India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన వేదాయపాళెం రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం జరిగింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన రైల్వే పోలీసులు మృతుడి వయసు సుమారు 55 ఏళ్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
ఉద్యోగం కోసం వెళ్తున్న వ్యక్తి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. గూడూరు బాలాజీనగర్కు చెందిన సురేశ్కుమార్(44) ఓ కళాశాలలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ నిలిచిపోయాడు. ఈక్రమంలో ఉద్యోగం కోసం మిత్రుడు ప్రశాంత్తో కలిసి నెల్లూరుకి స్కూటీపై బయల్దేరారు. బెంగళూరు నుంచి కందుకూరు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కొమ్మలపూడి వద్ద హైవేపై ఢీకొట్టడంతో సురేశ్ అక్కడికక్కడే మృతి చెందగా ప్రశాంత్కు గాయాలయ్యాయి.
నెల్లూరు జిల్లాకు చెందిన SC, ST, BC కులాలకు చెందిన DSC అభ్యర్థులకు నెల్లూరులోని BC స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వనున్నారని ఆ శాఖ అధికారి వెంకటయ్య తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 10తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని, శిక్షణ కాలంలో రూ.3 వేలు స్టైపెండ్, స్టడీ మెటీరియల్ అందజేస్తారన్నారు. వివరాలకు నగరంలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలోని బీసీ స్టడీ సర్కిల్లో సంప్రదించాలని అన్నారు.
బుచ్చిరెడ్డిపాలెం మండలం సల్మాన్ పురం గ్రామం సమీపంలో కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకుపోయింది. అయితే కారులో ప్రయాణిస్తున్న వారికి ఎటువంటి ప్రాణాపాయం జరగలేదని స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలల గడుస్తున్న అటవీశాఖ అధికారులలో మాత్రం జగనన్న ప్రభుత్వం మీద అమితమైన ప్రేమ అలాగే ఉంది. ఉదయగిరి మండలం బండగానిపల్లె కూడలి వద్ద అటవీశాఖ ఉదయగిరి రేంజ్ అధికారులు ఏర్పాటు చేసిన ‘అడవికి నిప్పు మనుగడకు ముప్పు’ అనే ఫ్లెక్సీలు జగనన్న ఫోటోతో దర్శనమివ్వడంతో అధికారుల తీరును పలువురు విమర్శిస్తున్నారు.
అనంతసాగరం మండల వ్యాప్తంగా ఆదివారం మధ్యాహ్నం వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆకాశంలో నల్లటి మేఘాలు అలుముకున్నాయి. సోమశిల, ఉప్పలపాడు, చిలకలమర్రి, లింగంగుంట, గోవిందంపల్లి, ముస్తాపురం, పాతాళపల్లి తదితర గ్రామాలలో గాలితో కూడిన తేలికపాటి వర్షం కురుస్తోంది. దీంతో చిరు వ్యాపారులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పలు గ్రామాలలో విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది.
కొమ్మలపూడి క్రాస్ రోడ్డు సమీపంలోని జాతీయ రహదారిపై ఓ బస్సు ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందాడు. గూడూరు బాలాజీ నగర్కు చెందిన మనుబోలు సురేశ్ రెడ్డి ఉద్యోగం కోసం తన స్నేహితుడు పి.ప్రశాంత్తో కలిసి కృష్ణ పట్నం పోర్టుకు ఆదివారం బైక్ పై బయలుదేరాడు. కొమ్మలపూడి క్రాస్ రోడ్డు వద్ద బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మనుబోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రైలులో నుంచి జారిపడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన వేదాయపాళెం రైల్వే స్టేషన్లో శనివారం రాత్రి జరిగింది. గాంధీనగర్లో నివాసముంటున్న నసీర్ నాయుడుపేటలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం సాయంత్రం నాయుడుపేట నుంచి హైదరాబాద్ ఎక్స్ ప్రెస్లో నెల్లూరుకు బయలుదేరాడు. వేదాయపాళెం రైల్వేస్టేషన్లో ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడడంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు.
నిత్యం పూజ విధానంతో మనుషులు ధర్మం వైపు నడుస్తారని బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. నాయుడుపేట పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో శనివారం సాయంత్రం జరిగిన నిత్య పూజా విధానం కార్యక్రమంలో పాల్గొని ప్రవచనం చేశారు. మనిషి దేవుడు పట్ల ఎప్పుడు కృతజ్ఞతలు ఉండాలని సూచించారు. భగవంతుడు సృష్టించిన పంచేంద్రియాలను సక్రమంగా వినియోగించుకొని ధర్మం వైపు నడవాలని అన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయాన్ని 13వ తేదీన ముగ్గురు మంత్రులు సందర్శించనున్నారు. నెల్లూరులోని సంతపేటలో గల ఆనం నివాసంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ భేటీ అయ్యారు. రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి మంత్రులు ఆనం, నారాయణ విచ్చేయనున్నారు. ప్రాజెక్టు వద్ద దెబ్బతిన్న ప్రాంతాలను, సోమేశ్వర ఆలయాన్ని సందర్శిస్తామని మంత్రి నారాయణ తెలిపారు.
Sorry, no posts matched your criteria.