Nellore

News December 31, 2024

3 రోజుల్లో నెల్లూరు జిల్లాకు 7,800 టన్నుల యూరియా

image

జిల్లాకు మూడు రోజుల్లో 7,800 టన్నుల యూరియా రానున్నట్లు తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావూరు రాధాకృష్ణమ నాయుడు తెలిపారు. రైతుల అవసరాలకు సరిపడా యూరియా సరఫరా చేయాలని కోరుతూ మంగళవారం సర్వేపల్లి కెనాల్ ఛైర్మన్ నాగార్జున రెడ్డితో కలిసి వ్యవసాయ శాఖ జేడీ సత్యవాణికి వినతిపత్రం అందజేశారు. ఆమెతో పాటు ఉన్నతాధికారులతో మాట్లాడిన అనంతరం యూరియా గూడ్స్ వ్యాగన్లలో వస్తున్న విషయాన్ని తెలిపారు.

News December 31, 2024

ఎమ్మెల్యేలకు అచ్చొచ్చిన 2024

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పలువురు రాజకీయ నాయకులకు 2024 సంవత్సరం కలిసొచ్చింది. పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వీరిలో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, దగుమాటి వెంకటకృష్ణారెడ్డి, కాకర్ల సురేశ్, నెలవల విజయశ్రీ, ఇంటూరి నాగేశ్వరరావు ఉన్నారు. వీరి రాజకీయ జీవితంలో 2024 శాశ్వతంగా గుర్తుండిపోనుంది.

News December 31, 2024

వినూత్న ఆలోచనలకు ఎమ్మెల్యే విజయశ్రీ శ్రీకారం

image

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ తన దగ్గరకు వచ్చే నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు బొకేలు, పూలమాలలు తీసుకురావద్దని సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ అన్నారు. హాస్టల్ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా రగ్గులు, అంగన్వాడీ పిల్లలకు పనికొచ్చే ప్లేట్లు, గ్లాసులు, పేద విద్యార్థులకు ఉపయోగపడే బుక్స్, పెన్నులు తీసుకురావాలని ఆమె కోరారు.

News December 31, 2024

నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి కీలక ప్రకటన

image

మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ మన్మోహన్ సింగ్‌ డిసెంబర్ 26 న స్వర్గస్థులయ్యారు. మన్మోహన్ సింగ్‌ మరణాన్ని చింతిస్తూ 2024 డిసెంబర్ 26 నుంచి 2025 జనవరి 1 వరకు భారత ప్రభుత్వం సంతాప దినాలుగా ప్రకటించింది. మాజీ ప్రధాని మరణానికి సంతాప సూచకంగా పార్టీ ఆదేశాల మేరకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉంటున్నారని ఆయన కార్యాలయ అధికారులు తెలిపారు.

News December 31, 2024

ఈవీఎం గోడౌన్లను పరిశీలించిన నెల్లూరు కలెక్టర్

image

ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసి నిరంతరం నిఘా ఉంచాలని నెల్లూరు కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. త్రైమాసిక తనిఖీల్లో భాగంగా సోమవారం సాయంత్రం స్థానిక ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలోని ఈవీఎంల గోడౌన్లను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలించారు.

News December 30, 2024

2024లో మారిన నెల్లూరు రాజకీయ ముఖచిత్రం

image

2024లో సార్వత్రిక ఎన్నికలు నెల్లూరు జిల్లా రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేశాయి. నెల్లూరు MP సీటుతో పాటు 10 అసెంబ్లీ స్థానాల్లో TDP గెలిచింది. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అన్ని స్థానాలను గెలిచిన YCP 2024 ఎన్నికల్లో పూర్తిగా పట్టు కోల్పోయింది. సూళ్లూరుపేట నుంచి విజయశ్రీ, ఉదయగిరి నుంచి కాకర్ల సురేశ్, కోవూరు నుంచి ప్రశాంతి రెడ్డి, కావలి నుంచి కృష్ణారెడ్డి మొదటిసారి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు.

News December 30, 2024

నెల్లూరు: ఆనాటి గ్రీటింగ్ కార్డ్స్ ఇప్పుడు ఎక్కడ..?

image

నెల్లూరు జిల్లాలో కొత్త సంవత్సరం అంటే అందరూ జొన్నవాడ, నరసింహకొండ, పెంచలకోన అంటూ తమకు నచ్చిన గుడికి వెళ్తుంటారు. ఆ తర్వాత ఆత్మీయుల కోసం గ్రీటింగ్ కార్డు కొనుగోలు చేసి మనసులోని భావాలను ఆ కార్డుపై రాసి పంపేవారు. నేడు పరిస్థితి మారింది. గుడికి వెళ్లడం కొనసాగుతున్నా.. గ్రీటింగ్ కార్డులు మాయమయ్యాయి. మొబైల్ ఫోన్ల రాకతో అర్ధరాత్రి 12 మోగగానే మెసేజ్‌లు, కాల్స్‌తో విషెస్ చెబుతున్నారు.  

News December 30, 2024

నెల్లూరులో రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణానికి చర్యలు: నుడా ఛైర్మన్

image

నెల్లూరు నగరంలో తూర్పు, పడమర ప్రాంతాలను కలుపుతూ రైల్వే ఫ్లై ఓవర్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. ఆదివారం స్టోన్ హౌస్ పేటలోని పాండురంగ అన్నదాన సమాజంలో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆర్యవైశ్యులకు ఎల్లవేళలా అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు నిర్మాణానికి కృషి చేశామని ఆయన అన్నారు.

News December 30, 2024

నెల్లూరు: ‘జగన్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి’

image

సెకీతో ఒప్పందం కుదుర్చుకున్న మాజీ సీఎం జగన్ 30 ఏళ్లు పూర్తయ్యేసరికి ముత్తాత అవుతారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు టీడీపీ ఆఫిస్‌లో ఆదివారం ఆయన మాట్లాడారు. అవినీతిలో ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగిన జగన్ ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ చరిత్రలోనే జగన్ రెడ్డిలా అవినీతికి పాల్పడిన ముఖ్యమంత్రి ఎవ్వరు లేరని ఆయన దుయ్యబట్టారు.

News December 30, 2024

నెల్లూరు: ‘తస్మాత్ జాగ్రత్త.. ఉద్యోగాలిప్పిస్తామని మోసం చేస్తారు’

image

నెల్లూరు పోలీస్ గ్రౌండ్‌లో సోమవారం నుంచి నిర్వహించనున్న APSLRB పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసే వారిని నమ్మి మోసపోవద్దని జిల్లా ఎస్పీ జి కృష్ణ కాంత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హతే ప్రమాణికంగా ఈ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రిక్రూట్‌మెంట్‌కు వచ్చే అభ్యర్థులు సూచించిన ధ్రువపత్రాలను తమ వెంట తీసుకురావాలని ఎస్పీ కోరారు.