India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సూళ్లూరుపేట సమీపంలోని గోకులకృష్ణ కాలేజీ వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ డిపో నుంచి సూళ్లూరుపేటకు వెళ్తూ గోకుల్ కృష్ణ కాలేజీ వద్ద యూటర్న్ తీసుకుంటున్న ఆర్టీసీ బస్సును చెన్నై నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. అయితే ఎవ్వరికి ప్రాణ నష్టం జరగలేదు.
ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో కరోనా నాటు మందు సృష్టికర్త బోనిగి ఆనందయ్య మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనతోపాటు అతని అనుచరులు కూడా టీడీపీలో చేరారు. ఆనందయ్య వైసీపీ ఎంపీటీసీగా ఉన్నారు. ఆనందయ్య టీడీపీలో చేరడం చాలా సంతోషంగా ఉందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రస్తుత ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగుతున్న అభ్యర్థులే ఎక్కువ మంది ఉన్నారు. వీరితో పాటు సీనియర్ నాయకులూ పోటీ పడబోతున్నారు. వీరందరిలో సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి. ఆయన 1983లోనే తొలిసారి నెల్లూరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గాల్లో మంత్రిగా వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో ఆయన ఆత్మకూరు ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు.
వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా స్వచ్ఛ ఆంధ్ర ఛైర్పర్సన్ పి.దేవసేనమ్మ పేరును అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే వెంకటగిరి సీటును నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పేరు ప్రకటించగా ఆయనపై అసమ్మతి వర్గం దండెత్తడంతో ఆయన పేరు మార్చే యోచనలో అధిష్ఠానం ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు అధిష్ఠానం నుంచి దేవసేనమ్మకు పిలుపు అందినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమె పేరును పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
నెల్లూరు నియోజకవర్గంలో 1989 ఎన్నికల్లో జక్కా కోదండరామి రెడ్డి(జేకే రెడ్డి) సంచలనం సృష్టించారు. అప్పట్లో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగగా ఎన్నికల కమిషన్ ఉదయించే సూర్యుడు గుర్తు కేటాయించింది. ఆ ఎన్నికల్లో ప్రచారాన్ని జేకే రెడ్డి సరికొత్త పుంతలు తొక్కించారు. అందరి మనస్సు చూరగొని తన సమీప ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి తాళ్లపాక రమేష్ రెడ్డిపై 14474 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
కావలి రూరల్ మండలం పెద్దరాముడుపాళెంలో దారుణం చోటుచేసుకుంది. ఈ నెల 19న గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పని ఉందని కాటంగారి చిన్నగోపాల్(27)ను తీసుకెళ్లాడు. రాత్రి అయినా రాకపోవడంతో కుటుంబ సభ్యులు తెలిసిన ప్రాంతాలు, కుటుంబ సభ్యుల వద్ద ఆరాతీశారు. గోపాల్ను తీసుకెళ్లిన వ్యక్తి తన ఇంటి వెనకే పూడ్చినట్లు మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఘటనపై కావలి రూరల్ సీఐ శ్రీనివాస గౌడ్ విచారణ చేపట్టారు.
విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి హర్ష కోరారు. ఈ మేరకు యూనివర్సిటీ రిజిస్టర్ డాక్టర్ రామచంద్రా రెడ్డికి వినతిపత్రం అందజేశారు. రెండు, నాలుగు సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసి 90 రోజుల తరువాతే పరీక్షలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు నరేంద్ర, చరణ్ తదితరులు ఉన్నారు.
ఉమ్మడి నెల్లూరు ప్రజలు ఎంతో ఆనందంగా భాగస్వాములయ్యే రంగడి తేరు (శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి రథోత్సవం) బుధవారం జరగనుంది. ఉదయం 8.30 గంటలకు సర్వాలంకార శోభితులైన దేవేరుల సమేత రంగనాథుడు విశేషంగా అలంకరించిన రథంలో కొలువుదీరుతారు. అనంతరం గోపురం వీధిలో రైల్వే గేటు వరకు తిరిగి ఆలయం మీదుగా సంతపేట నాలుగు కాళ్ల మండపం వరకు రథోత్సవం సాగనుంది. అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.
ఉదయగిరిలో 1994 ఎన్నికల ప్రత్యేకతే వేరు. కంభం విజయరామి రెడ్డి టీడీపీ సీటు రేసులో ఉండగా అనూహ్యంగా కొండపల్లి గురవయ్య నాయుడు బీఫామ్ దక్కించుకున్నారు. చివరిలో మళ్లీ టీడీపీ అధిష్ఠానం కంభంకే మద్దతు పలికింది. అప్పటికే సమయం మించడంతో స్వతంత్ర అభ్యర్థిగా ఎద్దుల బండి గుర్తుతో పోటీ చేశారు. 61 శాతం ఓట్లతో ఎమ్మెల్యేగా ఎన్నికై కంభం సంచలనం సృష్టించారు. రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి మాదాల జానకిరాం నిలిచారు.
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ డాక్టర్ కే తిరుమలేశ్వర్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన ఉదయగిరి పోలీస్ స్టేషన్, సర్కిల్ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 18 చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశామన్నారు. దీంతోపాటు 26 ఫ్లయింగ్ స్క్వాడ్ టీములు ఏర్పాటు చేసి ఇప్పటికే తనిఖీలు చేపట్టామన్నారు.
Sorry, no posts matched your criteria.