Nellore

News March 18, 2024

ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-1 పరీక్షలు: నెల్లూరు జేసీ

image

జిల్లా వ్యాప్తంగా గ్రూప్-1 పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ తెలిపారు. ఆదివారం ఉదయం గ్రూప్-1 పరీక్షా కేంద్రాలను ఏపీపీఎస్సీ సెక్షన్ అధికారులు ఆరోగ్య రాణి, సునీతతో కలిసి పరిశీలించారు. నెల్లూరు రూరల్ పరిధిలోని కనుపర్తిపాడు ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాలలో పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు.

News March 17, 2024

దువ్వూరు కాలువలో వ్యక్తి మృతదేహం లభ్యం

image

సంగం మండల కేంద్రంలోని వెంకయ్య స్వామి గుడి పక్కన ఉన్న దువ్వూరు కాలువలో ప్రమాదవశాత్తు జారిపడి ఓ వృద్దుడు మృతి చెందాడు. కాలువలో మృతదేహం ఉండటానికి గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసి పంచనామాకు తరలించారు. మృతుడు సంగంకి చెందిన సూరాయిపాలెం వెంకటేశ్వర్లుగా పోలీసులు గుర్తించి, కేసు నమోదు చేశారు. 

News March 17, 2024

NLR: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

image

నెల్లూరు జిల్లా సంగం మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బీరాపేరు సమీపంలో జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతిచెందారు. సమాచారం అందుకున్న ఎస్ఐ నాగార్జున రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 17, 2024

BREAKING: నెల్లూరులో తప్పిన ప్రమాదం

image

నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్‌లో ఆదివారం పెనుప్రమాదం తప్పింది. ప్లాట్ ఫాం-1పై హెటెన్షన్ వైర్ తెగిపడింది. దీంతో రైలు కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ఘటన సమయంలో పట్టాలపై రైలు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రైల్వే అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతులు చేశారు.

News March 17, 2024

ఎంపీ బరిలో గూడూరు ఎమ్మెల్యే

image

తిరుపతి ఎంపీ తాను పోటీలో ఉంటానని గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఆయనకు ఏ పార్టీ నుంచి స్పష్టమైన సంకేతాలు రాలేదు. అయినప్పటికీ స్వతంత్ర అభ్యర్థిగానైన పోటీలో ఉంటానని ఆయన తన అనుచరులకు చెబుతున్నారు. ఇప్పటికే ఆయన బీజేపీ, జనసేన నాయకులతో కలిసి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరారు.

News March 17, 2024

నెల్లూరు: ఆరుగురు ఇంజినీర్లు.. ఓ CA

image

నెల్లూరు జిల్లా అభ్యర్థుల్లో పలువురు ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేశారు. నేదురుమల్లి(వెంకటగిరి), సంజీవయ్య(సూళ్లూరుపేట), ఆదాల (నెల్లూరు రూరల్), రామిరెడ్డి(కావలి), కాకాణి(సర్వేపల్లి), విక్రం రెడ్డి(ఆత్మకూరు) ఇంజినీరింగ్ చదివారు. ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి ఛార్టెర్డ్ అకౌంటెంట్. ప్రసన్న(కోవూరు), రాజగోపాల్ రెడ్డి(ఉదయగిరి), మురళీధర్(గూడూరు) డిగ్రీ పూర్తి చేయగా, ఖలీల్(నెల్లూరు సిటీ) ఇంటర్ చదివారు.

News March 17, 2024

9వ సారి ప్రసన్న.. ఐదో సారి ఆదాల

image

నెల్లూరు జిల్లా వైసీపీ అభ్యర్థులు పలువురు సీనియర్లు ఉండగా.. మరికొందరు తొలిసారి పోటీ చేస్తున్నారు. కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి 9వ సారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి 5వ సారి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఉదయగిరిలో మేకపాటి రాజగోపాల్ రెడ్డి, నెల్లూరు సిటీలో ఖలీల్ అహ్మద్, గూడూరులో మురళీ తొలిసారి పోటీ చేస్తున్నారు.

News March 17, 2024

నెల్లూరు: ఎన్నికల ఫిర్యాదుల సహాయం కేంద్రం ఏర్పాటు

image

ఎన్నికల పక్రియ పై ఫిర్యాదు, సహాయం కొరకు టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణ తెలిపారు. 2024 ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని 8 అసెంబ్లీ 2 పార్లమెంటు స్థానాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో ఓటర్ల సౌకర్యార్థం కోసం హెల్ప్ లైన్ 1950 తోపాటు 0861- 2349402, 2349403, 2349404 ఫోన్ నెంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వారు తెలిపారు.

News March 16, 2024

NLR: తొలిసారి ఎమ్మెల్యేలుగా నలుగురి పోటీ

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నలుగురు వైసీపీ అభ్యర్థులు తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఉదయగిరి నుంచి మేకపాటి రాజగోపాల్ రెడ్డి, వెంకటగిరి నుంచి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, గూడూరు నుంచి మేరిగ మురళీధర్, నెల్లూరు నగరం నుంచి ఖలీల్ అహ్మద్ ఈ జాబితాలో ఉన్నారు. ఆదాల, రామిరెడ్డి నాలుగో సారి, కిలివేటి, కాకాణి మూడో సారి, మేకపాటి విక్రమ్ రెడ్డి రెండో సారి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు.

News March 16, 2024

కావలి: టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే

image

కావలి మాజీ శాసనసభ్యుడు వంటేరు వేణుగోపాల్ రెడ్డి టీడీపీలో చేరారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆయనకు కండువా వేసి ఆహ్వానం పలికారు. కార్యక్రమంలో ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు.