India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నెల్లూరు నగరంలోని మెడికవర్ హాస్పిటల్, బుజబుజ నెల్లూరు చెక్ పోస్ట్ లను జిల్లా యస్.పి. ఆరీఫ్ హాఫిజ్ సోమవారం తనిఖీ చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా సరిహద్దు చెక్ పోస్టులు, ముఖ్య కూడళ్లలో వద్ద సంబంధిత పోలీస్ స్టేషన్ పోలీస్ అధికారులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఎటువంటి అక్రమ రవాణా లేకుండా పటిష్ఠమైన చర్యలు చేపట్టాలన్నారు.
కావలి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న పసుపులేటి సుధాకర్కు గ్లాస్ గుర్తును కేటాయించారు. దీంతో పసుపులేటి సుధాకర్ అనుచరులు ఆనంద ఉత్సవాల్లో నిమగ్నమయ్యారు. జనసేన పోటీ చేయని ప్రాంతాల్లో గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్గా ఎన్నికల అధికారులు చూపిస్తున్నారు. పలువురు స్వతంత్ర అభ్యర్థులు గ్లాస్ సింబల్ను తమకు కేటాయించాలని కోరుకున్నారు.
నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తం 14 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. సోమవారం సాయంత్రం నామినేషన్ ఉపసంహరణ అనంతరం అధికారిక జాబితా విడుదల చేశారు. మొత్తం 15 నామినేషన్లో ఉండగా వారిలో ఒకరు సోమవారం ఉపసంహరించుకున్నారు. దీంతో 14 మంది బరిలో నిలిచారు. ప్రధానంగా టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి, వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి మధ్య పోటీ నెలకొని ఉంది.
జలదంకిలోని పలు ప్రాంతాలలో సోమవారం వైసీపీ ఉదయగిరి అసెంబ్లీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి కోడలు శ్రేయ రెడ్డి ఇంటింటి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఓ ఇంటికి వెళ్లి దుస్తులను ఇస్త్రీ చేసి పలువురిని ఆకట్టుకున్నారు. గడిచిన ఐదేళ్లలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మొత్తం 11 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మొత్తం 12 మంది నామినేషన్లు సక్రమంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. సోమవారం నామినేషన్లను ఉపసంహరణకు ముందు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. దీంతో మొత్తం 11 మంది పోటీలో నిలిచారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోటంరెడ్డి, వైసీపీ అభ్యర్థి ఆదాల మధ్య పోటీ నెలకొంది.
నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్ వేసిన వేణుంబాక సునంద రెడ్డి తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. ఈ మేరకు సోమవారం సునంద రెడ్డి తరఫున ఎస్. సుబ్బారెడ్డి కలెక్టర్, ఎన్నికల అధికారి హరినారాయణ్ వద్దకు వెళ్లి తమ నామినేషన్ ఉపసంహరించుకుంటున్నట్లు తెలియజేసి పత్రాలను అందజేశారు.
నెల్లూరు జిల్లా మర్రిపాడు వైస్ ఎంపీపీ చప్పిడి రవణమ్మ తిరిగి వైసీపీ గూటికి చేరారు. నిన్న బ్రాహ్మణపల్లిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రాంనారాయణ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. 24 గంటలు గడవక ముందే ఆ పార్టీని వీడారు. ఇవాళ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ సమక్షంలో తిరిగి వైసీపీలో చేరడం విశేషం.
ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలోని 10 నియోజకవర్గాల్లో తుది పోరులో ఎవరు నిలుస్తారనేది ఇవాళ తేలనుంది. గూడూరులో 15, వెంకటగిరిలో 20, సూళ్లూరుపేటలో 23, సర్వేపల్లిలో 17, నెల్లూరు సిటీలో 27, రూరల్లో 24, కోవూరులో 32, కావలిలో 25, ఆత్మకూరులో 23, ఉదయగిరిలో 29 నామినేషన్లను అధికారులు ఆమోదించారు. నెల్లూరు ఎంపీ స్థానానికి 28 నామినేషన్లకు ఆమోదం లభించింది. ఇవాళ సాయంత్రంలోగా EVMలో ఎవరి పేర్లు ఉంటాయో తెలిసిపోతుంది.
ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో నిన్న సీఎం ప్రచారం జరిగింది. ఈక్రమంలో భద్రతా వైఫల్యం వెలుగు చూసింది. త్రిభువని సెంటర్లో ప్రసంగం అనంతరం జగన్ విశ్వోదయ కాలేజీ మైదానంలోని హెలిపాడ్ వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో డక్కిలి మండలం నాగోలు పంచాయతీ పెద్దయాచ సముద్రానికి చెందిన మాజీ వాలంటీర్ బారికేడ్లు దూకి హెలికాప్టర్ వద్దకు పరుగులు తీశాడు. భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు.
సర్వేపల్లి మాజీ MLA ఈదురు రామకృష్ణారెడ్డి సోదరుడు రాంప్రసాద్ రెడ్డి టీడీపీని వీడి వైసీపీ గూటికి చేరారు. నెల్లూరులోని తన క్యాంపు కార్యాలయంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆయనకు వైసీపీ కండువా కప్పారు. ముత్తుకూరు మండలంలో రాంప్రసాద్ రెడ్డికి గట్టిపట్టుందని.. అలాంటి నాయకుడు వైసీపీలోకి రావడం సంతోషంగా ఉందని కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు.
Sorry, no posts matched your criteria.