India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎస్ పేట సమీపాన హసనాపురం రోడ్డుపై శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు బైకులు ఢీకొని సంగం మండలం తెర మన గ్రామానికి చెందిన తుమ్మల శివ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడు మహేశ్ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మహేశ్ను 108 వాహనంలో ఆత్మకూరు ఆసుపత్రి చికిత్స కోసం తరలించారు.
ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావుతో తెలుగుదేశం పార్టీ సర్వేపల్లి అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్ చర్చలు జరిపారు. నెల్లూరు వేదాయపాళెంలోని సోమిరెడ్డి నివాసంలో శనివారం ఈ సమావేశం జరిగింది. ప్రధానంగా ఉదయగిరి నియోజకవర్గ రాజకీయాలపై చర్చించినట్టు తెలిసింది.
ప్రముఖ సినీ నిర్మాత, యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు చిట్టమూరు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆయన మిత్ర బృందం ఆదివారం తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు ఆయన శనివారం నెల్లూరు రూరల్ టీడీపీ అభ్యర్థి శ్రీధర్ రెడ్డితో ఎమ్మెల్యే కార్యాలయంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు పలు అంశాలను చర్చించారు.
గూడూరు మండలం చెంబడిపాళెం దళితవాడకు చెందిన పల్లిపాటి గురవయ్య (45) అనే వ్యక్తి వడదెబ్బతో మృతి చెందాడు. మృతుడు కూలి పనుల కోసం చెన్నూరు గ్రామానికి పోయి పనిచేస్తుండగా ఒకసారిగా స్పృహ తప్పి పడిపోయాడని బంధువులు తెలిపారు. అతనిని చెన్నూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు దృవీకరించారు. మృతునికి భార్య బిడ్డలు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు.
సంగం మండలం దువ్వూరు సమీపంలోని పెట్రోలు బంకు వద్ద శుక్రవారం రాత్రి ముంబై రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. నడిచి వెళుతున్న ఓ వ్యక్తిని నెల్లూరు వైపు వెళుతున్న బైక్ ఢీకొంది. ఈ ఘటనలో ఇరువురుకి తీవ్రగాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న ఎస్సై నాగార్జున రెడ్డి క్షతగాత్రులను హైవే అంబులెన్సులో నెల్లూరుకు తరలించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ నేడు మరోసారి జిల్లాకు రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆయన వీఆర్సీ క్రీడా మైదానానికి చేరుకోనున్నారు. అనంతరం 3.10 నిమిషాలకు ఆయన రోడ్ షోలో పాల్గొంటారు. 3.30 గంటలకు ఆయన నెల్లూరులోని గాంధీ బొమ్మ సెంటర్లో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
వెంకటాచలం మండలంలో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఢీకొని వెంకటాచలం రైల్వేగేటు సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి (55) మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి మృతుడి వివరాల కోసం ఆరా తీస్తున్నారు.
నెల్లూరు రూరల్ లో రాజకీయం సెగలు పుట్టిస్తోంది. పోలింగ్ టైం సమీపించే కొద్దీ పొలిటికల్ హైటెన్షన్ పెరుగుతోంది. విజయమే లక్ష్యంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి(వైసీపీ), కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (టీడీపీ) పావులు కదుపుతున్నారు. ఆదాల అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే ఆదాల అని ప్రభాకర్ రెడ్డి అంటుటే, ప్రజాసమస్యల పరిష్కారం కోసం 24×7 అందుబాటులో ఉంటానని, వైసీపీ పాలనలో పేదల జీవితం అస్తవ్యస్తమయిందని కోటంరెడ్డి చెబుతున్నారు
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం నెల్లూరు జిల్లాకు రానున్నారు. మధ్యాహ్నం 3.20 గంటలకు ఆయన నెల్లూరు వీఆర్ కళాశాల మైదానంలో హెలికాప్టర్లో దిగుతారు. అనంతరం వీఆర్సీ సెంటర్ నుంచి గాంధీ బొమ్మ వరకు రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం 3.50 నుంచి 4.35 వరకు బహిరంగ సభ ఉంటుంది. ఈ పర్యటన విజయవంతం చేయాలని వైసీపీ నేతలు కోరారు.
సర్వేపల్లి రాజకీయం రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశంగా ఉంది. పాత ప్రత్యర్థులే తలపడుతున్నా కొత్త అంశాలతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. అభివృద్ధి చేశానని, తననే గెలిపించాలని కాకాణి కోరుతుండగా.. కంటైనర్ టెర్మినల్, అక్రమ మైనింగ్ తదితర అంశాలను సోమిరెడ్డి ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. టీడీపీ హయాంలో తాను చాలా పనులు చేశానని, అన్నీ గమనించి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. అంతిమంగా సత్తా చాటేదెవరో.?
Sorry, no posts matched your criteria.