Nellore

News July 10, 2024

నెల్లూరు: దివ్యాంగురాలిపై అత్యాచారం.. యువకుడు అరెస్ట్

image

రాపూరుకు చెందిన ఓ మానసిక దివ్యాంగురాలిపై అదే కాలనీకి చెందిన ప్రేమ్ కుమార్ (25) అనే యువకుడు ఎవరూ లేని సమయంలో అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటనపై బాధితురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై మాల్యాద్రి కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి విచారిస్తున్నారు. కాలనీవాసులు మాట్లాడుతూ.. ఆ ఓ మానసిక దివ్యాంగురాలికి అమ్మానాన్న ఎవరూ లేరని, ఉన్న ఒక అన్న కూడా వికలాంగుడేనన్నారు.

News July 10, 2024

టీటీడీ ఛైర్మన్ పదవి రేసులో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి?

image

టీటీడీ నూతన ఛైర్మన్ ఎవరన్నది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ పదవి కోసం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కూడా రేసులో ఉన్నట్లు సమాచారం. జిల్లాలో పార్టీ గెలుపు కోసం చాలా కష్టపడ్డామని తమకు ఛైర్మన్ పదవి ఇవ్వాలని ఆమె కోరుతున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. గతంలో టీటీడీ ఢిల్లీ అడ్వైజరీ బోర్డు ఛైర్‌పర్సన్‌గా, పాలక మండలిలో సభ్యురాలిగా పని చేసిన అనుభవం ఉండటంతో ఆ పదవిని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.

News July 10, 2024

నెల్లూరు: ఇన్‌స్టాలో పరిచయంతో అదృశ్యం.. ఎస్సై చొరవతో ఇంటికి

image

అదృశ్యమైన ఇద్దరు బాలికలు ఎస్సై నాగార్జున రెడ్డి చొరవతో సురక్షితంగా ఇళ్లకు చేరారు. పొదలకూరు మండలానికి చెందిన బాలికలు పాఠశాలకు వెళ్తున్నామంటూ సంగం చేరుకున్నారు. ఆ తర్వాత ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరికి ఇన్‌స్టాలో పరిచయమైన శివప్రసాద్ అనే కడప జిల్లా వ్యక్తి మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు. ఓ బాలిక ఇంట్లో లభించిన ఫోన్ నంబర్ ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు.

News July 10, 2024

రాపూరులో దారుణం.. దివ్యాంగురాలిపై అత్యాచారం

image

నెల్లూరు జిల్లా రాపూరులో దారుణం జరిగింది. మతిస్థిమితం సరిగా లేని దివ్యాంగురాలిపై ప్రేమకుమార్ (25) అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రాపూరు ఎస్ఐ మాల్యాద్రి పేర్కొన్నారు. నిందితుడు పరారిలో ఉండటంతో ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

News July 10, 2024

నెల్లూరు జైలులో పిన్నెల్లికి 65 ప్రశ్నలు

image

సీఐపై దాడి కేసులో అరెస్టై నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళవారం రెండోరోజు విచారించారు. కారంపూడి దాడిపై పోలీసులు 65 ప్రశ్నలు సంధించగా పిన్నెల్లి పొంతనలేని సమాధానాలు చెప్పిట్లు సమాచారం. పోలింగ్ తర్వాత రోజు ఇంటి నుంచి బయటకి వెళ్లలేదు. కారంపూడి ఎలా వెళ్తా? సీఐపై దాడి ఎలా చేస్తా? ఆ ఘటనతో తనకు సంబంధం లేదంటూ బదులిచ్చినట్లు తెలుస్తోంది.

News July 10, 2024

నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ బదిలీ

image

నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ వికాస్ మర్మత్‌ను బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల కార్పొరేషన్‌లో కమిషనర్ సంతకాలను కొందరు ఫోర్జరీ చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. దీనిపై విచారణ కొనసాగుతున్న సమయంలోనే ఆయనను బదిలీ చేశారు. కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఆయనను నియమించారు.

News July 10, 2024

రొట్టెల పండగ ఏర్పాట్లను పరిశీలించిన ఖాదర్ బాషా

image

నెల్లూరు బారాషాహీద్ దర్గా రొట్టెల పండగ ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో దర్గా ప్రాంగణంలో జరుగుతున్న పనులను బారాషహీద్ దర్గా ఫెస్టివల్ కమిటీ ఛైర్మన్ షేక్ ఖాదర్ బాషా, సయ్యద్ సమీ, సాబీర్ ఖాన్ తదితర నేతలు మంగళవారం పరిశీలించారు. రొట్టెల పండగకు సుమారు పది లక్షల పైగా భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో వారికి మౌలిక వసతులు కల్పించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

News July 10, 2024

వెంకటగిరిలో వందేళ్ల చరిత్ర ఉన్న పీర్ల చావిడి

image

వెంకటగిరి పట్టణం ఫీర్జాతిపేటలో సుమారు వందేళ్ల చరిత్ర ఉన్న హజరత్ హట్లే సాహెబ్ పీర్ల చావిడి ఉంది. ఇది శిథిలావస్థలోకి చేరడంతో గతేడాది తొలగించి హిందూ, ముస్లిం పెద్దల సహకారంతో పునర్నిర్మించారు. ఇటీవల ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ.. గతంలో ఈ పీర్ల చావిడిలో ఉన్న పీర్లకు వెంకటగిరి రాజా కుటంబీకులు ఫాతిహా అందించే వారని చెప్పారు.

News July 9, 2024

నెల్లూరు: కరెంట్ షాక్‌తో ఒకరు మృతి

image

నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ఊటుకూరు గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామసమీపంలోని జొన్నవాడ దశయ్య రొయ్యల గుంటల వద్ద గుర్తుతెలియని వ్యక్తి కరెంట్ షాక్‌తో మంగళవారం చనిపోయాడు. అతను రొయ్యల దొంగతనానికి వచ్చినట్లుగా స్థానికులు అనుమానిస్తున్నారు. విడవలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News July 9, 2024

నెల్లూరు: యువకుడు దారుణహత్య

image

కోవూరులోని రాళ్లమిట్ట ప్రాంతంలో మంగళవారం జరిగిన ఇరువర్గాల ఘర్షణలో నాగరాజు అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం.. వారధిసెంటర్‌కు చెందిన యువకులకు, రాళ్లమిట్టకు చెందిన యువకులకు పాతకక్షలు ఉన్నాయి. ఈక్రమంలో వారధిసెంటర్‌కు చెందిన నాగరాజు రాళ్లమిట్టకు రావడంతో ఇక్కడ యువకులు దాడి చేసి కత్తితో పొడిచి హత్య చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.