Nellore

News March 30, 2024

నెల్లూరు: వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే విష్ణు

image

మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి వైసీపీలో చేరనున్నారు. ఈ మేరకు ఆయన అధికారిక ప్రకటన చేశారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సూచనలు, సలహా మేరకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో చేరుతున్నట్లు తెలిపారు. మూడు రోజుల క్రితమే నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఆయన వైఎస్ జగన్ తో సమావేశమయ్యారు. ఏప్రిల్ మొదటి వారంలో కావలిలో జగన్ సమక్షంలో వైసీపీలో చేరే అవకాశం కనిపిస్తోంది.

News March 30, 2024

నెల్లూరు: జులై నుంచి 4 వేలు పెన్షన్: కేతం రెడ్డి 

image

నెల్లూరు సిటీ పరిధిలో 5వ డివిజన్లోని పలు ప్రాంతాల్లో టీడీపీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు. కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నారాయణని గెలిపించాలని కోరారు. కూటమి ప్రభుత్వం గెలవగానే జులై నెల నుంచి 4వేలు పెన్షన్ ఇస్తామని అవ్వ, తాతలకు భరోసా కల్పించారు. వైసీపీ ప్రభుత్వం ఒక చేత్తో సంక్షేమ పథకాలిచ్చి మరొక చేత్తో అధిక ధరల రూపంలో లాక్కోవడం సరికాదన్నారు.

News March 30, 2024

కావలిలో వ్యక్తి దారుణ హత్య.. తల్లీకొడుకుల అరెస్ట్

image

కావలి: పెదరాముడుపాళేనికి చెందిన చిన్నగోపాల్‌తో అసహజ శృంగారం చేసిన బుచ్చంగారి ఎజ్రానే ఈ హత్యలో నిందితుడని కావలి DSP వెంకటరమణ పేర్కొన్నారు. నిందితుడు చిన్నగోపాల్‌పై లైంగిక దాడికి పాల్పడడంతో విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో నిందితుడు అతణ్ని తాళ్లతో కట్టేసి గొంతు వద్ద తాడుతో బిగించి హత్యచేశాడు. అనంతరం మృతదేహాన్ని తగలబెట్టేందుకు నిందితుడి తల్లి మంగమ్మ కూడా సహకరించింది. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

News March 30, 2024

గూడూరు: విద్యార్థిపై కత్తితో దాడి

image

సైదాపురం మండలం లింగసముద్రానికి చెందిన ప్రేమ్ కుమార్ చెన్నూరు రెసిడెన్షియల్ స్కూలులో చదువుకుంటున్నాడు. గురువారం రాత్రి స్కూలులో వార్షికోత్సవం సందర్భంగా వాహనం పార్కింగ్ విషయంలో స్థానిక యువకుడు విష్ణుకి ఇంటర్ చదివే ప్రేమ్ కుమార్ అన్న అశోక్ తో వాగ్వాదం జరిగింది. విష్ణు కత్తితో దాడి చేయడంతో అశోక్ గాయపడ్డాడు. ఈ మేరకు ఎస్సై మనోజ్ కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News March 29, 2024

చంద్రబాబు సభకు దూరంగా బొల్లినేని

image

ఉదయగిరి తెలుగుదేశం పార్టీలో రేగిన అసమ్మతి చల్లారేలా కనిపించడం లేదు. వింజమూరులో ఇవాళ టీడీపీ అధినేత నిర్వహించిన ప్రజాగళం సభకు మాజీ MLA బొల్లినేని రామారావు దూరంగా ఉన్నారు. చంద్రబాబు సభాస్థలికి రాకమునుపే బస్సులో ఆయనతో సమావేశమైన రామారావు.. తర్వాత రాత్రి చంద్రబాబు బస ప్రాంతానికి వెళ్లినట్లు తెలిసింది. ఉదయగిరి ఇన్‌ఛార్జ్‌గా ఉన్న బొల్లినేనిని కాదని టీడీపీ అధిష్ఠానం కాకర్లకు అవకాశం కల్పించింది.

News March 29, 2024

ప్రజల ఆస్తులు కబ్జా: చంద్రబాబు

image

వైసీపీ నేతలు ప్రజల ఆస్తులను కబ్జా చేస్తున్నారని.. ఎదురుతిరిగిన వారిపై కేసులు పెట్టి జైలులో పెడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. కావలిలో ఆయన మాట్లాడుతూ.. ‘ఈ రాష్ట్రంలో ప్రజలకు రక్షణ లేదు. కృష్ణపట్నం పోర్టు ఏమైందో ప్రజలు చూశారు. రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలను తరిమికొట్టారు. న్యాయం చేయాలని కోరిన చెల్లెలపైనే కేసులు పెట్టారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

News March 29, 2024

TDPకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా

image

నెల్లూరు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే టీడీపీకి షాక్ ఇచ్చారు. అల్లూరు మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన వైసీపీలో చేరతారని తెలుస్తోంది. ఇప్పటికే ఆయన సీఎం జగన్‌ను కలిసి చేరికపై చర్చించినట్లు సమాచారం.

News March 29, 2024

కావలికి చేరుకున్న చంద్రబాబు

image

మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజాగళం యాత్రలో భాగంగా కావలికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కావలి MLA అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి, రూప్ కుమార్ యాదవ్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. శాలువా కప్పి బొకేలు అందజేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

News March 29, 2024

NLR: జాతీయ రహదారిపై ప్రమాదం

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. గూడూరు సమీపంలో అమరావతి హోటల్ వద్ద జాతీయ రహదారిపై బస్సు, కారు, మరో వాహనం ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. పలువురికి గాయాలైనట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 29, 2024

నెల్లూరుకు సీఎం జగన్ రాక

image

సీఎం జగన్మోహన్ రెడ్డి ఏప్రిల్ 6న కావలి పట్టణానికి రానున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నేతలు బస్సు యాత్ర ఏర్పాట్లు రూట్ మ్యాప్ ను పరిశీలించారు. బస్సు యాత్ర కార్యక్రమంతో వైసీపీకి విశేష ఆదరణ లభిస్తుందని ఎమ్మెల్యే రామిరెడ్డి అన్నారు. మరోసారి వైసీపీ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.