India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నెల్లూరు బారాషాహిద్ దర్గాలో రొట్టెల పండగ ప్రారంభమైంది. తొలి రోజు బుధవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. బారాషాహిద్లను దర్శించుకునేందుకు దేశవ్యాప్తంగా విచ్చేసిన భక్తులతో దర్గా పరిసరాలు జన సందడిగా మారిపోయాయి. ఈ ఏడాది సుమారు పది లక్షలు పైగా భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.
తడలో యువకుడిపై దాడి కలకలం రేపింది. తునికి చెందిన సతీశ్ కుమార్ శ్రీసిటీలో పనిచేస్తున్నాడు. కాకినాడకు చెందిన మోనికకు పదేళ్ల క్రితం రవీంద్రబాబుతో వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్తతో విడిపోయిన ఆమె తడకు వచ్చి 4 నెలలుగా సతీశ్తో సహజీవనం చేస్తోంది. సతీశ్ డ్యూటీకి వెళ్తుండగా ఒకరు ఇనుప రాడ్తో దాడి చేసి పారిపోయాడు. అతని ముఖ కవలికల ఆధారంగా రవీంద్రబాబునే దాడి చేశాడని మోనిక అనుమానిస్తోంది.
వాహన రద్దీని నియంత్రించేందుకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. • చెన్నై, బెంగళూరు, తిరుపతి నుంచి గూడూరు మీదుగా వచ్చే, పొదలకూరు రోడ్డు నుంచి వచ్చే బస్సులను అయ్యప్పగుడి సెంటర్ మీదుగా ఫ్లైఓవర్ బ్రిడ్జి, బీవీ నగర్, రామలింగాపురం, మార్కెట్ ఆర్టీసీకి మళ్లించారు. జొన్నవాడ వైపు నుంచి వచ్చే బస్సులను పుత్తా ఎస్టేట్, సెయింట్ జోసెఫ్ స్కూల్ మీదుగా మళ్లించారు. కేవీర్ పెట్రోల్ బంక్ నుంచి వెళ్లడానికి అనుమతి లేదు.
బెంగళూరు, చెన్నై వయా గూడూరు నుంచి వచ్చేవి జిల్లా ఆసుపత్రి ప్రాంగణం, సుబ్బారెడ్డి మైదానం దగ్గర నిలపాలి. కావలి వైపు వచ్చేవారు ఎస్వీజీఎస్ కళాశాల మైదానంలో కార్లు, ఆటోలు నిలపాలి. కడప నుంచి జొన్నవాడ మీది వాహనాలకు డీఎస్ఎన్ ఫంక్షన్ హాల్ పక్కన, ఇరుకళల పరమేశ్వరీ దేవస్థానం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలం కేటాయించారు. రాపూరు మీదుగా వచ్చేవి తెలుగుంగ కాలనీ, పొదలకూరు రోడ్డులోని జడ్పీ బాలికల పాఠశాలలో నిలపాలి.
రైతులకు 2024-25 పంట కాలానికి సంబంధించి పొగాకు విత్తనాలు సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నాయని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం నిర్వహణాధికారి రాజశేఖర్ తెలిపారు. సొంత నారుమడి పెట్టుకునే రైతులకు సీటీఆర్ రాజమండ్రి, కమర్షియల్ నారుమడి కోసం సీటీఆర్ కందుకూరులో పొగాకు విత్త నారను సరఫరా చేస్తామన్నారు. ఒక బ్యారన్ కు 500 గ్రాములు రూ.600 చొప్పున కమర్షియల్ నారుమడికి కిలో రూ.1,8000 విక్రయిస్తున్నట్లు తెలిపారు.
నెల్లూరు జిల్లా దగదర్తిలో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. దగదర్తితో పాటు ఏపీలోని మరో 3 ప్రాంతాల్లో చిన్నతరహా ఎయిర్పోర్ట్లు నిర్మించేందుకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI)కు సీఎం చంద్రబాబు తాజాగా ప్రతిపాదనలు పంపించారు. కాగా చిన్నతరహా ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం 1,800 ఎకరాల భూమి అవసరమవుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి AAI వర్గాలు సూచించాయి.
భర్త మృతితో మనస్తాపానికి గురై భార్య ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన వరికుంటపాడు(M), కనియంపాడులో మంగళవారం చోటుచేసుకుంది. ఇటివల కోడూరు బీచ్ జాన్ బాబు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన కొద్ది రోజులకే కర్ణాటకలోని KGFలో బంధువుల వద్ద ఉన్న జాన్ బాబు భార్య తన భర్త మృతితో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరు లేని సమయంలో హెయిర్ ఆయిల్ సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
డక్కిలిలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో ఇటీవల అనారోగ్యంతో సరీనా మృతి చెందిన విషయం తెలిసిందే. విధులు సక్రమంగా నిర్వహించలేదని ప్రిన్సిపల్ శ్రీదేవి , హౌస్ టీచర్ వాణి , ఆరోగ్య కార్యకర్త సునీతలను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గురుకుల పాఠశాల బాలిక మృతిపై ఉన్నతాధికారులు విచారణ జరిపి కలెక్టరుకు నివేదిక పంపడంతో కలెక్టర్ వారిపై చర్యలు తీసుకున్నారు.
నెల్లూరు జిల్లాలో జులై 17 నుంచి 21 వరకు రొట్టెల పండుగ జరగనుంది. హిందూ, ముస్లింలనే భేద భావం లేకుండా ఈ రొట్టెల పండుగను ఘనంగా జరుపుకుంటారు. దేశం నలుమూలల నుంచి ఇక్కడికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ఇక్కడ రొట్టె పట్టుకొంటె కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం.
నెల్లూరుకు చెందిన విద్యుత్తు శాఖ ఉద్యోగికి జైలుశిక్ష పడింది. కోటమిట్ట నెక్లెస్ రోడ్డు ప్రాంతానికి చెందిన సుధీర్ వద్ద విద్యుత్ సంస్థ ఉద్యోగి పత్తిపాటి కృష్ణ రూ.5 లక్షలు అప్పు తీసుకున్నారు . తిరిగి అప్పు చెల్లించేందుకు చెక్కు ఇచ్చాడు. దానిని సుధీర్ బ్యాంకులో వేయగా బౌన్స్ అయ్యింది. బాధితుడు కోర్టుగా వెళ్లగా.. కృష్ణకు ఏడాది జైలు విధిస్తూ ప్రత్యేక ఎక్సైజ్ కోర్టు జడ్జి సుయోధన్ తీర్పు ఇచ్చారు.
Sorry, no posts matched your criteria.