India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పదవ తరగతి అర్హతతో బీపీఎం/ఏబీపీఎం ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. నెల్లూరు డివిజన్లో 63, గూడూరు డివిజన్లో 53 పోస్టులను పోస్టల్ డిపార్ట్మెంట్ భర్తీ చేయనుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఎంపికైన వారికి బీపీఎం అయితే రూ.12 వేలు+అలవెన్సులు, ఏబీపీఎం అయితే రూ.10 వేలు+అలవెన్సులు జీతంగా ఇవ్వనున్నారు. పూర్తి వివరాలకు www.appost.gdsonline వెబ్సైట్ను సంప్రదించవచ్చు.
బారాషహీద్ దర్గా రొట్టెల పండుగకు విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను పక్కాగా చేపడుతున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. సోమవారం సాయంత్రం బారాషహీద్ దర్గా ప్రాంగణంలో రొట్టెల పండుగ ఏర్పాట్లను కలెక్టర్ ఆనంద్, జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పరిశీలించారు. దర్గా ప్రాంగణంలోని పోలీస్ కంట్రోల్ రూమ్, అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు.
పదవ తరగతి అర్హతతో బీపీఎం/ఏబీపీఎం ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. నెల్లూరు డివిజన్లో 63, గూడూరు డివిజన్లో 53 పోస్టులను పోస్టల్ డిపార్ట్మెంట్ భర్తీ చేయనుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఎంపికైన వారికి బీపీఎం అయితే రూ.12 వేలు+అలవెన్సులు, ఏబీపీఎం అయితే రూ.10 వేలు+అలవెన్సులు జీతంగా ఇవ్వనున్నారు. పూర్తి వివరాలకు www.appost.gdsonline వెబ్సైట్ను సంప్రదించవచ్చు.
నాయుడుపేట గురుకుల విద్యార్థుల అస్వస్థతపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ ఆరా తీశారు. ఆయన నేరుగా వైద్యులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి విద్యార్థులను పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా తక్షణ వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
డక్కిలి గురుకులంలో ఓ విద్యార్థిని మృతి చెందిన సంఘటన మరువక ముందే నాయుడుపేట గురుకుల పాఠశాలలో కూడా 70 మందికి పైగా డయేరియాతో ఆసుపత్రుల పాలయ్యారు. అపరిశుభ్ర వాతావరణం, పర్యవేక్షణ లేకపోవడం కారణాలుగా పేర్కొంటున్నప్పటికీ విద్యార్థులు తిన్న ఆహారం కూడా కలుషితం అయిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం కలెక్టర్, ఎమ్మెల్యే విద్యార్థులను, గురుకుల సిబ్బందిని విచారించారు.
నాయుడుపేట గురుకులం విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపల్ దాదాపీర్, వార్డెన్ విజయభాస్కర్ను కలెక్టర్ వెంకటేశ్వర్ సస్పెండ్ చేశారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు చికిత్స అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రకళపై మండిపడ్డారు. బాధ్యతాయుతమైన వృత్తిలో ఉండి చికిత్స అందించాల్సిన వైద్యులు అందుబాటులో లేకపోవడం ఏంటని ప్రశ్నించారు.
నాయుడుపేట పట్టణంలోని అంబేడ్కర్ బాలుర గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, సుళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ సోమవారం ఉదయం పరిశీలించారు. అస్వస్థతకు గురైన విద్యార్థులతో మాట్లాడారు. అక్కడ వంటశాలను పరిశీలించారు. గురుకులంలో పిల్లలకు అందిస్తున్న భోజన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పిల్లల ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే నెల్లూరు బారాషహీద్ దర్గా రొట్టెల పండగ ఈనెల 17న ప్రారంభం కానుంది. స్వర్ణాల చెరువులో పుణ్యస్నానాలు ఆచరించి కోర్కెల రొట్టెలను పట్టుకుని తింటున్నారు. బారాషహీదులకు గలేఫ్లు, పూల చద్దర్లను సమర్పిస్తున్నారు. 17 నుంచి రద్దీ ఉంటుందనే ఉద్దేశంతో ముందుగానే తెలంగాణ, KA, TN, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన భక్తులు చెరువు వద్దకు చేరుకోవడంతో ఘాట్, దర్గా ఆవరణం భక్తులతో సందడి నెలకొంది.
సోమశిల జలాశయాన్ని మంత్రులు ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ బందోబస్తులో ఉన్న అనంతసాగరం SI సూర్యప్రకాశ్ ప్రజాప్రతినిధులు, విలేకరుల వాహనాలను అడ్డుకోని దురుసుగా ప్రవర్తించడం తీవ్ర చర్చనీయాంశమైంది. మంత్రులు జలాశయంపై సమావేశం నిర్వహించడంతో MLA ఇంటూరు నాగేశ్వరరావు తన కారులో వెళ్తుండగా SI కారును ఆపారు. మంత్రి నిమ్మల కారును సైతం ఆపారు. ఎస్సై దురుసు ప్రవర్తనపై పలువురు అసహనం వ్యక్తం చేశారు.
నాయుడుపేట పట్టణంలోని ఎల్ ఏ సాగరం వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ బాలుర గురుకులంలో కలుషిత ఆహారం తిని ఆదివారం అర్ధరాత్రి 89 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గురుకులంలో అర్బన్ హెల్త్ క్లినిక్ వైద్యులు, విద్యార్థులకు వైద్య చికిత్సలు అందిస్తున్నారు. వాంతులు విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురైన 40 మంది విద్యార్థులను నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్సలు అందిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.