Nellore

News September 8, 2024

వేమిరెడ్డిని అభినందిస్తూ సీఎం లేఖ

image

నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు ఇటీవల భారీ వరదలతో అతలాకుతలమైన బాధితుల సహాయార్థం కోటి రూపాయల విరాళం అందించిన విషయం తెలిసిందే. సీఎం చంద్రబాబును కలిసి చెక్కును అందించారు. ఈ నేపథ్యంలో ఆదివారం సీఎం భారీ విరాళం అందించిన వేమిరెడ్డిని అభినందిస్తూ ప్రత్యేకంగా లేఖను విడుదల చేశారు.

News September 8, 2024

నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్న చవితి వేడుకలు

image

నెల్లూరు జిల్లాలో వినాయక చవితి సందర్భంగా రెండో రోజూ సందడి నెలకొంది. ఆదివారం సాయంత్రం పలు ప్రాంతాలలో ఉట్టి ఉత్సవాలను యువత కోలాహలంగా జరుపుకున్నారు. నాయుడుపేట ముస్లిం వీధిలో అక్కడి ముస్లింలతో పాటు హిందువుల సైతం మతసామరస్యానికి ప్రతీకగా వినాయక చవితి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఉట్టి కార్యక్రమంలో యువత, మహిళలు, చిన్నారులు సైతం పాల్గొని రంగులు చల్లుకుంటూ ఉట్టిని కొట్టారు.

News September 8, 2024

నెల్లూరు: అంగన్వాడీలకు 4నెలలుగా అందని కందిపప్పు

image

నెల్లూరు జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు నాలుగు నెలలుగా కందిపప్పు సరఫరా నిలిచిపోయింది. జిల్లాలోని 12 ప్రాజెక్టుల పరిధిలో 2934 అంగన్వాడి కేంద్రాలు ఉన్నాయి. వీటిలో లక్ష 25వేలు మంది చిన్నారులు, 25వేలు గర్భవతులు బాలింతలు కలరు. వీరికి ప్రతిరోజు మధ్యాహ్నం భోజనంలో కందిపప్పు అందించాల్సి ఉంది. కందిపప్పు సరఫరా లేకపోవడంతో కేంద్రాల్లో ఆకుకూరలతో కాలం వెళ్లబుచ్చుతున్నారు.

News September 8, 2024

NLR: ఆరు నెలలుగా అందని జీతాలు

image

నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న తమకు ఆరు నెలలుగా వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు గురవుతున్నామని పారిశుద్ధ్య కార్మికులు వాపోయారు. పస్తులు ఉండాల్సి వస్తోందని చెప్పారు. రూ.16 వేలు జీతానికి రూ.12 వేలే ఇస్తున్నారని ఆరోపించారు. గత మూడేళ్లుగా పీఎఫ్, ఈఎస్ఐ నగదు ఇవ్వడం లేదన్నారు. జిల్లా ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

News September 8, 2024

కావలి: మత్తులో వ్యక్తి వీరంగం

image

కావలి ట్రంక్ రోడ్ అంబేడ్కర్ సర్కిల్ బ్రిడ్జి సెంటర్ వద్ద గంజాయి మత్తులో ఓ వ్యక్తి పోలీసుల ముందే వీరంగం సృష్టించాడు. దీంతో బ్రిడ్జి సెంటర్ వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచింది. పోలీసులు అతడిని పక్కకు పంపే ప్రయత్నం చేయగా.. వారిపైనే ఎదురు తిరిగాడు. కష్టం మీద పక్కనే ఉన్న ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. మత్తు దిగిన తర్వాత సదరు వ్యక్తి పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు.

News September 8, 2024

గూడూరు వైసీపీ నేతకు షాక్..!

image

ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన కనుమూరు రవిచంద్రారెడ్డి అధికార ప్రతినిధిగా పలు టీవీ డిబేట్లలో YCP వాయిస్ వినిపించారు. MLAలు, MPలతో పాటు కొందరు నేతలతో టీవీ డిబేట్లలో పాల్గొనే వాళ్ల లిస్ట్‌ను YCP తాజాగా విడుదల చేసింది. వీళ్లను తప్ప మిగిలిన వాళ్లను డిబేట్లకు పిలవకూడదని.. వాళ్ల కామెంట్స్‌కు పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఆ జాబితాలో రవిచంద్రా రెడ్డి పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.

News September 8, 2024

గూడూరులో భారీగా గంజాయి స్వాధీనం 

image

గూడూరు బైపాస్ జంక్షన్‌లో శనివారం సాయంత్రం గంజాయి దొరికింది. అనంతపురం, గుంటూరు జిల్లాకు చెందిన ముగ్గురి నుంచి 30 కేజీల 900 గ్రాముల గంజాయి సీజ్ చేసినట్లు రూరల్ ఎస్ఐ మనోజ్ కుమార్ తెలిపారు. వీరు వైజాగ్ నుంచి గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. గంజాయి విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుందని.. నిందితులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 

News September 7, 2024

నెల్లూరు: బాధితుల కోసం కాల్ సెంటర్ ఏర్పాటు

image

విజయవాడ వరద బాధితులకు ఆహారం, తాగునీటిని అందించాలనుకునే వారు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 0861 2331261, 79955 76699 కాల్ సెంటర్ ద్వారా సమాచారం పొం దాలని అధికారులు సూచించారు. ఆర్థిక సాయం చేయాలనుకునే వారు CMRF పేరిట డీడీ తీసి, కలెక్టర్ కు అందజేయాలని, వీటిని సీఎం కార్యాలయానికి పంపుతామని చెప్పారు.

News September 7, 2024

నెల్లూరు: రేపటి నుంచి మద్యం దుకాణాలు బంద్

image

రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయనున్న నూతన విధానంతో తాము ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు ఆదివారం నుంచి బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో రేపటి నుంచి మద్యం దుకాణాలు బంద్ ఉండనున్నాయి. దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు. అంతవరకు విడతల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు చెబుతున్నారు.

News September 7, 2024

ముత్తుకూరు: పంచాయతీ కార్యదర్శి పై సస్పెన్షన్ వేటు

image

నెల్లూరు జిల్లా ముత్తుకూరు గ్రామ పంచాయతీ సెక్రెటరీ శుక్రవారం సస్పెండ్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారీ అవినీతి, అక్రమాలు జరిగాయని సర్పంచ్ బూదురు లక్ష్మి పవన్ కళ్యాణ్‌కి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ స్వయంగా విచారణ చేశారు. అనంతరం పంచాయతీ కార్యదర్శి చక్రం వెంకటేశ్వర్లుపై సస్పెన్షన్ వేటు పడినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.