India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నెల్లూరు నగరంలోని ముత్యాలపాలెంలో పౌల్ (35) అనే వ్యక్తిని సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసి చంపేశారు. బిట్రగుంటకు చెందిన సుమారు 10 మంది ఈ హత్య చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ సాంబశివరావు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
సింహపురి ఎక్స్ప్రెస్ మహబూబాబాద్లో ఆగిపోవడంతో సర్వేపల్లి MLA సోమిరెడ్డి ప్రయాణానికి ఆటంకం ఏర్పడింది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సహకారంతో మున్సిపల్ ఛైర్మన్ ఇంట్లో ఆతిథ్యం పొందారు. పద్మావతి ఎక్స్ప్రెస్లో ఖమ్మంకు బయలుదేరగా మార్గమధ్యలో రైలు నిలిచిపోయింది.దీంతో కారు, బైకులపై ఖమ్మంకు చేరుకుని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయంలో బసచేశారు. అనంతరం కారులో హైదరాబాద్కు చేరుకున్నారు.
నెల్లూరు జిల్లాకి చెందిన మహిళ వరదల్లో చిక్కుకుని మృతి చెందింది. లింగసముద్రం(M), మెగిలిచర్లకు చెందిన S. వరలక్ష్మి(38) ఇటీవల విజయవాడలోని వాంబే కాలనీలో నివాసముంటున్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. శనివారం కాలనీని వరద చుట్టుముట్టింది. ప్రాంతంలోని నివాసాలన్నీ నీట మునిగాయి. వారు ఉంటున్న ఇంట్లోకి వరదనీరు చేరడంతో ఆమె అందులో చిక్కుకుపోవడంతో ఊపిరాడక మృతి చెందింది. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
జిల్లాలో బలహీనంగా ఉన్న చెరువులు, కాలువ కట్టలకు వెంటనే మరమ్మతులు చేసి భారీ వర్షాలు, వరదలు సంభవిస్తే ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఒ.ఆనంద్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లో ఆయన సమావేశం నిర్వహించారు. రెవెన్యూ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్లు, మ్యూటేషన్లు, గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు తదితర వాటిపై కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.
నెల్లూరు జిల్లా రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. బిట్రగుంట-చెన్నై-బిట్రగుంట (రైలు నెం.17238, 17237)ను నేటి నుంచి పునరుద్దరించారు. 6 నెలలు నుంచి ఈ రైలు ఏదో ఒక కారణంతో తాత్కాలికంగా రద్దవుతూ వచ్చింది. ఎట్టకేలకు నేటి నుంచి నడవడంతో ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పోలీసు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి సోమవారం 155 ఫిర్యాదులు వచ్చాయని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామన్నారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు.
అనంతసాగరం మండలం, సోమశిల జలాశయానికి సోమవారం ఉదయం 6 గంటలకు ఎగువ ప్రాంతాల నుంచి, కృష్ణా జలాల నుంచి 19,548 క్యూసెక్కుల నీరు చేరుతున్నట్లు జలాశయ ఈఈ దశరథ రామిరెడ్డి తెలిపారు. జలాశయం పూర్తి సామర్థ్యం 77.98 టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయంలో 38.181 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పెన్నా డెల్టాకు 550 క్యూసెక్కులు, కండలేరుకు 6000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయంలో 152 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతోంది.
నూతన మద్యం పాలసీ తీసుకురానున్న ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈనెల 7న రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల బంద్ నిర్వహించాలని ఏపీ స్టేట్బేవరేజస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అండ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. వారు మాట్లాడుతూ.. నూతన మద్యం పాలసీ పేరిట మద్యం దుకాణాలను ప్రైవేట్ పరం దిశగా రాష్ట్రప్రభుత్వం అడుగులు వేస్తోందని అన్నారు. ఇదే జరిగితే తమ పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు.
వాయుగుండం కారణంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గూడూరు జంక్షన్ మీదుగా వెళ్లే పలు రైళ్లు తాత్కాలికంగా రద్దు చేశారు. రద్దు చేసిన రైళ్లు క్రింది విధంగా :
12759 – చార్మినార్ (తాంబరం – హైదరాబాద్)
12615 – గ్రాండ్ ట్రంక్ (చెన్నై – న్యూ ఢిల్లీ)
12967 – జైపూర్ (చెన్నై – జైపూర్)
12621 – తమిళనాడు (చెన్నై-న్యూ ఢిల్లీ)
12760 – చార్మినార్ (హైదరాబాద్ – తాంబరం)
యువకుడిని దారణంగా కొట్టి హత్య చేసిన ఘటన దగదర్తి మండలంలో చోటుచేసుకుంది. ఏఎస్ పేటకు చెందిన N ప్రభయ్య(37) బంధువులను కలిసేందుకని రంగసముద్రం వచ్చారు. ఆ క్రమంలో గ్రామ చెరువు సమీపంలో మృతిచెంది ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలాన్ని SI జంపానికుమార్ పరిశీలించారు. ఏఎస్పేటలో రెండు వర్గాల మధ్య విభేదాల కారణంగా అక్కడి నుంచి పిలిపించి హత్యచేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.