాలో పునాస మామిడికి గిరాకీ పెరిగినట్లు వ్యాపారస్థులు చెబుతున్నారు. మేలు రకం కాయలను టన్ను రూ. 60వేల నుంచిరూ.70వేలు, మసర,మంగున్న కాయలు రూ.40 – 50 వేల వరకు పలుకుతున్నాయన్నారు. అయితే ఈ రకం కాయలకు కేరళలో డిమాండ్ ఎక్కువ. అక్కడ సెప్టెంబరులో జరిగే ఓనం పండుగకు ఇవి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. ప్రతిరోజూ మన నెల్లూరు నుంచి 50-60 టన్నులు ఎగుమతి అవుతున్నాయని అంటున్నారు. ఈసారి ధరలు పెరిగాయన్నారు.

News September 9, 2024

నెల్లూరు: ఉద్యోగం పేరిట మోసం ..యువకుడు సూసైడ్

image

ఉద్యోగం ఇప్పిస్తామని మోసగించడంతో నెల్లూరు యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. పోలీసుల కథనం.. నవాబుపేట వాసి హరినాథ్(44) బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఉన్నత కంపెనీలో ఉద్యోగాలు వెతుకుతుండగా.. నెల్లూరుకు చెందిన ప్రేమ్ చంద్ ఉద్యోగం ఇప్పిస్తానని రూ.7లక్షలకు పైగా తీసుకున్నాడు. బాధితుడు నిలదీయగా రూ.5.57 లక్షలు అకౌంట్లో వేశానని నకిలీ రసీదు ఇచ్చి పరారయ్యాడు. దీంతో ఈనెల 5న హరి సూసైడ్ చేసుకున్నాడు.

News September 9, 2024

నెల్లూరులో అండర్ -14 క్రికెట్ జట్టు ఎంపిక

image

నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జిల్లా అండర్ – 14 క్రికెట్ జట్లను ఈ నెల 15న ఎంపిక చేయనున్నామని క్రికెట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి నిఖిలేశ్వర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడాకారులు తమ సొంత క్రికెట్ కిట్, డ్రస్ కోడ్, ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రంతో హాజరుకావాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.