Nellore

News March 26, 2024

వేడెక్కిన వెంకటగిరి రాజకీయం

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వెంకటగిరి నియోజకవర్గ రాజకీయం వేడెక్కింది. అధికార వైసీపీతో పాటు ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులకు పార్టీలోని అసమ్మతి నేతలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. వైసీపీలో రాంకుమార్ రెడ్డిని వ్యతిరేకిస్తూ మెట్టుకూరు ధనుంజయరెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టారు. మరోవైపు టీడీపీలో సీటు దక్కలేదని కీలక నేత మస్తాన్ యాదవ్ ఏకంగా పార్టీకే రాజీనామా చేశారు.

News March 26, 2024

నెల్లూరు: నాడు ప్రత్యర్థులు.. నేడు మిత్రులు

image

గూడూరు రాజకీయాలు ఆసక్తిగా మారాయి. YCPని వీడి BJPలో చేరిన గూడూరు MLA వరప్రసాద్‌కు ఆ పార్టీ తిరుపతి టికెట్ కేటాయించింది. ఈక్రమంలో తొలిసారిగా గూడూరుకి వచ్చిన ఆయనకు TDP, జనసేన, BJP శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. పొత్తులో భాగంగా గూడూరు నుంచి పాశం సునీల్, తిరుపతి MP అభ్యర్థిగా వరప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఐదేళ్ల క్రితం ప్రత్యర్థులుగా తలపడిన వీళ్లు ఇప్పుడు ఒకే కూటమి కింద ఒకరికొకరు ప్రచారం చేసుకుంటున్నారు.

News March 26, 2024

నెల్లూరు: టీడీపీకి మస్తాన్ యాదవ్ రాజీనామా

image

వెంకటగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. టీడీపీ నేత డాక్టర్ మస్తాన్ యాదవ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో వెనుకబడిన తరగతుల వారిపై చూపిన వివక్ష కారణంగా టీడీపీ సభ్యత్వానికి, రాష్ట్ర కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

News March 26, 2024

HOSTELలో నెల్లూరు యువకుడి SUICIDE

image

HYDలో నెల్లూరు జిల్లా ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. కందుకూరు(M) పందలపాడుకు చెందిన కిరణ్ కుమార్(26) HYD వనస్థలిపురంలోని ఓ హాస్టల్‌లో ఉంటూ ప్రైవేటు జాబ్ చేస్తున్నాడు. సోమవారం గదిలోకి వెళ్లిన అతడు ఎంతకూ బయటకు రాలేదు. యజమాని కిటికీలోంచి చూడగా ఉరేసుకుని కనిపించాడు. పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి వచ్చి కేసు నమోదు చేశారు. అతడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News March 26, 2024

నెల్లూరు: YCP కీలక నేత గుండెపోటుతో మృతి

image

వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్, నెల్లూరులో సీనియర్ రాజకీయ నాయకుడైన మున్వర్ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేసిన ఆయన కొంతకాలం క్రితం వైసీపీలో చేరారు. మున్వర్ హఠాన్మరణం చెందడంపై అన్ని రాజకీయ పార్టీల నేతలతో పాటు ఆయన అనుచరులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. నెల్లూరులోని ఆయన నివాసానికి చేరుకుని భౌతికకాయానికి నివాళులర్పిస్తున్నారు.

News March 26, 2024

కోవూరు : అమ్మకు అండగా అర్జున్ రెడ్డి

image

కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి రాజకీయ వ్యవహారాలలో ఆమె కుమారుడు డాక్టర్ అర్జున్ రెడ్డి కీలకపాత్ర పోషిస్తున్నారు. నెల్లూరులోనే మకాం వేసి పాత పరిచయాలు, బంధుత్వాలను సమన్వయం చేసుకుంటూ పలువురు నేతలను వైసీపీ నుంచి టీడీపీలోకి తీసుకురావడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.

News March 26, 2024

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్ పై కేసు నమోదు

image

కోవూరు మండలంలోని పోతిరెడ్డిపాళెంలో సోమవారం జరిగిన వైసీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న గ్రామానికి చెందిన వాలంటీరు పెంచలయ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లుగా భావిస్తూ స్థానిక పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన నివేదిక మేరకు ఎంపీడీవో రామాంజనేయులు ఫిర్యాదు చేసినట్లు ఎస్సై రంగనాథ్ గౌడ్ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News March 25, 2024

పనబాకకు టికెట్ లేనట్లే..!

image

కావలికి చెందిన పనబాక లక్ష్మి నెల్లూరులో మూడు సార్లు, బాపట్లలో ఒకసారి MPగా గెలిచారు. కేంద్ర మంత్రిగానూ పని చేసిన ఆమె రాష్ట్ర విభజన తర్వాత TDPలో చేరారు. 2019, 2021లో తిరుపతి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా ఆమె తిరుపతి, బాపట్లలో ఏదో ఒక స్థానం నుంచి టికెట్ వస్తుందని ఆశించారు. ఆ రెండు చోట్ల చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించడంతో పార్టీ మారుతారని ప్రచారం జరిగింది. దీన్ని ఆమె ఖండించారు.

News March 25, 2024

అందరి చూపు కాటంరెడ్డి వైపే

image

మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డిని ప్రసన్నం చేసుకునేందుకు టీడీపీ, వైసీపీ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి, ఇటీవల విష్ణుతో వేర్వేరుగా భేటీ అయ్యారు. ఆయనను టీడీపీలోకి ఆహ్వానించారు. ఇవాళ వైసీపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి ఆయనతో సమావేశమయ్యారు. విష్ణు మాత్రం పోటీలో ఉంటానంటూ ప్రచారంలో దూసుకెళుతున్నారు.

News March 25, 2024

27న నెల్లూరుకు చంద్రబాబు నాయుడు

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా మార్చి 27న నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రానున్నారు. ప్రజాగళం పేరుతో ఆయన పర్యటన సాగనుంది. ఈ మేరకు సమాచారం రావడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు సన్నాహాల్లో నిమగ్నమయ్యారు.