Nellore

News July 13, 2024

డక్కిలి గురుకుల పాఠశాల ఎదుట ఎమ్మార్పీఎస్ ఆందోళన

image

డక్కిలిలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల ఎదుట ఎంఆర్పిఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. గురుకుల పాఠశాలలో చదివే ఓ విద్యార్థిని చెన్నైలో చికిత్స పొందుతూ మృతి చెందింది. గురుకులంలో ఆ విద్యార్థిని అనారోగ్యం గురి కావడంతో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే మృతి చెందిందని, ఇందుకు గురుకుల సిబ్బంది కారణమని ఎమ్మార్పీఎస్ నాయకులు, మృతురాలి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు.

News July 13, 2024

కావలి: హైవేపై రోడ్డు ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్

image

కావలి పరిధిలోని నేషనల్ హైవే రోడ్డుపై శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఒంగోలు వైపు వెళ్లే రోడ్డులో గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కావలి రూరల్ సీఐ శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతి చెందిన వ్యక్తి భిక్షాటన చేసుకునే వ్యక్తిగా, రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

News July 13, 2024

నాయుడుపేటలో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం

image

నాయుడుపేటలో శుక్రవారం రాత్రి తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. స్వర్ణముఖి బ్రిడ్జ్ మీద వెంకటగిరి వైపు నుంచి వస్తున్న ఓ వాహనం ఎదురుగా వచ్చిన బైక్ ను తప్పించబోయి బ్రిడ్జ్ మీద నుంచి కిందకు పడబోయింది. డ్రైవర్ చాకచక్యంతో బ్రిడ్జ్ మీద ఉన్న స్తంభాలను ఢీకొనడంతో ప్రమాదం తప్పింది. ఘటనతో కొద్దిసేపు ట్రాఫిక్ ఏర్పడింది.

News July 13, 2024

NLR: చిన్నారిపై లైంగికదాడి.. నిందితుడికి పదేళ్ల శిక్ష

image

ఐదేళ్ల చిన్నారిపై లైంగికదాడి కేసులో బుచ్చిరెడ్డిపాళెం మండలం రాఘవరెడ్డి కాలనీకి చెందిన గంగపట్నం కుమార్ అనే వ్యక్తికి పదేళ్ల జైలు శిక్ష పడింది. రూ.25 వేల జరిమానా కూడా విధిస్తూ నెల్లూరు 8వ అదనపు జిల్లా కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. స్థానికంగా నివాసముంటున్న ఓ మహిళ పనికి వెళ్లే సమయంలో తన కుమార్తెను పక్కింట్లో వదిలి వెళ్లేది. ఈ నేపథ్యంలో 2017 జనవరి 22న కుమార్ చిన్నారిపై లైంగికదాడికి పాల్పడ్డాడు.

News July 12, 2024

రొట్టెల పండగకు సర్వం సిద్ధం: ఎమ్మెల్యే కోటంరెడ్డి

image

నెల్లూరులో 17నుంచి ఐదు రోజులపాటు జరిగే బారాషాహీద్ రొట్టెల పండుగకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. పండుగకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలని అన్ని శాఖల అధికారులను ఆయన ఆదేశించారు. ముస్లిం మత పెద్దలు, కమిటీ సభ్యుల సూచనలతో కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

News July 12, 2024

స్నేహితులే హంతకులు: నెల్లూరు DSP

image

కోవూరు రాళ్లమిట్టలో ఈ నెల 9న యువకుడి హత్య జరిగిన విషయం తెలిసిందే. ఘటనపై వివరాలను గురువారం డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి వెల్లడించారు. బాధితుడు నాగరాజు అతడి స్నేహితులు ఓ పందిని దొంగిలించిన ఘటనలో యజమాని రామకృష్ణతో గొడవడ్డారు. ఈ గొడవలో అనూహ్యంగా మరో స్నేహితుడు నాగరాజును పొడవడంతో అతడు చనిపోయాడు. ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేయగా.. మరికొందరు పరారీలో ఉన్నారని త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు.

News July 12, 2024

విజయవాడ సీసీగా బుచ్చి వాసి

image

విజయవాడ పోలీస్ కమిషనర్‌గా బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన ఎస్వీ రాజశేఖర బాబు నియమితులయ్యారు. ఆయన 1998లో గ్రూప్-1 అధికారిగా పోలీస్ శాఖలో ప్రవేశించి, 2006లో ఐపీఎస్‌గా ఎంపికయ్యారు. తిరుపతి, అనంతపురం, గుంటూరు ఎస్పీగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ పలు బాధ్యతలు నిర్వర్తించారు. ఐజీగా ఉద్యోగోన్నతి పొందిన తర్వాత పోలీసు నియామక బోర్డు ఛైర్మన్‌గా పోస్టింగ్ పొంది ఇప్పుడు విజయవాడకు సీపీ అయ్యారు.

News July 12, 2024

మూడో స్థానంలో నెల్లూరు..

image

ఆరోగ్య శ్రీ సేవల్లో నెల్లూరు మూడో స్థానంలో ఉన్నట్లు జిల్లా సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్. బి నాయక్ తెలిపారు. గతంలో పదో స్థానంలో ఉన్న జిల్లా ఏడు స్థానాలు మెురుగుపర్చుకున్నట్లు ఆయన తెలిపారు. పీజీ సీట్ల రాకతో ఈ ఘనత సాధ్యమైపట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం రోజుకు 1238 ఓపీలు వస్తున్నాయని, 626 మంది ఇన్ పేషంట్లుగా ఉన్నట్లు ఆయన తెలిపారు.

News July 11, 2024

రొట్టెల పండగ కమిటీ కార్యదర్శిగా మునీర్

image

నెల్లూరు బారాషాహీద్ దర్గా రొట్టెల పండగ ఫెస్టివల్ కమిటీ కార్యదర్శిగా షేక్ మునీర్‌ను ఎంపిక చేశారు. ఈ మేరకు వక్ఫ్ బోర్డు నుంచి అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. గత 17 ఏళ్లుగా ఆయన రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన సేవలను గుర్తించి ఈ ఏడాది రొట్టెల పండగ కమిటీ కార్యదర్శిగా నియమించారు.

News July 11, 2024

నెల్లూరులో జనసేన కార్యాలయం ప్రారంభం

image

నెల్లూరు నగరంలోని గోమతి నగర్‌లో జనసేన జిల్లా పార్టీ ఆపీసు ఏర్పాటు చేశారు. దీనిని పూజా కార్యక్రమాలతో గురువారం ప్రారంభించారు. జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ మాట్లాడుతూ.. ఎవరికి అన్యాయం జరిగినా తమ పార్టీ కార్యాలయం తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని చెప్పారు. జనసేన పార్టీ పేద ప్రజల బాధలు తెలుసుకుని వారికి సహాయం చేసేందుకు ముందుంటుందని తెలిపారు.