Nellore

News March 24, 2024

2 నుంచి ముత్యాలమ్మ జాతర

image

చిల్లకూరు మండలం తూర్పు కనుపూరులో ఏప్రిల్ 2 నుంచి శ్రీ ముత్యాలమ్మ జాతర జరగనుంది. మొదటి రోజు శ్రీపోలేరమ్మ నిలుపు అనంతరం ఉదయం 5 గంటలకు అమ్మవారికి దిష్టి తీసిన తర్వాత బంగారు చీరతో అలంకరిస్తారు. ఆ రోజు రాత్రి సింహవాహన సేవ జరుగుతుంది. 3న యార, గొల్లల ఉత్సవం 4న గురునాథ స్వామి గ్రామోత్సవం నిర్వహిస్తారు. 5 పోలేరమ్మను సాగనంపుతారు. లక్షల మంది భక్తుల రాక నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

News March 24, 2024

సర్వేపల్లిలో బావ.. కోవూరులో బావమరిది 

image

కోవూరు వైసీపీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బావబావమరుదులు. దివంగత నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మేనల్లుడు. మేనమామ వద్దే సోమిరెడ్డి రాజకీయ ఓనమాలు దిద్దారు. 2009 ఎన్నికల వరకు సోమిరెడ్డి, ప్రసన్న ఇద్దరూ టీడీపీలోనే కొనసాగారు. ఆ తర్వాత సోమిరెడ్డి టీడీపీలోనే కొనసాగుతుండగా, ప్రసన్న వైసీపీలో చేరిపోయారు.

News March 24, 2024

నెల్లూరు: సెలవైనా కరెంట్ బిల్లు కట్టవచ్చు

image

విద్యుత్ బిల్లులను ఆది, సోమవారాల్లో యథావిధిగా చెల్లించవచ్చని ఎస్పీడీసీఎల్ నెల్లూరు జిల్లా ఎస్ఈ విజయన్ ఒక ప్రకటనలో తెలిపారు. హోలీ సందర్భంగా సోమవారం సెలవైనప్పటికీ జిల్లాలోని అన్ని విద్యుత్ బిల్లుల వసూలు కేంద్రాలు యథాతథంగా పని చేయనున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News March 24, 2024

నెల్లూరులో మహిళ దారుణహత్య

image

నెల్లూరు అరవింద్ నగర్ లో లీలావతి అనే మహిళ ఏడాదిగా అద్దెకు ఉంటున్నారు. శనివారం ఆమె ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో పోలీసులు తలుపులు పగలగొట్టారు. లోపల రక్తపుమడుగులో లీలావతి మృతదేహం ఉంది. గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను హతమార్చి తాళం వేసి వెళ్లిపోయినట్లుగా గుర్తించారు. ఆమె ఆధార్ కార్డులో భర్త భాస్కర్ రెడ్డి, ట్రంకురోడ్డు, నెల్లూరు అని ఉంది. పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

News March 24, 2024

నెల్లూరు: గురుకులంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

image

గురుకుల పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వనిస్తున్నట్లు నెల్లూరు జిల్లా కన్వీనర్ జి.మురళీకృష్ణ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. గండిపాలెం(బాలురు), నెల్లూరు(బాలురు), ఆత్మకూరు(బాలికలు), తుమ్మలపెంట (బాలికలు) లో 5 వ తరగతి, 6,7,8 తరగతులలో మిగిలిన ఉన్న ఖాళీలభర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామన్నారు. ఈ నెల 31వ తేదీలోపు https://aprs.apcfss.in లో దరఖాస్తుచేసుకోవాలన్నారు.

News March 23, 2024

ప్రసన్నకు కౌంటర్ గా రేపు కోటంరెడ్డి సమావేశం

image

తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులపై కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి రెండు రోజులుగా విమర్శల వేడి పెంచారు. ఈ క్రమంలో ఆయనకు కౌంటర్ ఇచ్చేందుకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సన్నద్ధమయ్యారు. ఆదివారం ఉదయం 9 గంటలకు నెల్లూరులోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడనున్నారు.

News March 23, 2024

NLR: ఒకే చోట 9వ సారి MLAగా పోటీ

image

కోవూరులో వరుస విజయాలతో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలిచారు. 1993లో తొలిసారిగా ఆయన ఎన్నికల బరిలో దిగారు. తండ్రి నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మరణంతో జరిగిన ఉప ఎన్నికతో రాజకీయాల్లోకి వచ్చిన ప్రసన్న తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1994, 99 ఎన్నికల్లోనూ విజయాలు సాధించి హ్యాట్రిక్ కొట్టారు. ఆరంభం నుంచి ఒకే నియోజకవర్గంలో కొనసాగుతూ 9వ సారి పోటీ చేయబోతున్నారు.

News March 23, 2024

నెల్లూరు: వాలంటీర్‌పై కేసు నమోదు

image

నెల్లూరు జిల్లాలో ఓ వాలంటీర్‌పై కేసు నమోదైంది. కావలి మండలం ఆముదాల వలస వాలంటీర్ తాత ప్రవీణ్ ఓ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు ఎన్నికల నియమావళి నోడల్ అధికారి వెంకటేశ్వర్లు దృష్టికి వచ్చింది. విచారణ చేపట్టిన ఆయన వాలంటీర్‌పై కావలి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News March 23, 2024

నెల్లూరు: 18 ప్రాంతాల్లో పోలీస్ చెక్ పోస్టులు

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 18 చెక్ పోస్టులను పోలీసు అధికారులు ఏర్పాటు చేశారు. నగదు, మద్యంతో పాటు ఇతర వస్తువుల అక్రమ రవాణా జరగకుండా ఈ చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఆయా చెక్ పోస్టుల్లో తనిఖీల పర్వం ప్రారంభమైంది.

News March 23, 2024

నెల్లూరు: నిలిచిన ఈసీల మంజూరు

image

నెల్లూరు జిల్లాలోని ప్రధాన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంతో పాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ 8 రోజులుగా ఈసీలు మంజూరు కావడం లేదు. ఈసీ సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేసే క్రమంలో సర్టిఫికెట్లు ఇవ్వడం నిలిపివేశారు. ఈ మేరకు సంబంధింత అధికారులు శుక్రవారం వెల్లడించారు.

.