India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నెల్లూరు రూరల్ పరిధిలోని ఒకటో డివిజన్ కార్పొరేటర్ జానా నాగరాజ గౌడ్, రెండో డివిజన్ కార్పొరేటర్ రామ్మోహన్ యాదవ్ సోమవారం రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు, వారందరికీ ఎమ్మెల్యే టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు, ఈ కార్యక్రమంలో రూరల్ టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు

నెల్లూరు జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరగనున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించట్లేదని కలెక్టర్ ఆనంద్ ఒక ప్రకటన విడుదల చేశారు. మీలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా సోమవారం అర్జీలు స్వీకరించలేమని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రజలు, అర్జీదారులు గమనించవలసినదిగా ఆయన కోరారు. వచ్చే సోమవారం యధావిధిగా కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు.

మనుబోలు బీసీ కాలనీలో వినాయక ఉత్సవంలో ఇవాళ సాయంత్రం అపశ్రుతి చోటు చేసుకుంది. ఉత్సవం కోసం తెచ్చిన తారాజువ్వలపై నిప్పు రవ్వలు పడిన ఘటనలో సుమారు 30 మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను గూడూరు ప్రభుత్వ వైద్యాశాలకు తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

వినాయక నిమజ్జనం కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. గూడూరు మండలం చెన్నూరు గిరిజన కాలనీ వాసులు వినాయక విగ్రహాన్ని తూపిలిపాళెం సముద్రంలో నిమర్జనం చేసి తిరిగివస్తుండగా, వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ చిల్లకూరు మండలం కడివేడు సమీపంలో అదుపుతప్పి బోల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలు కాగా, క్షతగాత్రులను గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

నెల్లూరు జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో జరగనున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించట్లేదని కలెక్టర్ ఆనంద్ ఒక ప్రకటన విడుదల చేశారు. మీలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా సోమవారం అర్జీలు స్వీకరించలేమని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రజలు, అర్జీదారులు గమనించవలసినదిగా ఆయన కోరారు. వచ్చే సోమవారం యధావిధిగా కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు.

ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ఈ సోమవారం మిలాద్ ఉన్ నబీ పండగ సెలవు కావడంతో నిర్వహించడం లేదని జిల్లా పోలీసు కార్యాలయ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. నెల్లూరు జిల్లాలోని ప్రజలు, ఫిర్యాదు దారులు ఈ విషయాన్ని గమనించగలరని పోలీస్ శాఖ అధికారులు కోరారు.

ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొలినేటి వెంకట రామారావు తనయులు బొల్లినేని కార్తీక్ , బొల్లినేని ధనుశ్ ఆధ్వర్యంలో ప్రముఖ కాంట్రాక్టర్ గంటా రమణయ్య చేతుల మీదుగా అమరావతిలోని సీఎం క్యాంప్ ఆఫీసులో సీఎం నారా చంద్రబాబు నాయుడుకి రూ.కోటి చెక్కును విరాళంగా అందజేశారు. వారిని ముఖ్యమంత్రి అభినందించారు.

జిల్లావ్యాప్తంగా శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్ లో 24,972 కేసులు పరిష్కరించినట్లు జిల్లా జడ్జి సి.యామిని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన లోక్ అదాలత్ కేసుల పరిష్కారంలో నెల్లూరు జిల్లా మొదటి స్థానాన్ని ఆక్రమించిందని లోక్ అదాలత్ కార్యక్రమాలపై నిరంతర దృష్టిపెట్టడంతో నెల్లూరు జిల్లా మూడో సారి రాష్ట్రంలో మొదటి స్థానం దక్కించుకోవడంపై పలువురు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నెల్లూరు మాజీ మంత్రి సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏలేరు ఆధునికీకరణకు 2019లో టీడీపీ టెండర్ పిలిస్తే, వైసీపీ విస్మరించిందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. వరద బాధితులను పరామర్శించేందుకు సైతం జగన్ ఆర్భాటాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. మాజీ సీఎం జగన్కు క్యూసెక్, టీఎంసీ, అవుట్ ఫ్లో అంటే అర్థాలు కూడా తెలియవని ఎద్దేవా చేశారు.

నెల్లూరు జిల్లా అగ్రహారం గ్రామానికి చెందిన శ్రీకాంత్కు మద్దసాని ప్రకాశం కుమార్తె అమూల్యకు 2017లో వివాహం జరిగింది. శ్రీకాంత్ HYD గచ్చిబౌలిలో హాస్టల్ నడుపుతున్నాడు. అయితే ఆన్లైన్ గేమింగ్తో పాటు పలు వ్యసనాల వల్ల భారీగా అప్పుల్లో కూరుకుపోయాడు. బామ్మర్ది యశ్వంత్ని చంపితే ఆస్తి మొత్తం తనకే వస్తుందని భావించాడు. తన స్నేహితుడు ఆనంద్, వెంకటేశ్తో కలిసి యశ్వంత్ను చున్నీతో గొంతు నులిమి హత్య చేశారు.
Sorry, no posts matched your criteria.