India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాకు ఇటీవల నూతంగా నియమితులైన కొత్త కలెక్టర్ ఒ.ఆనంద్ నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ క్రమంలో జిల్లాలో పరిశ్రమల ఏర్పాటులో వేగం పుంజుకోన్నట్లు పలువురు ఆశాభావం వ్యక్తం చేశారు. రాయపట్నం పోర్ట్, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్, ఉక్కర్ష అల్యూమినియం ధాతు నిగమ్ లిమిటెడ్ పరిశ్రమల పనుల్లో వేగం పెరగనున్నట్లు పలువురు ఆశిస్తున్నారు.
మాజీ సీఎం జగన్ నేడు నెల్లూరుకు రానున్నారు. తాడేపల్లి నుంచి బయలుదేరి ఉ.11.15 గంటలకు కనుపర్తిపాడు జడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకుంటారన్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ములాఖత్ అవుతారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కనుపర్తిపాడుకు చేరుకొని హెలికాప్టర్ ద్వారా తాడేపల్లికి బయలుదేరుతారు.
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ నియమితులైన ఓ. ఆనంద్ బుధవారం విజయవాడ నుంచి నెల్లూరు చేరుకున్నారు. ఆయనకు చింతారెడ్డి పాలెం హైవే వద్ద నెల్లూరు రూరల్ తహసీల్దార్ సుబ్బారెడ్డి పుష్ప గుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కి చేరుకున్నారు. గురువారం కలెక్టర్ బాధ్యతలు చేపట్టనున్నారు.
కావలి పట్టణంలోని ఓ డాబా హోటల్ లో బుధవారం అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో హోటల్లో అపరిశుభ్ర వాతావరణం, తదితర తప్పిదాలను అధికారులు గుర్తించారు. రోజుల తరబడి మాంసం నిల్వ ఉండటంతో వెంటనే హోటల్ను సీజ్ చేసి గేట్లకు సీల్ వేశారు. వారు మాట్లాడుతూ.. హోటల్స్లో నాణ్యమైన ఆహారం, పరిశుభ్రత పాటించాలని లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గురువారం నెల్లూరు సెంట్రల్ జైలును సందర్శించనున్నారు. ముందుగా నెల్లూరు పోలీసు పరేడ్ గ్రౌండ్లో హెలిప్యాడ్ లాండ్ అవ్వనుండగా దానికి బదులు కనుపర్తి పాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో గ్రౌండ్లో లాండ్ అవుతున్నట్లు అధికారులు తెలిపారు. తాడేపల్లి నుంచి ఉదయం 11 గంటలకు బయలుదేరి నెల్లూరు చేరుకోనున్నారు.
నెల్లూరు నూతన కలెక్టర్గా ఓ.ఆనంద్ నియమితులయ్యారు. తిరువనంతపురంలో ఆయన ఇంజినీరింగ్ పూర్తి చేశారు. 2016లో IASకు ఎంపికయ్యారు. తూ.గో జిల్లాలో ట్రైనీ కలెక్టర్గా పనిచేశారు. 2018లో గూడూరు సబ్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలోనే ఆయనకు వివాహమైంది. తర్వాత పోలవరం ప్రాజెక్ట్ స్పెషల్ ఆఫీసర్గా, ITDO పీవోగా, మన్యం జిల్లా జేసీగా పని చేశారు. ఆయన భార్య ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవించడం విశేషం.
నెల్లూరు జిల్లాలో బడి బయట పిల్లలను గుర్తించేందుకు గతనెల 13వ తేదీన ‘నేను బడికి పోతా’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనిని ఈనెల 12వ తేదీ వరకు నిర్వహిస్తామని సమగ్ర శిక్ష ఏపీసీ ఉషారాణి తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. విద్య ప్రాముఖ్యతను తల్లిదండ్రులకు తెలియజేసి వారి పిల్లలను బడిలో చేర్పించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
నెల్లూరు మెడికల్ కాలేజీలో డాక్టర్ జ్యోతి(38) <<13549146>>ఆత్మహత్య <<>>కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. సీఐ ఆల్తాఫ్ హుస్సేన్ వివరాల మేరకు.. నల్గొండకు చెందిన ఆమెకు నెల్లూరుకు చెందిన రవితో 2014లో వివాహమైంది. 2018 నుంచి ఆమె మరొకరితో సన్నిహితంగా ఉంటోంది. 3 నెలల నుంచి అతను జ్యోతిని దూరం పెట్టాడు. మానసిక ఒత్తిడిలో ఉన్న ఆమె.. సోమవారం మధ్యాహ్నం అతడి కాల్ వచ్చిన తర్వాతే బిల్డింగ్ పైనుంచి దూకి సూసైడ్ చేసుకుంది.
నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న మాచర్ల మాజీ MLA పిన్నెల్లిని పరామర్శించడానికి జగన్ రానున్న విషయం తెలిసిందే. ఆయన పర్యటన షెడ్యూల్ను మాజీ మంత్రి కాకాణి వెల్లడించారు. ఉదయం 9.40 గంటలకు జగన్ తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయల్దేరుతారు. 10.30 గంటలకు నెల్లూరు పోలీసు పరేడ్ మైదానానికి చేరుకుంటారు. రోడ్డు మార్గాన జైలుకు వెళ్లి.. తిరిగి 12 గంటలకు పోలీసు పరేడ్ మైదానానికి చేరుకుని తాడేపల్లికి వెళ్తారు.
బస్సులోనే మత్తు పెట్టి భారీగా నగదు చోరీ చేసిన ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. విజయవాడ నుంచి ఇద్దరు వ్యాపారులు రూ.80 లక్షలతో బెంగళూరుకు బయల్దేరారు. కావలి సమీపంలోని మద్దూరుపాడు దాబా వద్ద భోజనానికి ఆపారు. ఇందులో ఒకరు దాబాలో తిని మరొకరికి పార్శిల్ తీసుకు రావడానికి వెళ్లారు. బస్సులో ఉన్న దొంగలు అతడికి మత్తు పెట్టి అతని వద్ద ఉన్న రూ.80 లక్షల డబ్బు సంచి తీసుకుని రోడ్డు దాటుకుని మరొక వాహనంలో పరారయ్యారు.
Sorry, no posts matched your criteria.