India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మే 5న నెల్లూరుకు రానున్నారు. ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించాల్సిన ప్రాంతాలపై డీసీసీ అధ్యక్షుడు చేవూరు దేవకుమార్ రెడ్డి, నెల్లూరు ఎంపీ అభ్యర్థి కొప్పుల రాజు చర్చించారు. నెల్లూరులో ఆమె రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని పార్టీ వర్గాలకు సూచించారు.
గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లా కావలిలో జనసేన అభ్యర్థిగా పసుపులేటి సుధాకర్ బరిలో నిలిచారు. అప్పుడు గాజు గ్లాస్ గుర్తుపై పోటీ చేసిన ఆయనకు 10,647(5.46శాతం) ఓట్లు వచ్చాయి. తాజా ఎన్నికల్లో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. కావలిలో జనసేన అభ్యర్థి లేకపోవడంతో పసుపులేటికి గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు. మరి ఈసారి ఇక్కడ ఫలితం ఎలా ఉంటుందో కామెంట్ చేయండి.
నెల్లూరు జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. కావలిలో పసుపులేటి సుధాకర్, సర్వేపల్లిలో మన్నెం పుట్టయ్య, ఆత్మకూరులో ధనిరెడ్డి రామనారాయణరెడ్డికి గాజు గ్లాసు గుర్తు లభించింది. ఈ క్రమంలో ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు.
నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తం 14 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. సోమవారం సాయంత్రం నామినేషన్ ఉపసంహరణ అనంతరం అధికారిక జాబితా విడుదల చేశారు. మొత్తం 15 నామినేషన్లో ఉండగా వారిలో ఒకరు సోమవారం ఉపసంహరించుకున్నారు. దీంతో 14 మంది బరిలో నిలిచారు. ప్రధానంగా టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి, వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి మధ్య పోటీ నెలకొని ఉంది.
2024 సాధారణ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని, ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులందరూ ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పకుండా పాటించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరి నారాయణన్ సూచించారు. సోమవారం సాయంత్రం నెల్లూరు కలెక్టరేట్ లో అభ్యర్థులతో ఆయన సమావేశమయ్యారు. పలువురు అధికారులు పాల్గొన్నారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నెల్లూరు నగరంలోని మెడికవర్ హాస్పిటల్, బుజబుజ నెల్లూరు చెక్ పోస్ట్ లను జిల్లా యస్.పి. ఆరీఫ్ హాఫిజ్ సోమవారం తనిఖీ చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా సరిహద్దు చెక్ పోస్టులు, ముఖ్య కూడళ్లలో వద్ద సంబంధిత పోలీస్ స్టేషన్ పోలీస్ అధికారులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఎటువంటి అక్రమ రవాణా లేకుండా పటిష్ఠమైన చర్యలు చేపట్టాలన్నారు.
కావలి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న పసుపులేటి సుధాకర్కు గ్లాస్ గుర్తును కేటాయించారు. దీంతో పసుపులేటి సుధాకర్ అనుచరులు ఆనంద ఉత్సవాల్లో నిమగ్నమయ్యారు. జనసేన పోటీ చేయని ప్రాంతాల్లో గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్గా ఎన్నికల అధికారులు చూపిస్తున్నారు. పలువురు స్వతంత్ర అభ్యర్థులు గ్లాస్ సింబల్ను తమకు కేటాయించాలని కోరుకున్నారు.
నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తం 14 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. సోమవారం సాయంత్రం నామినేషన్ ఉపసంహరణ అనంతరం అధికారిక జాబితా విడుదల చేశారు. మొత్తం 15 నామినేషన్లో ఉండగా వారిలో ఒకరు సోమవారం ఉపసంహరించుకున్నారు. దీంతో 14 మంది బరిలో నిలిచారు. ప్రధానంగా టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి, వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి మధ్య పోటీ నెలకొని ఉంది.
జలదంకిలోని పలు ప్రాంతాలలో సోమవారం వైసీపీ ఉదయగిరి అసెంబ్లీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి కోడలు శ్రేయ రెడ్డి ఇంటింటి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఓ ఇంటికి వెళ్లి దుస్తులను ఇస్త్రీ చేసి పలువురిని ఆకట్టుకున్నారు. గడిచిన ఐదేళ్లలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మొత్తం 11 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మొత్తం 12 మంది నామినేషన్లు సక్రమంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. సోమవారం నామినేషన్లను ఉపసంహరణకు ముందు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. దీంతో మొత్తం 11 మంది పోటీలో నిలిచారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోటంరెడ్డి, వైసీపీ అభ్యర్థి ఆదాల మధ్య పోటీ నెలకొంది.
Sorry, no posts matched your criteria.