India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డితో మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరం సంతపేటలోని ఆనం నివాసంలో మంత్రిని పొంగూరు నారాయణ మర్యాద పూర్వకంగా కలిశారు. మంత్రి ఆనంకు నారాయణ పుష్పగుచ్ఛం అందచేసి శాలువాతో సత్కరించారు. ప్రస్తుత తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించుకున్నట్లు సమాచారం.
జాతీయ ఉపాధ్యాయ అవార్డులకు.. అర్హులైన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నెల్లూరు డీఈఓ రామారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. nationalawards toteachers. education. gov. in వెబ్సైట్లో ఈ నెల 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అర్హతలు, ఇతర వివరాల కోసం వెబ్సైట్ను సంప్రదించాలని డీఈవో సూచించారు.
అనంతసాగరం మండలం, చిలకలమర్రి గ్రామానికి చెందిన డబ్బుకుంట శీనయ్య అనే కౌలు రైతు పాముకాటుతో మృతి చెందినట్లు ఎస్సై సుబ్బారావు తెలిపారు. బుధవారం రాత్రి నీళ్లు వదిలేందుకు పొలానికి వెళ్ళగా పాము కాటు వేసింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆత్మకూరు వైద్యశాలకు తీసుకువెళ్లారు. మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
నెల్లూరు జిల్లాలో మొదటిసారి పెద్దపులి కదలికలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. మర్రిపాడు మండలం వెలుగొండ అడవుల్లో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో పెద్దపులి, చిరుతపులి సంచారం కనిపించినట్లు అటవీ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. అడవుల్లోకి ఒంటరిగా వెళ్లవద్దని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శుక్రవారం నెల్లూరులోని తన క్యాంప్ కార్యాలయంలో అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశమవుతారు. అనంతరం ప్రజల నుంచి వినతి పత్రాలు, విజ్ఞాపనలు స్వీకరిస్తారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కార్యాలయ ప్రతినిధులు ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
నెల్లూరు రూరల్ రామకోటయ్య నగర్లో దారుణం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు నీతురాజ్ (23) అనే వ్యక్తిని గొంతు కోసి నడి రోడ్డుపైనే వదిలేసి పారిపోయారు. దీంతో నీతూరాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్యకు గురైన వ్యక్తి రామకోటయ్య నగర్ సుజాత రావు కాంప్లెక్స్ కు చెందిన వ్యక్తిగా నిర్ధారించారు. హత్యకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రకాశం జిల్లా కనిగిరి వద్ద జాతీయ రహదారిపై కారు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో వరికుంటపాడు మండల విద్యా శాఖా ధికారి షావుద్దీన్ కి తీవ్ర గాయలయ్యాయి. గాయపడిన ఎంఈఓను వేరే వాహనంలో ఆసుపత్రి తరలించారు. విధులు నిర్వహించుకొని తిరిగి కనిగిరిలోనే తన నివాసానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు.
నెల్లూరు జిల్లా కలెక్టర్గా ఓ.ఆనంద్ గురువారం కలెక్టరేట్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు సబ్ కలెక్టర్ విద్యాధరి, జాయింట్ కలెక్టర్ సేదు మాధవన్, ఇన్ఛార్జ్ డీఆర్ఓ పద్మావతి స్వాగతం పలికారు. అనంతరం ఆయన అల్లూరు సీతారామ రాజు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఇటీవల వెలుగొండ అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కెమెరాలలో రెండు పులులను గుర్తించినట్లు జిల్లా అటవీశాఖ అధికారి ఆవుల చంద్రశేఖర్ తెలిపారు. ఈ పులులు నల్లమల అటవీ ప్రాంతం నుంచి వెలుగొండ అటవీ ప్రాంతాలకు వచ్చినట్లు గుర్తించారు. పులుల సంచారంతో పొంచి ఉన్న ప్రమాదకర పరిస్థితుల దృష్యా పశువులు, మేకలు, గొర్రెల కాపరులు అడవిలో వెళ్లద్దన్నారు.
ఏఎస్ పేట మండలం, జమ్మవరం గ్రామానికి చెందిన వెంకట్రావు (36) మంగళవారం నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు ఆయన బంధువులు తెలిపారు. వెంకట్రావు మంగళవారం మరో ఇద్దరితో కలిసి బైక్పై వెళుతుండగా మర్రిగూడ మండలం, తమ్మిడిపల్లి గ్రామం వద్ద బైక్ అదుపు తప్పి సమాధిని ఢీకొంది. ఘటనలో బాలరాజు అక్కడికక్కడే మృతి చెందగా, వెంకట్రావు చికిత్స పొందుతూ మృతి చెందాడు. కృష్ణకు తీవ్ర గాయాలు అయ్యాయి.
Sorry, no posts matched your criteria.