Nellore

News September 13, 2024

చిల్లకూరు: మామిడి తోటలో మృతదేహం లభ్యం

image

చిల్లకూరు మండల పరిధిలోని చేడిమాల-తొణుకుమాల గ్రామాల మధ్య ఓ మామిడి తోటలో కాపలాదారు ఒక వ్యక్తి మృతదేహం గురువారం బయట పడింది. ఎస్ఐ సురేశ్ బాబు మాట్లాడుతూ.. మామిడి తోట కాపలాదారులు కనబడటంలేదని, మామిడి తోట యజమాని ఫిర్యాదు చేశారన్నారు. తోటను పరిశీలించడంతో మట్టి పూడ్చిన విషయం గమనించి తవ్వడంతో మృతదేహం బయట పడినట్లు ఆయన తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్ఐ తెలిపారు.

News September 13, 2024

నెల్లూరు: టీడీపీలోకి వైసీపీ కార్పొరేటర్లు

image

నెల్లూరు కార్పొరేషన్‌లోని పలువురు కార్పొరేటర్లు నేడో, రేపో టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. కొందరు కార్పొరేటర్లు గురువారం మంత్రి నారాయణ సన్నిహితుడు విజయభాస్కర్ రెడ్డిని కలిశారు. ముజీర్, పి.వెంకటేశ్వర్లురెడ్డి, సంక్రాంతి కల్యాణ్, కర్తం ప్రతాప్ రెడ్డి, వందవాసి రంగా, కాయల సురేశ్ వీబీఆర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. మొదటి విడతలో 16 మంది చేరికకు రంగం సిద్ధమైంది. మిగతా 27 మంది కూడా టీడీపీలో చేరే అవకాశం ఉంది.

News September 13, 2024

12న కనుపర్తిపాడులో జాబ్ మేళా

image

ఎన్నికల హామీల్లో భాగంగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్టు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులో గురువారం ఆమె మాట్లాడుతూ .. కనుపర్తిపాడులోని వీపీఆర్ కన్వెన్షన్ హాలులో ఈనెల 14న శనివారం జాబ్ మేళా ఏర్పాటు చేశామని చెప్పారు. పలు సంస్థల ప్రతినిధులు వస్తారని.. నిరుద్యోగులు హాజరు కావాలని కోరారు.

News September 13, 2024

22న ముత్తూకూరులో భారీ బహిరంగ సభ

image

అదానీ కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ సాధన కోసం సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ పోరాటానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా ముత్తుకూరు సెంటర్‌లో ఈనెల 22వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు CITU ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ చేపట్టనున్నారు. అలాగే ఈనెల 16న నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

News September 13, 2024

నెల్లూరు: పరిశ్రమలకు త్వరలో భూమి కేటాయింపు

image

నెల్లూరులోని ఏపీఐఐసీ కార్యాలయంలో పరిశ్రమల యాజమానులతో సమీక్ష జరిగింది. ఆ సంస్థ జోనల్ మేనేజర్ శేఖర్ రెడ్డి మాట్లాడూతూ.. వెంకటాచలంలోని పారిశ్రామికవాడలో 41 మంది ప్రభుత్వం నుంచి స్థలం తీసుకుని నేటి వరకు పరిశ్రమలు ఏర్పాటు చేయలేదన్నారు. ఆయా స్థలాలను నూతన పరిశ్రమలకు త్వరలో కేటాయిస్తామన్నారు. ప్రస్తుతం అక్కడ నీటి వసతికి బోర్లు వేస్తున్నామని చెప్పారు.

News September 12, 2024

రేపే జొన్నవాడ ఆలయంలో టెండర్లు

image

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ శ్రీమల్లికార్జున సమేత కామాక్షితాయి ఆలయంలో అక్టోబర్ మూడో తేదీ నుంచి 12వ తేదీ వరకు దేవీ శరన్నవరాత్రులు జరగనున్నాయి. ఈ సందర్భంగా అలంకరణ పనులకు శుక్రవారం ఉదయం 11 గంటలకు టెండర్లు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఈవో ఆర్వభూమి వెంకట శ్రీనివాస్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి ఉన్నవారు టెండర్లలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

News September 12, 2024

నెల్లూరు: SP కారుకు ప్రమాదం

image

నెల్లూరు జిల్లాలో తిరుపతి జిల్లాకు చెందిన నాన్ క్యాడర్ ఎస్పీ కారుకు ప్రమాదం జరిగింది. తిరుపతి జిల్లా కళ్యాణీ డ్యాం వద్ద ఉన్న పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో నాన్ క్యాడర్ ఎస్పీగా సుబ్రహ్మణ్యం పనిచేస్తున్నారు. ఆయన కారు విజయవాడ నుంచి తిరుపతికి వస్తుండగా మనుబోలు మండలం కొండూరు సత్రం వద్ద హైవేపై లారీ ఢీకొట్టింది. కారులోని వారికి ఎలాంటి గాయాలు కాలేదు. ఎస్ఐ రాకేశ్ విచారణ చేస్తున్నారు.

News September 12, 2024

నెల్లూరు: కన్నతండ్రిని రాయితో కొట్టి చంపిన కొడుకు

image

సైదాపురం మండలం, మొలకలపూండ్ల అరుంధతివాడలో దారుణం చోటు చేసుకుంది. కన్న తండ్రిని ఓ కొడుకు రాయితో కొట్టి చంపిన ఘటన ఇవాళ జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. స్థానిక అరుంధతివాడలో కాపురముంటున్న పాలెపు. వెంకటేశ్వర్లుని తన కొడుకు శివాజీ కుటుంబ కక్షల నేపథ్యంలో రాయితో కొట్టి చంపాడు. ఈ ఘటనపై సైదాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News September 12, 2024

నెల్లూరు: జపాన్‌లో ఉద్యోగావకాశాలు

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, నావిస్ హెచ్ ఆర్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ANM/GNM/ బీఎస్సీ నర్సింగ్ చదివిన అభ్యర్థులకు శిక్షణ ఇచ్చి జపాన్ దేశంలో కేర్ వర్కర్స్ ఇన్ హాస్పిటల్స్/ కేర్ హోం ఫెసిలిటీ ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నట్లు నెల్లూరు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి, సి.విజయ వినీల్ కుమార్ తెలిపారు. అర్హులైన వారు https://shorturl.at/FB7ok ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.

News September 11, 2024

నెల్లూరు: 2 రోజుల్లో.. 3 హత్యలు

image

రెండు రోజుల వ్యవధిలోనే మూడు హత్యలు జరగడం పట్ల గూడూరు ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఒక్కరోజే రెండు హత్యలు జరగా బుధవారం మరో హత్య గూడూరు ప్రాంతంలో కలకలం రేపింది. చిల్లకూరు మండలం తణుకుమాల గ్రామంలో ఓ వ్యక్తిని హత్య చేసి పూడ్చిపెట్టగా.. సైదాపురం మండలం గంగదేవిపల్లి గ్రామంలో భార్యను అనుమానంతో భర్త కడతేర్చాడు. బుధవారం గూడూరు శివారు ప్రాంతంలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు.