India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్-2 (SMP) పరీక్షలు ఈనెల 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు నెల్లూరు డీఈవో ఆర్.బాలాజీరావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఎస్సీఈఆర్టీ ద్వారా ప్రశ్నపత్రాలు అందజేస్తామన్నారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు సొంత ప్రశ్నపత్రాలతో పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.

నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు 30 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని సివిల్ సప్లయిస్ సంస్థ డీఎం నర్సింహరావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ 37,978 ఎకరాల్లో వరి సాగు చేశారని చెప్పారు. 1,29,583 టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు నివేదికలు ఇచ్చారన్నారు. ప్రభుత్వం 2024-25 సీజన్కు గ్రేడ్-ఏ రకానికి రూ.2,320, సాధారణ రకానికి రూ.2,300 మద్దతు ధరగా ప్రకటించిందన్నారు.

ఇంటి స్థలం పేరుతో ఓ వ్యక్తి మోసానికి పాల్పడ్డాడు. నెల్లూరుకు చెందిన కంచర్ల సతీశ్ చంద్రగుప్తా HYDలోని రాయదుర్గంలో ఉంటున్నాడు. సాయి సూర్య డెవలపర్స్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అక్కడే ఓ స్థలానికి ఫేక్ పేపర్స్ సృష్టించాడు. గోపాల్ రెడ్డికి రూ.3.25 కోట్లకు ప్లాట్ ఇస్తానని చెప్పి రూ.1.45కోట్లు తీసుకున్నాడు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేయకుండా తప్పించుకు తిరగడంతో పోలీసులు అరెస్ట్ చేశారు.

కావలిలో ప్రయాణికుడిపై డ్రైవర్ చేయి చేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. లాజర్ అనే ప్రయాణికుడు మద్యం తాగి బస్సు ఎక్కే ప్రయత్నం చేయగా డ్రైవర్ అడ్డుకున్నాడు. తాగి బస్సు ఎక్కకూడదని చెప్పడంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈక్రమంలో డ్రైవర్ తనను కొట్టడంతో పన్ను విరిగి నోటి నిండా రక్తస్రావమైందని లాజర్ ఆరోపించారు. ఆయన కుటుంబ సభ్యులు రోడ్డు మీద బైఠాయించారు. పోలీసులు బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.

అపార్ నమోదులో జిల్లాలో ఉదయగిరి తొలి స్థానంలో నిలిచిందని MEO- 2 తోట శ్రీనివాసులు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. అపార్ నమోదులో జిల్లాలోని 38 మండలాలకు గాను ఉదయగిరి 58.76శాతంతో మొదటి స్థానం దక్కిందన్నారు. నెల్లూరు అర్బన్, రూరల్ చివరి స్థానాల్లో కొనసాగడం గమనార్హం. ఉదయగిరిని ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేసిన HM కార్యాలయ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

గూడూరు నియోజకవర్గంలో శుక్రవారం మరో హత్య జరిగింది. వాకాడు మండలం శ్రీనివాసపురంలో తండ్రి చిన్న సుబ్బరామయ్యను కుమారుడే హత్య చేశాడు. తండ్రి అన్నం తింటున్న సమయంలో కర్రతో కొట్టడంతో తీవ్రగాయమైంది. ఘటనా స్థలంలోనే సుబ్బరామయ్య మృతిచెందాడు. కుమారుడు పరారీలో ఉన్నాడు. వాకాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిన్న రాత్రి ఇదే నియోజకవర్గంలోని చిల్లకూరు మండలంలో <<14501641>>హత్య <<>>జరిగిన విషయం తెలిసిందే.

తడ రైల్వే స్టేషన్ నుంచి తమిళనాడుకు గంజాయి తరలిస్తున్న నలుగురు స్మగ్లర్స్ను తడ పోలీసులు ఇవాళ సాయంత్రం అరెస్ట్ చేశారు. రైల్వే స్టేషన్ పార్కింగ్ ప్లేస్ వద్ద బ్యాగ్స్తో ఉన్న నలుగురు అనుమానస్పదంగా ఉన్నారనే స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.5 లక్షలు విలువ చేసే 46 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో సీఐ, ఎస్సైలు ఉన్నారు.

చిల్లకూరు మండలం కడివేడు అరుంధతీయవాడలో గురువారం సాయంత్రం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. హత్యకు పాత కక్షలే కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. మద్యం మత్తులో ముగ్గురు వ్యక్తులు హత్య చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. హంతకులను కనిపెట్టేందుకు డాగ్స్ను కూడా రప్పిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

నెల్లూరు నగర పరిధిలోని అల్లీపురానికి చెందిన ఓ మహిళకు గురువారం పురిటినొప్పులు వచ్చాయి. 108 అంబులెన్స్కి సమాచారం ఇచ్చిన కుటుంబసభ్యులు ఆమెను తీసుకుని ఆటోలో ఎదురెళ్లారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి నివాసం వద్ద ఆటోలో నుంచి అంబులెన్స్లోకి ఎక్కించి అక్కడే ప్రసవం చేశారు. సోమిరెడ్డితో పాటు ఆయన కోడలు శృతిరెడ్డి చిన్నారిని ఎత్తుకున్నారు. దీపావళి నాడు పుట్టిన చిన్నారికి ‘సంతోషి’గా నామకరణం చేశారు.

రెవెన్యూ శాఖకు సంబంధించిన ఆర్డీవో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న శ్రావణ్ని కలెక్టర్ సస్పెండ్ చేశారు. బాణసంచా దుకాణాల పర్మిషన్స్, రెన్యువల్ తదితర అంశాలకు సంబంధించి అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై కలెక్టర్ ఆనంద్ సస్పెండ్ చేశారు. జిల్లాలోని కొంతమంది బాణాసంచా దుకాణాల యజమానులు కలెక్టర్, ఆర్డీవోల పనితీరుపై హర్షం వ్యక్తం చేశారు.
Sorry, no posts matched your criteria.