India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీకి మరో షాక్ తగిలింది. సూళ్లూరుపేట శ్రీచెంగాల పరమేశ్వరి ఆలయ మాజీ ఛైర్మన్ దువ్వూరు బాల చంద్రారెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. తన రిజైన్ లెటర్ను వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి పంపించారు. వ్యక్తిగత కారణాలతో పార్టీని వీడుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల ముందు వరకు సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
నెల్లూరు జిల్లా విక్రమ సింహపురి యూనివర్సిటీ వీసీ సుందరవల్లి ఎట్టకేలకు రాజీనామా చేశారు. ప్రభుత్వం మారడంతో పలు యూనివర్సిటీల వీసీలు తప్పుకున్నా.. రాజీనామాకు ఆమె ససేమిరా అన్నారు. ఆమె రిజైన్ కోసం విద్యార్థి సంఘాల నాయకులు పట్టుబట్టారు. ఈక్రమంలో శనివారం రాజీనామా చేశారు. మాజీ సీఎం జగన్కు సుందరవల్లి సమీప బంధువు. యూనివర్సిటీ పరిపాలన భవనానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టడంపై అప్పట్లో విమర్శలు వచ్చాయి.
నెల్లూరు జిల్లాలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని జడ్పీ ఛైర్పర్సన్ఆ నం అరుణమ్మ అధికారులను ఆదేశించారు. నెల్లూరు జడ్పీ ఆఫీసులో స్థాయీ సంఘ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణమ్మ మాట్లాడుతూ.. తాగునీటి పథకాలకు సంబంధించి గుత్తేదారులకు వెంటనే బిల్లులు చెల్లించాలన్నారు.
నెల్లూరులో టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని బీజేపీ నాయకులు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ విగ్రహాన్ని నెల్లూరులో పెట్టనివ్వబోమన్నారు. ఈ మేరకు నాయకులు కలెక్టర్ కార్యాలయంలో డీఆర్వో లవన్నను కలిశారు. విగ్రహ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వవద్దని కోరారు. హిందువుల మాన ప్రాణాలు తీసిన దుర్మార్గుడు టిప్పు సుల్తాన్ అన్నారు. నమామి గంగే నేత మిడతల రమేశ్ తదితరులు ఉన్నారు.
బాలికపై లైంగిక దాడి చేసిన ఘటనలో నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్ష, రూ.5వేలు జరిమానా పడింది. ప్రత్యేక పోక్సో జిల్లా రోర్టు న్యాయమూర్తి సిరిపిరెడ్డి సుమ శుక్రవారం తీర్పు చెప్పారు. గూడూరులోని చవటపాలేనికి చెందిన వీరయ్య 2015లో బాలికకు మిఠాయి ఆశ చూపి లైంగిక దాడికి పాల్పడ్డాడు. పాప అమ్మమ్మ ఫిర్యాదుతో పోలీసులు వ్యక్తిని అరెస్ట్ చేశారు. నేరం రుజువు కావడంతో శిక్ష విధించారు.
మేనత్త అంత్యక్రియల్లో మేనల్లుడు మృతి చెందిన విషాద ఘటన ఆత్మకూరులో జరిగింది. సయ్యద్ ముంతాజ్ అనారోగ్యంతో మృతి చెందగా ఆమెను శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. మృతురాలి మేనల్లుడు నీటి కోసం వెళ్లి ట్యాంకు ఎక్కాడు. దిగే క్రమంలో గోడ కూలి కిందపడి గాయాలపాలయ్యాడు. నెల్లూరు అపోలోలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.మృతుడు ఐటీఐ కాలేజీలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు.
నెల్లూరు జిల్లాకు చెందిన ఓ యువకుడిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. యువకుడికి రాంగ్ కాల్ ద్వారా ఆ రాష్ట్రంలోని తాండూరుకు చెందిన బాలికతో అతను కనెక్ట్ అయ్యాడు. అలాగే అసభ్యకరంగా చాటింగ్ చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో అక్కడి ఎస్ఐ విఠల్ రెడ్డి రంగంలోకి దిగి… యువకుడిని అరెస్ట్ చేసి పోక్సో కేసు నమోదు చేశారు.
నెల్లూరులోని ఈవీఎంల గోదాములను కలెక్టర్ ఎం.హరి నారాయణన్ పరిశీలించారు. ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలోని ఈవీఎంల గోడౌన్ను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేశారు. ఇటీవల ఎన్నికలకు ఉపయోగించిన వీవీ ప్యాట్ మెషిన్లలో మిగిలిన పేపర్ రోల్స్ తొలగించారు. అనంతరం వీవీ ప్యాట్లను యథావిధిగా భద్రపరిచే ప్రక్రియను రెవిన్యూ అధికారులు చేపట్టారు.
మాచర్ల మాజీ MLA పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనను వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కలిశారు. పిన్నెల్లిపై అనేక కేసులు బనాయించి జైలులో పెట్టడం హేయమైన చర్యని కాకాణి అన్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా, అండగా నిలిచి సంఘటితంగా పోరాడుతామని ఆయన చెప్పారు.
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కల్కి థియేటర్ల వద్ద సందడి కనిపిస్తోంది. విజువలైజేషన్ అద్భుతంగా ఉండటంతో సినిమా చూడటానికి పలువురు ఆసక్తి చూపుతున్నారు. ఈక్రమంలో తొలిరోజు మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఒక్క నెల్లూరు జిల్లాలోనే దాదాపు 1.7 కోట్లు రాబట్టిందని సమాచారం. దీంతో ప్రభాస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.