Nellore

News May 6, 2024

కోవూరులో త్రిముఖ పోటీ?

image

కోవూరు పట్టణంలో వైసీపీ, టీడీపీలకు ధీటుగా భారీస్థాయిలో కాంగ్రెస్ సభ జరగడంతో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. సభను గ్రాండ్ సక్సస్ చేయడంలో కోవూరు కాంగ్రెస్ MLA అభ్యర్థి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి కీలక పాత్ర పోషించారని పలువురు పేర్కొన్నారు. కాంగ్రెస్ వ్యూహాలు, వామపక్షాల ఓటుబ్యాంకు మొత్తాన్ని ఆకర్షించడంతో కోవూరు నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొని ప్రత్యర్థి పార్టీలకు సవాల్‌గా మారే అవకాశం ఉంది.

News May 6, 2024

కావలి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

image

అద్దంకిలోని సింగరకొండ రోడ్డులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. కావలికి చెందిన రాజేశ్, నెల్లూరుకి చెందిన చరణ్‌లు బైక్‌పై హైదరాబాద్ నుంచి నెల్లూరుకి వెళ్తుండగా అద్దంకి దగ్గర డివైడర్‌ను ఢీ కొట్టారు. ప్రమాదంలో రాజేశ్ అక్కడికక్కడే మృతి చెందగా, చరణ్‌ను 108లో ఒంగోలు తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News May 5, 2024

ప్రత్యేక హోదా కావాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలి: షర్మిల

image

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఇవాళ కోవూరులో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా, రైతుల రుణ మాఫీ జరగలన్నా , ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 1 లక్ష ఆర్థిక సాయం కావాలన్నా ఎమ్మెల్యే గా కిరణ్ ను, ఎంపీగా కె.రాజును గెలిపించాలని ఆమె కోరారు.

News May 5, 2024

హీటెక్కిన నెల్లూరు రాజకీయం

image

పోలింగ్ తేదీ దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అన్ని పార్టీల అధినేతలు నెల్లూరును చుట్టేస్తున్నారు. రెండు రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నెల్లూరులో పర్యటించారు. నిన్న సీఎం వైఎస్ జగన్ సభ నిర్వహించారు. ఈరోజు కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కోవూరులో పర్యటించారు. అధినేతల పర్యటనలతో నెల్లూరులో పొలిటికల్ హీట్ పెరిగింది.

News May 5, 2024

పోస్టల్ బ్యాలెట్ వినియోగం గడువు పొడిగింపు

image

మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విధులు నిర్వహించే సిబ్బందికి ముందస్తుగా తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఎన్నికల కమిషన్ 5 ,6 ,7 తేదీలకు ప్రకటించారు. ఈ సందర్భంగా ఉదయగిరి అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నెహ్రూ బాబు మాట్లాడుతూ.. ఒకరోజు అదనంగా అంటే 8వ తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే అవకాశం కల్పించారన్నారు.

News May 5, 2024

ఉదయగిరిలో సీనియర్స్ × జూనియర్

image

ఉదయగిరి TDPలో బేధాభిప్రాయాలు పోలింగ్ రోజుకీ సర్దుబాటయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఇక్కడ నేతలు సీనియర్స్ వర్సెస్ జూనియర్‌గా మారారు. మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాకర్ల సురేశ్ సీనియర్లను పట్టించుకోవడం లేదంటున్నారు. మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు ఇంకా ప్రచారంలోకి రాలేదు. నిన్న నెల్లూరులో సోమిరెడ్డి, బీదలతో చర్చించాక ఆయన ఉదయగిరికి వచ్చారు. తాజా పరిస్థితులను కాకర్ల ఎలా ఫేస్ చేస్తారో?

News May 5, 2024

NLR: పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభం

image

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ మొదలైంది. ఎన్నికల విధులకు హాజరయ్యే ఉద్యోగులు ఇవాళ ఓటు వేయనున్నారు. కావలి జడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సరళిని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరి నారాయణన్ పరిశీలించారు. ఉద్యోగులు క్యూలైన్లలో నిల్చుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈనెల 7వ తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌కు అవకాశం ఉంది.

News May 5, 2024

గంటల తేడాలో పార్టీలు మారిన కౌన్సిలర్

image

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు జరిగాయి. స్థానిక నగర పంచాయతీ ఛైర్‌పర్సన్ మోర్ల సుప్రజ, మురళి దంపతులతో కలిసి 14వ వార్డు కౌన్సిలర్ చీర్ల ప్రసాద్ యాదవ్ టీడీపీలో చేరారు. కానీ గంటల తేడాలోనే యూటర్న్ తీసుకున్నారు. కోవూరు MLA నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సమక్షంలో తిరిగి వైసీపీ కండువా కప్పుకొన్నారు.

News May 5, 2024

నీట్-2024కు ఆరు కేంద్రాల్లో ఏర్పాట్లు

image

ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర కోర్సుల్లో ప్రవేశనిమిత్తం నీట్-2024ను ఆదివారం నిర్వహించనున్నారు. జిల్లాలోని అక్షర విద్యాలయం, వీఆర్ ఐపీఎస్, కోవూరు గీతాంజలి ఇంజనీరింగ్ కళాశాల, కావలి ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల, తడలోని పద్మావతి సీబీఎస్ఈ, గూడూరు శ్రీచైతన్య స్కూలులో పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమయ్యే పరీక్షకు 4500 మందికి పైగా విద్యార్థులు హాజరుకానున్నారు.

News May 5, 2024

పోస్టల్ బ్యాలెట్లపై ప్రధాన పార్టీల గురి

image

పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ఆదివారం నుంచి ప్రారంభం కాబోతోంది. ఎన్నికల విధుల్లో ఉండే అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఓటు హక్కు వినియోగించకునేందుకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం నుంచి మూడు రోజుల పాటు ప్రక్రియ జరగనుంది. ఓటర్లు తమ ఫెసిలిటేషన్ సెంటరులోనే ఓటు హక్కు వినియోగించుకోవాల్సివుంది . ఈ క్రమంలో వారిని ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు.