Nellore

News March 16, 2024

తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో ఖలీల్

image

నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ మొదటి సారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఆయనను నెల్లూరు సిటీ అభ్యర్థిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. నెల్లూరు నగరంలోని అతి సామాన్య కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఖలీల్ అహ్మద్ అనూహ్య పరిణామాల మధ్య ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపికయ్యారు. ఇప్పటికే నెల్లూరులో ఖలీల్ అహ్మద్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.