India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పోలింగ్ మొదలైంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులుదీరారు. టీడీపీ కోవూరు MLA అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నెల్లూరులో ఓటు హక్కు వినియోగించుకున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని మాగుంట లేఅవుట్ ఎస్ఆర్కే స్కూలు పోలింగ్ కేంద్రంలో ఆమె ఓటు వేశారు. అనంతరం కోవూరుకు బయలుదేరారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆమె కోరారు.
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉదయం 5.30 గంటలకే మాక్ పోలింగ్ ప్రారంభమైంది. 6 గంటలకు సంబంధిత ఓట్ల ఫలితాలను పరిశీలించి.. ఈవీఎంలు సరిగా పని చేస్తున్నాయో లేదో నిర్ధారించారు. అన్నీ ఓకే అనుకుంటే సంబంధిత మాక్ పోలింగ్ ఓట్లను తొలగించి 7 గంటల నుంచి అసలైన ఓటింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 6 గంటల వరకు జరిగే పోలింగ్ ప్రక్రియలో జిల్లాలో 20.61 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకుంటారు.
నెల్లూరు: ఎలక్షన్ వేళ ప్రయాణికులకు ఇబ్బందులు తప్పటం లేదు. అనేక బస్సులను ఎలక్షన్ డ్యూటీ నిమిత్తం తరలించగా.. బస్టాండ్లో చాలా తక్కువ బస్సులు ఉన్నాయి. దీంతో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు ఇక్కట్లు పడ్డారు.
తడ మండలం ఇరకం దీవిలో నివసిస్తున్న ఓటర్ల కోసం ఆదివారం రెండు ప్రత్యేక పడవల్లో పోలింగ్ సిబ్బంది, అధికారులు ఈవీఎం పరికరాలతో బయలుదేరి వెళ్లారు. ఇరకం దీవిలోని రెండు పోలింగ్ కేంద్రాలలో 1148 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ రెండు పోలింగ్ కేంద్రాలకుగాను 30 మంది ఎన్నికల అధికారులు, సిబ్బంది బయల్దేరి వెళ్లారు.
మేమంతా రెడీ…. ఓటు హక్కు వినియోగించుకోవడానికి మీరు రెడీనా.. అని పోలింగ్ అధికారులు ఓటర్లకు పిలుపునిచ్చారు. సోమవారం జరగబోయే ఎన్నికల కోసం సర్వం సిద్ధం చేసుకుని ఆత్మకూరు ఆంధ్ర ఇంజినీరింగ్ కళాశాల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ సామగ్రితో తమ పోలింగ్ కేంద్రాలకు అధికారులు, సిబ్బంది, బయలుదేరారు. దేశ భవిష్యత్తుకు ఓటేద్దాం రండి అని పోలింగ్ అధికారులు ఓటర్లకు పిలుపునిచ్చారు.
నెల్లూరు జిల్లాలో ఎన్నికల వేళ కల్లుకి డిమాండ్ పెరిగింది. సాధారణంగా ఎండకాలంలో మందుకంటే కల్లునే ఎక్కువగా తాగుతుంటారు. అయితే ఎన్నికల నేపథ్యంలో శనివారం సాయంత్రం 6 గంటల నుంచి మందు బంద్ చేయడంతో కల్లుకి డిమాండ్ పెరిగింది. కొందరు పక్క ఊర్లకి వెళ్లి మరీ తాగుతున్నారు. కొన్నిచోట్ల కల్లు దొరకకపోవడంతో మందుబాబులు వెనుతిరుగుతున్నారు. మీ ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉందో కామెంట్ చేయండి.
సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన పోలింగ్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఎన్నికల అధికారులు, సిబ్బంది ఈవీఎంలతో పోలింగ్ కేంద్రాలకు బయలుదేరారు. ఈ క్రమంలోనే ఇందుకూరుపేట మండలం జగదేవిపేట పోలింగ్ కేంద్రాన్ని అధికారులు పెళ్లి మండపంలా ముస్తాబు చేశారు. ఓటర్లను ఆహ్వానిస్తూ స్వాగత ఫ్లెక్సీలు పెట్టారు.
నెల్లూరు జిల్లాలో ఈసారి పోలింగ్ శాతం పెంచడానికి అధికారులు శ్రమిస్తున్నారు. ఓటర్లకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసి ఓటింగ్కు రావాలని కోరుతున్నారు. కొన్ని సంస్థలు ఓటర్లకు ఆఫర్లు ఇస్తున్నాయి. తాజాగా గూడూరులోని ఓ హాస్పిటల్ ఓటు వేసిన వారికి మూడు నెలలపాటు ఓపీ, ఏడాదిపాటు టెలీ కన్సల్టెన్సీ ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. ఎవరో ఆఫర్లు ఇచ్చారని కాదు.. అందరూ స్వచ్ఛందంగా ఓటేయాల్సిన అవసరం ఎంతో ఉంది.
గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో 79 శాతం ఓట్లు పోలయ్యాయి. ఈసారి 85 శాతానికి పెంచాలని అధికారులు కృషి చేస్తున్నారు. పోయినసారి ఎక్కడ ఎన్ని ఓట్లు పడ్డాయో చూద్దాం.
➤ కావలి: 76.3 ➤ ఆత్మకూరు: 83.3
➤ కోవూరు: 77.6 ➤ నెల్లూరు సిటీ: 663
➤ నెల్లూరు రూరల్: 65.2 ➤ సర్వేపల్లి: 82.1
➤ గూడూరు: 77.8 ➤ సూళ్లూరుపేట: 83.2
➤ వెంకటగిరి: 79.3 ➤ ఉదయగిరి: 80.3
నెల్లూరు జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఎన్నికల విధులకు హాజరయ్యేందుకు వస్తూ.. కావలి రైల్వే స్టేషన్ వద్ద పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని తల్లి, కుమారుడు చనిపోయారు. ఇద్దరి శరీర భాగాలు ఛిద్రమయ్యాయి. మృతులు సైదాపురం మండలం చాగణం గ్రామానికి చెందిన సుభాషిని, విజయ్ కుమార్గా రైల్వే పోలీసులు గుర్తించారు. మృతదేహాలను కావలి ఏరియా హాస్పిటల్కు తరలించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.