Nellore

News May 3, 2024

సింహపురి నుంచి ఢిల్లీ వెళ్లేది ఎవరో..!

image

రాజకీయ చైతన్యానికి మారుపేరైన సింహపురిలో రసవత్తర పోటీ జరుగుతోంది. నెల్లూరు పార్లమెంటు స్థానం నుంచి విజయసాయిరెడ్డి(వైసీపీ), వీపీఆర్(టీడీపీ), రాజు(కాంగ్రెస్) పోటీపడుతున్నారు. నెల్లూరు అభివృద్ధి కోసం ప్రత్యేక మేనిఫెస్టోతో వీఎస్ఆర్, మాస్టర్ ప్లాన్‌తో వీపీఆర్, గతంలో చేసిన మంచి పనులతో రాజు ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. చివరకు సింహపురి ప్రజలు ఎవరిని ఢిల్లీకి పంపుతారో చూడాలి మరి.

News May 3, 2024

ఎన్నికల బరిలో ముగ్గురు రిటైర్డ్ IASలు

image

సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ ఎన్నికల్లో ముగ్గురు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు పోటీలో ఉన్నారు. గతంలో కలెక్టర్‌గా పనిచేసిన కొప్పుల రాజు కాంగ్రెస్ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ఉండగా, తిరుపతి ఎంపీ బరిలో వెలగపల్లి వరప్రసాద్, విజయకుమార్ ఉన్నారు. వరప్రసాద్ నాలుగోసారి ఎన్నికల సంగ్రామంలో ఉండగా విజయకుమార్ మొదటి సారి పోటీ చేస్తున్నారు.

News May 3, 2024

ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తారు: ఆదాల

image

ఎంపీ, వైసీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ముస్లిం సోదరుల సంక్షేమం కోసం వైఎస్సార్ నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే వీటిని రద్దు చేయడం ఖాయం. రిజర్వేషన్ల రద్దు చేసే విషయాన్ని బీజేపీ అగ్రనేతలే చెబుతున్నారు. ఈ విషయమై ముస్లిం సోదరులు ఆలోచించాలి. ఐదేళ్లు ప్రజల కోసం అనేక పథకాలు అమలు చేసిన వైసీపీకి ఓటు వేయాలి’ అని ఆదాల కోరారు.

News May 2, 2024

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అక్రమ రవాణా పై ప్రత్యేక దృష్టి

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సాధించినట్లు జిల్లా ఎస్పీK.ఆరీఫ్ హఫీజ్ తెలిపారు. గురువారం జిల్లా వ్యాప్తంగా తనిఖీల్లో భాగంగా బిట్రగుంట పరిధిలో-80, జలదంకి-45, దగదర్తి-41, మనుబోలు-15 & FJ Wash-1600 లీటర్లు, SEB-219 మద్యం బాటిల్స్ లను సీజ్ చేసామన్నారు. 

News May 2, 2024

కిటకిటలాడుతున్న బ్యాంకు సేవా కేంద్రాలు

image

సామాజిక పింఛన్లు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయి. ఈక్రమంలో నగదును డ్రా చేసుకునేందుకు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా బ్యాంకులతో పాటు బ్యాంకు సేవా కేంద్రాలు, మినీ ఏటీఎంల వద్ద లబ్ధిదారులు బారులుదీరారు. మరోవైపు దివ్యాంగులు, మంచానికి పరిమితమైన వారికి సచివాలయ ఉద్యోగులు ఇళ్ల వద్దే పింఛన్లు పంపిణీ చేస్తున్నారు.

News May 2, 2024

5న కోవూరులో షర్మిల బహిరంగ సభ

image

పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మే 5న నెల్లూరుకు రానున్నారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు కోవూరు పట్టణంలో జరిగే బహిరంగ సభలో ఆమె పాల్గొంటారని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు తరలిరావాలని ఆయన కోరారు.

News May 2, 2024

నెల్లూరు: 41.7 డిగ్రీల ఎండతో జనం విలవిల

image

నెల్లూరులో బుధవారం 41.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ తీవ్రతకు జనం విలవిలలాడుతున్నారు. ఉదయం 9 గంటలకే సూర్యప్రతాపం తీవ్రమవుతుండటంతో ఇళ్లలో నుంచి బయటకు వచ్చేందుకు జనం జంకుతున్నారు. 11 గంటలకు ఖాళీ అవుతున్న రోడ్లు తిరిగి సాయంత్రం 5 గంటల తర్వాతే రాకపోకలతో రద్దీగా కనిపిస్తున్నాయి. రోడ్ల పక్కన చిరువ్యాపారులు చేసుకునేవారు. రోజు కూలీలు మాత్రం విధిలేని పరిస్థితుల్లో ఎండలోనే జీవన పోరాటం సాగిస్తున్నారు.

News May 2, 2024

సంగం ఆనకట్ట తొలగింపునకు సన్నాహాలు

image

నెల్లూరు జిల్లా సంగం వద్ద పెన్నానదిపై బ్యారేజీ నిర్మించిన నేపథ్యంలో పాత ఆనకట్ట తొలగింపునకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం పాత ఆనకట్టకు 450 మీటర్ల దిగువన బ్యారేజీ నిర్మాణం జరిగింది. ఈక్రమంలో బ్యారేజీలో నీటిని నిల్వలను లెక్క కట్టడంలో తేడా రావడంతో పాటు బీరాపేరు పొలాలు ముంపునకు గురవుతున్నాయి. ఈక్రమంలో పాత ఆనకట్టను తెలుగుగంగ ఎస్ఈ వెంకటరమణారెడ్డి తదితరులు పరిశీలించారు. ఈ ఆనకట్టను 1882లో కట్టారు.

News May 2, 2024

డీఎడ్ ఫీజులు చెల్లించండి: డీఈఓ

image

NLR: డీఎడ్ విద్యార్థులు నాలుగో సెమిస్టర్ ఫీజులను మే 8వ తేదీ లోపు చెల్లించాలని నెల్లూరు జిల్లా విద్యాశాఖాధికారి రామారావు సూచించారు. రూ.50 అపరాధ రుసుముతో ఈ నెల 15వ తేదీ వరకు చెల్లించే అవకాశం ఉందన్నారు. రెగ్యులర్‌తో పాటు ప్రైవేటు విద్యార్థులు పూర్తి వివరాల కోసం సంబధిత కళాశాలల్లో సంప్రదించాలని డీఈఓ కోరారు.

News May 2, 2024

మూడేళ్లలో నెల్లూరు విమానాశ్రయం: లోకేశ్

image

నెల్లూరు జిల్లా రాజకీయాలు విమానాశ్రయం చుట్టే తిరుగుతున్నాయి. జిల్లా కోసమే ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేసిన వైసీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి ఇదే విషయాన్ని కీలకంగా ప్రస్తావించారు. తాజాగా నిన్న వీఆర్సీ మైదానంలో జరిగిన యువగళం సభలో నారా లోకేశ్ ఎయిర్ పోర్టుపై కీలక హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే విమానాశ్రయం తీసుకు వస్తామని చెప్పారు. మరి నాయకుల హామీలపై మీ కామెంట్.