India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కావలిలోని రాజావీధిలో నివాసం ఉంటున్న గార్నపూడి శిరీష, ఆమె తల్లి నత్తల వజ్రమ్మను రైలు ఢీ కొట్టడంతో ఇద్దరూ మృతి చెందారు. ఈ తెల్లవారు జామున తల్లి వజ్రమ్మను విజయవాడ ప్యాసింజరు ఎక్కించేందుకు శిరీష కావలి రైల్వే స్టేషన్కు వెళ్లారు. 3వ ప్లాట్ ఫారం వజ్రమ్మ ఎక్కలేక పోయారు. తల్లిని పట్టాలు దాటించేందుకు శిరీష ప్రయత్నించగా అప్పటికే వేగంగా వచ్చిన కోయంబత్తూరు ఎక్స్ ప్రెస్ రైలు ఇద్దరిని ఢీ కొట్టింది.

ఆస్తుల గొడవలతో పెద్దాయన(YSR) చరిత్రను నాశనం చేసేలా సొంత వారే ప్రవర్తిస్తున్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఒంగోలులో ఆయన మాట్లాడుతూ.. ‘YSR ఉన్నప్పుడే జగన్ రూ. లక్ష కోట్ల సంపాదించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ దోపిడీలో వైఎస్ భాగస్వామ్యం ఎంతనేది ఆలోచించాలి. వైఎస్ అక్రమ సంపాదనను ప్రజలకు పంచిపెట్టాలి. ఇది కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందో చెప్పాలి’ అని ఆనం డిమాండ్ చేశారు.

వరగలి గ్రామంలో ఈ నెల 7వ తేదీన అనుమానాస్పదంగా మృతి చెందిన బాలుడు లాసిక్ను ఉద్దేశ పూర్వకంగానే చంపినట్లు గూడూరు డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. బాలుడు తల్లికి అనిల్ అనే వ్యక్తికి ఉన్న అక్రమ సంబంధమే ఈ హత్యకు కారణమని అన్నారు. తమ అక్రమ సంబంధానికి బాలుడు అడ్డుగా ఉన్నాడని భావించిన అనిల్.. చరణ్ అనే వ్యక్తితో కలిసి ఉప్పుటేరులో బాలుడిని తోసి చంపారని ఆయన తెలిపారు.

నెల్లూరు జిల్లా ఉపాధి కార్యాలయం, జిల్లా స్కిల్ డెవలప్మెంట్, సిడాప్ సంయుక్తంగా నవంబరు 1న ఉదయం 10.30 గంటలకు మైపాడు గేట్ సమీపంలోని న్యాక్ సెంటర్ నందు మెగా జాబ్ మేళా జరుగుతుందని జిల్లా ఉపాధి కల్పనా అధికారి ఎం.వినయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే వారు 18 – 25 ఏళ్ల లోపు ఉండి, ఐటి/ఇంటర్/ డిగ్రీ/డిప్లొమా విద్యార్హతలు కలిగి ఉండాలన్నారు.

నెల్లూరు జిల్లా ప్రజలకు, పోలీస్ సిబ్బందికి ఎస్పీ కృష్ణ కాంత్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చీకట్లను పారద్రోలి అందరి జీవితాల్లో మరిన్ని కాంతులు నిండాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే పండుగ దీపావళి అన్నారు. కాలుష్యరహిత టపాసులను కాల్చాలని సూచించారు.

దీపావళి పండుగను పురస్కరించుకొని దీపావళి వేడుక చిత్రాన్ని రావి ఆకుపై ఓ కళాకారుడు రూపొందించారు. పొదలకూరు మండలం మహమ్మదాపురం గ్రామానికి చెందిన విశ్రాంత డ్రాయింగ్ మాస్టర్ పచ్చ పెంచలయ్య ఈ చిత్రాన్ని గీసి అబ్బురపరిచారు. కాగా ఇదివరకు ఆయన రావి ఆకుపై చాలా చిత్రాలను గీశారు.

ఎన్నికల సంఘం ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేసింది. నెల్లూరు జిల్లాలో మొత్తం 19,44,157మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 9,51,122.. మహిళలు 9,92,825.. థర్డ్ జెండర్ 210 మంది ఉన్నారు. నవంబరులో అభ్యంతరాలు స్వీకరించి.. వచ్చే ఏడాది 6న ఓటర్ల తుది జాబితా విడుదల చేయనుంది.

రాష్ట్రంలోని దేవాలయాల్లో ప్రసాదాల తయారీ, ఇతరత్రా అవసరాల కోసం వినియోగించే నెయ్యిని సేకరించే విషయంలో అనుసరించాల్సిన విధి విధానాల్లో మార్పులను సూచించడానికి ఒక ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని నియమిస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించారు. ఈ కమిటీ 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని నిర్దేశించారు. మంగళవారం దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో వివిధ డైరీల సంఘాలు, సంస్థ ప్రతినిధులతో చర్చించారు.

రాష్ట్రంలోని దేవాలయాల్లో ప్రసాదాల తయారీ, ఇతరత్రా అవసరాల కోసం వినియోగించే నెయ్యిని సేకరించే విషయంలో అనుసరించాల్సిన విధి విధానాల్లో మార్పులను సూచించడానికి ఒక ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని నియమిస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించారు. ఈ కమిటీ 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని నిర్దేశించారు. మంగళవారం దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో వివిధ డైరీల సంఘాలు, సంస్థ ప్రతినిధులతో చర్చించారు.

కావలి పట్టణం వెంగళరావు నగర్లో కిడ్నాప్ అయిన బాలుడి ఆచూకీ ఎట్టకేలకు పోలీసులకు దొరికింది. ఓ మహిళ బాలుడిని అపహరించగా.. సంబంధిత సీసీ ఫుటేజ్లను మంగళవారం పోలీసులు విడుదల చేశారు. బాలుడు ఇంటి ఎదురుగా పనిచేస్తున్న స్వరూపనే కిడ్నాప్ చేసినట్లు గుర్తించారు. ఆమెను ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం పొన్నలూరు వద్ద బస్సులో పోలీసులు పట్టుకున్నారు.
Sorry, no posts matched your criteria.