India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నెల్లూరు నగరానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం రానున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు మద్దతుగా వారు రోడ్ షోలో పాల్గొంటారు. స్థానిక కేవీఆర్ పెట్రోల్ బంక్ నుంచి ఆర్టీసీ మీదుగా మద్రాసు బస్టాండు, వీఆర్సీ వరకు వారు రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం టీడీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఇప్పటివరకు 18సార్లు ఎన్నికలు జరిగాయి. 1952లో బెజవాడ రామచంద్రారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. కాంగ్రెస్ పార్టీ 12సార్లు గెలవగా.. TDP 3సార్లు, YCP 2 సార్లు గెలిచింది. ప్రస్తుతం TDP తరఫున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, YCP నుంచి వి.విజయసాయిరెడ్డి, కాంగ్రెస్ నుంచి కొప్పుల రాజు పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి
ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా కోవూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నారపురెడ్డి కిరణ్ రెడ్డి దుస్తులను ఇస్త్రీ చేశారు. బుధవారం ఆయన ఇందుకూరుపేటలో ప్రచారం నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాలని కోరారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నెల్లూరులో యువగళం నిర్వహిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లాలో టీడీపీ, జనసేన, బీజేపీ బలపరిచిన నాయకులను గెలిపించాలని అన్నారు. జిల్లాకు పెట్టుబడులు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు. అనంతరం విద్యార్థులు, యువకులు, ప్రజలతో మమేకమై వారు అడిగిన ప్రశ్నలకు సమాదానం చెప్పారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. బుధవారం తడ.. బివి పాలెం చెక్ పోస్ట్ వద్ద సెబ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పాండిచ్చేరి నుంచి నెల్లూరుకి మినీ లారీలో అక్రమంగా తరలిస్తున్న 300 కేసుల మద్యం (14,400 క్వార్టర్ బాటిళ్ల) మద్యం స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న మద్యం విలువ సుమారు రూ.7,42,000 ఉంటుందని అంచనా.
నెల్లూరు పర్యటనకు వచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్తో ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంటు స్థానంలో రాజకీయ పరిస్థితులపై చర్చించుకున్నారు. వీపీఆర్ వెంట నెల్లూరు డిప్యూటీ మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ ఉన్నారు.
ఈసీ మార్గదర్శకాల మేరకు ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు వారి నియోజకవర్గాల్లోని ఫెసిలిటేషన్ కేంద్రాల్లోనే పోస్టల్బ్యాలెటు ఓట్లు వినియోగించుకోవాలని కలెక్టర్ హరి నారాయణన్ సూచించారు. మే 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పార్లమెంటుకు, అసెంబ్లీకి రెండు ఓట్లు వేసేలా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో మూడో తరగతి నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ రాణి తెలిపారు. ఈ నెల 20వ తేదీ వరకు ఆయా పాఠశాలల్లో HMలకు నేరుగా దరఖాస్తులు అందజేయవచ్చన్నారు. మే 30న లాటరీ ద్వారా సీట్ల కేటాయింపు జరుగుతుందన్నారు. పూర్తి వివరాలకు నెల్లూరులోని ఐటీడీఏ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
విడవలూరు మండలం అలగానిపాడుకు చెందిన పుచ్చలపల్లి సుందరయ్య హైస్కూలు వయస్సులోనే స్వాతంత్ర్య పోరాటంలో భాగస్వాములయ్యారు. రాజకీయాల్లోకి వచ్చాక కమ్యూనిస్టు పార్టీలో జాతీయస్థాయి నాయకుడిగా ఎదిగారు. కమ్యూనిస్టు గాంధీగా గుర్తింపు పొందారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా ప్రజాసేవలో తరించారు. సంతానం కలిగితే ప్రజాసేవకు బంధాలు అడ్డు అనే ఉద్దేశంతో పెళ్లి కాగానే కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకున్నారు. నేడు ఆయన జయంతి.
వైసీపీ కోవూరు MLA అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మండలంలోని కొత్తూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించే సందర్భంలో తెలుగుదేశం పార్టీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా విమర్శలు చేసినట్లు ఎంపీడీఓ సాయిలహరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Sorry, no posts matched your criteria.