Nellore

News April 3, 2024

సూళ్లూరుపేటలో బానుడి ప్రతాపం

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎండలు క్రమంగా పెరుగుతున్నాయి. మంగళవారం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారటీ ఉష్ణోగ్రతల వివరాలు వెల్లడించింది. సూళ్లూరుపేటలో అత్యధికంగా 43.1 డిగ్రీల సెంటిగ్రేడ్ సమోదుకాగా.. వాకాడు మండలంలో కనిష్టంగా 36.5 డిగ్రీలు నమోదయ్యాయి. రేపు. ఎల్లుండి సూళ్లూరుపేటలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వెల్లడించింది.

News April 3, 2024

నెల్లూరు: వైసీపీ ప్రచారంలో హోంగార్డు..?

image

జిల్లాలోని కొండాపురం మండలం పెరికిపాలెంలో వైసీపీ ప్రచారం జరిగింది. ఇందులో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం ద్వారా జీతం తీసుకునే ఏ ఒక్కరూ ఎన్నికల నేపథ్యంలో ప్రచారాల్లో పాల్గొన వద్దని ఎన్నికల సంఘం ఆదేశించింది. అయినప్పటికీ కొందరు ఇలా వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి.

News April 3, 2024

నెల్లూరు: చెరువులో యువకుడి గల్లంతు

image

నెల్లూరు జిల్లాలో ఓ యవకుడు చెరువులో మునిగిపోయాడు. మనుబోలు మండలం వీరంపల్లికి చెందిన కోటేశ్వరరావు గేదెలు రాత్రయినా ఇంటికి రాలేదు. దీంతో వాటిని వెతుక్కుంటూ వెళ్లాడు. ఈక్రమంలో చెరువులో దిగగా.. లోతు ఎక్కువగా ఉండటంతో గల్లంతయ్యాడు. ఎస్ఐ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు. యువకుడి ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

News April 3, 2024

ఆనం ఫ్యామిలీకే తక్కువ మెజార్టీ..!

image

ఆనం సంజీవ రెడ్డి 1958లో కాంగ్రెస్ తరఫున ఆత్మకూరులో పోటీ చేశారు. కేవలం 45 ఓట్ల తేడాతో MLAగా గెలిచారు. జిల్లాలో ఇప్పటి వరకు తక్కువ మెజార్టీ ఆయనదే. 1962లో వి.వెంకురెడ్డి ఇండిపెండెంట్‌గా బరిలో దిగి 86 ఓట్ల మెజార్టీతో MLAగా ఎన్నికయ్యారు. 2009లో నెల్లూరు సిటీలో ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి(PRP) కేవలం 90 ఓట్ల తేడాతో అనిల్ కుమార్ యాదవ్(CONG)పై గెలిచారు. తాజా ఎన్నికల్లో ఈ రికార్డ్ బ్రేక్ అవుతుందా?

News April 3, 2024

నెల్లూరు: 8వ తేదీ వరకు పింఛన్లు

image

గ్రామ, వార్డు సచివాలయాల్లో బుధవారం నుంచి పింఛన్లను పంపిణీ చేయనున్నారు. 8వ తేదీ వరకు నగదు అందజేస్తారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 3,19,961 మంది లబ్ధిదారులుండగా.. వీరికి 95.77 కోట్ల నగదు పంపిణీ చేస్తారు. అనారోగ్యంతో తిరగలేని వారి వద్దకు సచివాలయ ఉద్యోగులు వెళ్లి నగదు అందజేయనున్నారు. పెన్షన్ల పంపిణీకి ఒక్కో సచివాలయంలో 5 నుంచి 6 కౌంటర్లు ఏర్పాటు చేశారు.

News April 3, 2024

విధుల నుంచి నెల్లూరు ఎస్పీ రిలీవ్

image

ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని పలువురు ఐపీఎస్ అధికారులు అధికారులను బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర రెడ్డి బదిలీ అయ్యారు. ఏఎస్పీ సీహెచ్ సౌజన్యకు బాధ్యతలు అప్పగించి తిరుమలేశ్వర రెడ్డి తన విధుల నుంచి రిలీవ్ అయ్యారు. ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు. తిరుమలేశ్వరరెడ్డి గతేడాది ఏప్రిల్ 12న బాధ్యతలు స్వీకరించారు.

News April 3, 2024

నెల్లూరు సిటీ బరిలో సీపీఎం..!

image

కాంగ్రెస్ పార్టీతో వామపక్షాల పొత్తు నేపథ్యంలో నెల్లూరు సిటీ స్థానం నుంచి సీపీఎం బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సీపీఎం నేతలు నెల్లూరులో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈక్రమంలోనే నిన్న విడుదలైన కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలో నెల్లూరు సిటీ అభ్యర్థి పేరు లేదు. సీపీఎం అభ్యర్థిగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మూలం రమేశ్ పేరు వినిపిస్తోంది.

News April 3, 2024

ఎన్నికల శిక్షణకు గైర్హాజరైతే కఠిన చర్యలు: కలెక్టర్

image

భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల విధులు కేటాయించబడిన ప్రిసైడింగ్ అధికారులు 100 శాతం ఎన్నికల శిక్షణకు హాజరు కావాలని కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు. హాజరు కాని సిబ్బంది పోలింగ్ విధుల్లో పాల్గొనేందుకు అనర్హులని పేర్కొన్నారు. ఎవరైతే శిక్షణకు గైర్హాజరవుతారో వారిపై పోలీస్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు

News April 2, 2024

ఉదయగిరి: పింఛన్ కోసం పడిగాపులు కాసి వృద్ధుడు మృతి

image

ఉదయగిరి మండల పరిధిలోని కొండయ్యపాలెం పంచాయతీ వీరారెడ్డిపల్లి ఎస్సీ కాలనీకి చెందిన స్వర్ణ లక్ష్మయ్య అనే వృద్ధుడు మృతి చెందారు. ప్రతి నెల వాలంటీర్లు ఇంటింటికి తెచ్చి పెన్షన్లు అందజేస్తున్న తరుణంలో ఎన్నికల కమిషన్ వాలంటీర్లు వ్యవస్థను పక్కన పెట్టింది. దీంతో పెన్షన్ మీదే ఆధారపడే ఈ వృద్ధుడు ఉండబట్టలేక కొండాయపాలెం సచివాలయం వెళ్లి విచారించి తిరిగి ఇంటికి వచ్చే లోగా ప్రాణం వదిలారు.

News April 2, 2024

వెంకటగిరి: పింఛన్ కోసం వచ్చి వృద్ధుడు మృతి

image

తనకు రావాల్సిన పింఛను కోసం తిరుపతి నుంచి వెంకటగిరిలోని బంగారు పేటకు 80 ఏళ్ల వృద్ధుడు వెంకటయ్య వచ్చాడు. పింఛన్ విషయం కనుక్కునేందుకు ఎండలో సచివాలయానికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్లగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.