Nellore

News May 1, 2024

నెల్లూరు జిల్లాలో 982 మంది రౌడీ షీటర్లపై బైండోవర్

image

నెల్లూరు జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాలకు 115 మంది, పార్లమెంటుకు 14 మంది పోటీ పడుతున్నారని కలెక్టర్ ఎం .హరి నారాయణన్ తెలిపారు. అభ్యర్థులందరూ ఎన్నికల నియమావళిని పాటించాలని సూచించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరుగుతుందని తెలిపారు. జిల్లా ఎస్పీ ఆరీఫ్ ఆఫీజ్ మాట్లాడుతూ. జిల్లాలో 982 మంది రౌడీ షీటర్లను బైండోవర్ చేశామని తెలిపారు. శాంతి భద్రతలపై దృష్టి పెడుతామన్నారు.

News April 30, 2024

వెంకటరెడ్డి పల్లిలో ఈతకు వెళ్లి ఇద్దరు యువకుల గల్లంతు

image

కలువాయి మండలం వెంకటరెడ్డి పల్లి బ్రిడ్జి వద్ద ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. నీట మునిగిన యువకులు పాతలపల్లి గ్రామానికి చెందిన మిట్టమల్ల వంశీ(28), పెంచల నరసింహులు(20) గా గుర్తించారు. వంశీ మృతదేహాన్ని బయటకు తీసిన స్థానికులు, పెంచల నరసింహులు మృతదేహం కోసం ఈతగాళ్లు, స్థానికులు, బంధువులు గాలిస్తున్నారు. సంఘటన స్థలం వద్ద కుటుంబ సభ్యులు, బంధువులు శోకసవద్రంలో మునిగి పోయారు.

News April 30, 2024

రేపు నెల్లూరులో లోకేష్ పర్యటన

image

తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బుధవారం నెల్లూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ముత్తుకూరు రోడ్డులోని పీఎస్ఆర్ కన్వెన్షన్ నుంచి బయలుదేరి వీఆర్సీ మైదానానికి చేరుకుంటారు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు వీఆర్సీ మైదానంలో జరిగే సభలో పాల్గొన్న అనంతరం 6.30 గంటలకు తిరిగి కన్వెన్షన్ చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేయనున్నారు.

News April 30, 2024

ఎమ్మెల్యేని గ్రామాల్లోకి రానివ్వదు: వాకాటి

image

సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఐదేళ్లలో ఏమి పనిచేయని స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యను గ్రామాలలో తిరగనివ్వొద్దని, అడ్డుకోవాలని బీజేపీ సీనియర్ నాయకులు వాకాటి నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం చెంబేడుపాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాను, నెలవల, పరసా ఏ గ్రామానికి వెళ్లినా ఏమి అభివృద్ధి చేశామో చెప్పగలనని, కానీ కిలివేటి ఏమి చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు.

News April 30, 2024

వాకాడు: భర్తకు భోజనం పెట్టి వస్తూ భార్య తిరిగిరాని లోకానికి

image

వడదెబ్బ సోకి మహిళ మృతి చెందిన సంఘటన వాకాడు మండలం నిడుగుర్తి పంచాయతీ బాలాజీ నగర్లో మంగళవారం చోటుచేసుకుంది. మల్లాపు పుట్టమ్మ (52)  గ్రామ సమీపంలోని వేరుశనగ తోటలో పనిచేస్తున్న తన భర్తకి భోజనం ఇవ్వడానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఎండ తీవ్రతకు అక్కడే కుప్పకూలిపోయారు. అది గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందారు.

News April 30, 2024

కోవూరు: నేను ఒంటరిని కాదు: వైసీపీ నేత

image

మేమందరం కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డితోనే ఉంటామని ఇందుకూరుపేట మండలం డేవిస్ పేట వైసీపీ నేత కదురు రమేశ్ అన్నారు. నిన్న కొంతమంది డేవిస్ పేట నుంచి టీడీపీలో చేరారు. కదురు రమేష్ అనుచరులు కూడా టీడీపీలో చేరారని, ఆయన ఒంటరిగా మిగిలిపోయారని వార్తలు వచ్చాయి. ఇవ్వన్ని అపోహలేనని, మేమంతా వైసీపీలోనే ఉన్నామని వారు స్పష్టం చేశారు.

News April 30, 2024

అక్రమ రవాణాపై నిఘా పెంచాలి: కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నగదు, మద్యం అక్రమ రవాణాపై నిఘా పెంచాలని నెల్లూరు కలెక్టర్ ఎం.హరినారాయణన్ నోడల్ ఆఫీసర్లను ఆదేశించారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయ ప్రాంగణంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నోడల్ ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని చెక్‌పోస్ట్‌ల వద్ద పక్కాగా తనిఖీలు చేయాలని సూచించారు.

News April 30, 2024

చెంగాళమ్మను విస్మరిస్తే పదవి గల్లంతే..!

image

ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట చెంగాళమ్మ దర్శనానికి వెళ్లకుండా ఉంటే పదవి పోతుందనే నమ్మకం ఉంది. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఆలయం దారిగుండా కారులో వెళ్లారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయారు. మరో ప్రధాని ఐకే గుజ్రాల్ శ్రీహరికోటకు వచ్చినా అమ్మవారిని దర్శించుకోలేదు. 1998లో ఆయన పదవిని కోల్పోయారు. తమిళనాడు సీఎం జయలలిత, ఎన్టీఆర్‌కు కూడా ఇలాగే పదవీగండం కలిగిందని స్థానికులు చెబుతారు.

News April 30, 2024

చిత్తూరులో నెల్లూరు వాసికి జైలుశిక్ష

image

నెల్లూరుకు చెందిన ఆంజనేయులు అలియాస్ సాయినాథ్ చౌదరి చిత్తూరు జిల్లా బంగారుపాళెంలో ఉంటూ చిట్టీలు, వడ్డీ వ్యాపారం నిర్వహించాడు. 2022 ఫిబ్రవరి 21న రాత్రి ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడు. పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో 64 మందికి రూ.6.4 కోట్లు బకాయి ఉన్నట్లు తేలింది. కోర్టు విచారణలో నేరం రుజువు కావడంతో ఆయనకు తొమ్మిదేళ్ల జైలుశిక్ష, రూ.1.55 లక్షల జరిమానా విధిస్తూ జడ్జి భీమారావు తీర్పుచెప్పారు.

News April 30, 2024

NLR: రేపే బ్యాంకు ఖాతాల్లో పింఛన్ జమ

image

పింఛన్ లబ్ధిదారులకు నగదును బ్యాంకు ఖాతాల్లో బుధవారం జమ చేయనున్నట్లు డీఆర్డీఏ పీడీ సాంబశివారెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లాలో 3,15,423 మంది లబ్ధిదారులకు రూ.94.38 కోట్లు అందజేయనున్నట్లు వెల్లడించారు. ఆధార్ నంబరుతో మ్యాప్ అయిన అకౌంట్‌కు నగదు జమ చేస్తామన్నారు. బ్యాంకు ఖాతాల్లేని వారు, దివ్యాంగులు, మంచానికి పరిమితమైన వారికి ఐదో తేదీ లోపు ఇంటి వద్దే పంపిణీ చేస్తామన్నారు.