India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని ముందస్తు చర్యలు చేపట్టేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముందస్తు చర్యలపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
కావలికి చెందిన వెంకట కార్తీక్ గిన్నిస్ బుక్లో చోటు సంపాదించారు. హైదరాబాద్లో పలు వెబ్సిరీస్లకు దర్శకుడిగా కార్తీక్ పనిచేస్తున్నారు. చిన్నచిన్న సమస్యలకు ఆత్మహత్య చేసుకోవడం మంచిది కాదని, ప్రతిసమస్యకు పరిష్కారం ఉంటుందని చెబుతూ బైక్పై గతేడాది ఫిబ్రవరి 14 నుంచి అక్టోబర్ 6 వరకు దేశమంతా చుట్టేశారు. 1,40,300 కి.మీ. తిరిగి గిన్నిస్ బుక్లో చోటు సంపాదించారు. ఈ సందర్భంగా పలువురు అభినందించారు.
గత ఐదు రోజులుగా నెల్లూరు నగరంలో జరుగుతున్న బారాషాహిద్ దర్గా రొట్టెల పండగ ఆదివారంతో ముగిసింది. సెలవు దినం కావడంతో చివరి రోజు కూడా భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. వివిధ జిల్లాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 10 లక్షల మంది భక్తులు ఈసారి రొట్టెల పండుగకు విచ్చేశారు. గత ఏడాది కంటే ఈసారి వచ్చిన భక్తులకు ఎక్కడ అసౌకర్యం ఏర్పడకుండా అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున మౌలిక వసతులను ఏర్పాటు చేశారు.
ఇవాల్టి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన TDP, YCP MLAలు, MLCలు అమరావతికి చేరుకున్నారు. పసుపు షర్టులతో TDP MLAలు సభలోకి ప్రవేశించారు. మరోవైపు MLCలు కళ్యాణ్ చక్రవర్తి, మురళీధర్, చంద్రశేఖర్ రెడ్డి నల్ల కండువా ధరించి YCP అధినేత జగన్తో కలిసి రాష్ట్రంలోని హత్యలపై నిరసన తెలిపారు. తర్వాత అసెంబ్లీలోకి వెళ్లినా.. కాసేపటికే సభను వాకౌట్ చేసి బయటకు వచ్చారు.
బారాషాహీద్ దర్గాలో రొట్టెల పండుగకు సమర్థవంతంగా విధులు నిర్వహించిన సిబ్బందిని ఎస్పీ జి.కృష్ణకాంత్ అభినందించారు. 2వేల మంది పోలీసు సిబ్బంది 24 గంటలూ విధుల్లో ఉంటూ దర్గాకు విచ్చేసిన భక్తులు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేశారన్నారు. రద్దీలో తప్పిపోయిన 472 మంది చిన్నారులకు సురక్షితంగా వారి తల్లిదండ్రులకు అప్పగించామని చెప్పారు. క్రైమ్ పార్టీ పోలీసులు 17 మంది జేబు దొంగలను అదుపులోకి తీసుకున్నారన్నారు.
టీడీపీ సీనియర్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి నుంచి మూడో సారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ రోజు నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఆయన 20 ఏళ్ల తర్వాత అధ్యక్షా..అని పలకబోతున్నారు. 1994, 1999 ఎన్నికల్లో గెలిచిన ఆయన తిరిగి 2024 ఎన్నికల్లో విజయం సాధించారు. సర్వేపల్లి నుంచి మూడో సారి ఎమ్మెల్యేగా ఎన్నికైన నాయకుడు కూడా సోమిరెడ్డే.
ఉదయగిరి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు మధ్యలో ఆగిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఉదయగిరి నుంచి ఉదయం 5.30 గంటలకు నెల్లూరుకు బయల్దేరింది. వాసిలి – సంగం నడిరోడ్డుపై పెద్ద శబ్దంతో టైరు పంక్చరైంది. ప్రత్యామ్నాయంగా మరో బస్సు ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులకు నిరీక్షణ తప్పలేదు. ఉదయగిరి డిపోలో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లాతో పాటు కందుకూరు నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ఆరుగురు ఇవాళ నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో అధ్యక్షా..అనే పదం పలకబోతున్నారు. పొంగూరు నారాయణ, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, కాకర్ల సురేశ్, కావ్య కృష్ణారెడ్డి, నెలవల విజయశ్రీ, ఇంటూరి నాగేశ్వరరావు తొలిసారిగా ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. నారాయణ గతంలో MLCగా, మంత్రిగా వ్యవహరించినా ఎమ్మెల్యేగా తొలిసారి సభలో అడుగుపెడుతున్నారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లాతో పాటు కందుకూరు నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ఆరుగురు రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో అధ్యక్షా..అనే పదం పలకబోతున్నారు. పొంగూరు నారాయణ, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, కాకర్ల సురేశ్, కావ్య కృష్ణారెడ్డి, నెలవల విజయశ్రీ, ఇంటూరి నాగేశ్వరరావు తొలిసారిగా ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. నారాయణ గతంలో MLCగా, మంత్రిగా వ్యవహరించినా ఎమ్మెల్యేగా తొలిసారి సభలో అడుగుపెడుతున్నారు.
సిలిగాట్ నుంచి తాంబరం వెళ్తున్న నాగన్ ఎక్స్ప్రెస్ రైలులో ఒక్కసారిగా పొగలు వ్యాపించిన ఘటన కావలి సమీపంలో చోటుచేసుకుంది. రైల్లోని జనరల్ బోగీలో ఒక్కసారిగా పొగలు వ్యాపించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు రైలును నిలిపివేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం సంభవించకపోవడంతో రైల్వే అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
Sorry, no posts matched your criteria.