India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఈ రోజుల్లో ఓ ఫ్యామిలీ రెస్టారెంట్కు వెళ్లినా కనీసం రూ.2 వేలు దాటుతోంది. ఓ బ్రాండెడ్ షర్ట్ ధర రూ.800పైనే ఉంటోంది. అయితే రూ.500కు శ్రీలంక వెళ్లొచ్చు అంటే మీరు నమ్మగలరా.. నిజమేనండి. కాకపోతే ఇది 50 ఏళ్లనాటి మాట. 1974లో ఓ ట్రావెల్ ఏజెన్సీ నెల్లూరు నుంచి రూ.575కే ఏకంగా 15 రోజుల పాటూ శ్రీలంకకు టూర్ ప్యాకేజ్ ఆఫర్ చేసింది. ఇందుకు సంబందించి ఓ పోస్టర్ నెట్టింట వైరల్గా మారింది. దీనిపై మీ కామెంట్ చెప్పండి.

నేడు తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో నెల్లూరు జిల్లా నేతలతో YCP అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ విషయాన్ని వైసీపీ అధికారిక ‘X’ లో పోస్టు చేసింది. నెల్లూరుకు సంబంధించిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ ఛైర్ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు వైయస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.

రేపు తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో నెల్లూరు జిల్లా నేతలతో YCP అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ విషయాన్ని వైసీపీ అధికారిక ‘X’ లో పోస్టు చేసింది. నెల్లూరుకు సంబంధించిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ ఛైర్ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు వైయస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.

సంక్రాంతి పండుగ నేపథ్యంలో జిల్లాలో ఎక్కడా కోడిపందాలు నిర్వహించకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం కలెక్టర్ ఛాంబర్లో పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో జంతు హింస నివారణ చట్టం అమలుపై ఎగ్జిక్యూటీవ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కోడి పందాలు జరగకుండా గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని వేదాయపాళెం పోలీస్ స్టేషన్లో వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైంది. వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య ఓ కేసులో అరెస్ట్ అయిన తర్వాత కాకాణి ప్రెస్మీట్ నిర్వహించి పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని వెంకటాచలం వడ్డిపాళేనికి చెందిన ఉప్పు పద్మయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత నెల 27న కేసు నమోదు కాగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం ఇష్టానుసారంగా చార్జీల పెంపుతో ప్రయాణికులకు ప్రయాణం మోత మోగిస్తున్నారు. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో సుదూర ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చే ప్రయాణీకులు నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బాదుడు కార్యక్రమం మొదలుపెట్టింది. హైదరాబాద్, బెంగళూరు వంటి పలు నగరాలకు జిల్లా నుంచి రోజు 150 బస్సులు వరకు తిరుగుతూంటాయి. రెండు మూడు రెట్లు ధరలు పెంపుతో ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు.

బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్న నెల్లూరు వాసులు సంక్రాంతికి తమ స్వగ్రామాలకు రానున్నారు. అక్కడ HMPV కేసు నమోదు కావడంతో ఇక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఈ కేసులు లేవని.. కరోనా లాగా ప్రభావం కూడా ఉండదని నెల్లూరు DMHO వి.సుజాత చెప్పారు. జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, శ్వాస సమస్యలుంటే సొంత వైద్యం చేసుకోకుండా డాక్టర్లను సంప్రదించాలని కోరారు. వారం రోజుల్లో సమస్య తగ్గిపోతుందన్నారు.

నెల్లూరు జిల్లాలో 2024 ఎన్నికల నాటికి 20,61, 822 మంది ఓటర్లు ఉన్నారు. తాజాగా నిన్న విడుదల చేసిన లిస్ట్ ప్రకారం 19,44,664 మంది ఉన్నారు. 1,17, 158 మంది ఓటర్లు తగ్గిపోయారు. నెల్లూరు జిల్లా ఓటరు జాబితా-2025 ప్రకారం తాజా ఓటర్ల సంఖ్య కింద విధంగా ఉంది.
➤ పురుష ఓటర్లు: 9,51,145
➤ స్త్రీలు: 9,93,309
➤ ఇతరులు: 210 మంది
➤ మొత్తం ఓటర్లు: 19,44,664

ప్రతిరోజూ లక్ష పనిదినాలు లక్ష్యంగా ఉపాధిహామీ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ ఒ.ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో ఉపాధిహామీ, ఆర్డబ్ల్యుఎస్, హౌసింగ్, పంచాయతీ రాజ్ సీసీ రోడ్ల గ్రౌండింగ్, ఎంఎస్ఎంఈ సర్వే, ఎస్టీలకు ఆధార్కార్డుల జారీ, పిఎం సూర్యఘర్ యోజన పథకం అమలు మొదలైన అంశాలపై అధికారులతో మాట్లాడారు.

➤ చర్లపల్లి-తిరుపతి(07077): 6వ తేదీ
➤ తిరుపతి-చర్లపల్లి(07078): 7వ తేదీ
➤ చర్లపల్లి-తిరుపతి(02764):8, 11, 15 వ తేదీ
➤ కాచిగూడ-తిరుపతి(07655): 9, 16వ తేదీ
➤ తిరుపతి-కాచిగూడ(07656): 10, 17వతేదీ
పై ట్రైన్లు నెల్లూరు, గూడూరు జంక్షన్లలో ఆగుతాయి. వీటికి ఇవాళ ఉదయం 8 గంటలకు బుకింగ్ ప్రారంభం అవుతుంది.
Sorry, no posts matched your criteria.