India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్ వేసిన వేణుంబాక సునంద రెడ్డి తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. ఈ మేరకు సోమవారం సునంద రెడ్డి తరఫున ఎస్. సుబ్బారెడ్డి కలెక్టర్, ఎన్నికల అధికారి హరినారాయణ్ వద్దకు వెళ్లి తమ నామినేషన్ ఉపసంహరించుకుంటున్నట్లు తెలియజేసి పత్రాలను అందజేశారు.
నెల్లూరు జిల్లా మర్రిపాడు వైస్ ఎంపీపీ చప్పిడి రవణమ్మ తిరిగి వైసీపీ గూటికి చేరారు. నిన్న బ్రాహ్మణపల్లిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రాంనారాయణ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. 24 గంటలు గడవక ముందే ఆ పార్టీని వీడారు. ఇవాళ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ సమక్షంలో తిరిగి వైసీపీలో చేరడం విశేషం.
ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలోని 10 నియోజకవర్గాల్లో తుది పోరులో ఎవరు నిలుస్తారనేది ఇవాళ తేలనుంది. గూడూరులో 15, వెంకటగిరిలో 20, సూళ్లూరుపేటలో 23, సర్వేపల్లిలో 17, నెల్లూరు సిటీలో 27, రూరల్లో 24, కోవూరులో 32, కావలిలో 25, ఆత్మకూరులో 23, ఉదయగిరిలో 29 నామినేషన్లను అధికారులు ఆమోదించారు. నెల్లూరు ఎంపీ స్థానానికి 28 నామినేషన్లకు ఆమోదం లభించింది. ఇవాళ సాయంత్రంలోగా EVMలో ఎవరి పేర్లు ఉంటాయో తెలిసిపోతుంది.
ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో నిన్న సీఎం ప్రచారం జరిగింది. ఈక్రమంలో భద్రతా వైఫల్యం వెలుగు చూసింది. త్రిభువని సెంటర్లో ప్రసంగం అనంతరం జగన్ విశ్వోదయ కాలేజీ మైదానంలోని హెలిపాడ్ వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో డక్కిలి మండలం నాగోలు పంచాయతీ పెద్దయాచ సముద్రానికి చెందిన మాజీ వాలంటీర్ బారికేడ్లు దూకి హెలికాప్టర్ వద్దకు పరుగులు తీశాడు. భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు.
సర్వేపల్లి మాజీ MLA ఈదురు రామకృష్ణారెడ్డి సోదరుడు రాంప్రసాద్ రెడ్డి టీడీపీని వీడి వైసీపీ గూటికి చేరారు. నెల్లూరులోని తన క్యాంపు కార్యాలయంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆయనకు వైసీపీ కండువా కప్పారు. ముత్తుకూరు మండలంలో రాంప్రసాద్ రెడ్డికి గట్టిపట్టుందని.. అలాంటి నాయకుడు వైసీపీలోకి రావడం సంతోషంగా ఉందని కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు.
భానుడి ప్రతాపానికి శనివారం నెల్లూరు జిల్లా ప్రజలు అల్లాడిపోయారు. తిరుపతి 42.9, నెల్లూరులో 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, అవసరమైతే తప్ప మధ్యాహ్నం బయటకు రావద్దని నిపుణులు సూచిస్తున్నారు.
రాజకీయ పార్టీలు, అభ్యర్థులు అనుమతి లేకుండా వాహనాలను
ప్రచారానికి వినియోగించారదని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి M. హరి నారాయణన్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. అనుమతి పొందిన వాహనాలు అనుమతి పత్రం( పర్మిషన్) వాహనం ముందు భాగంలో అతికించాలన్నారు . FST/SST టీమ్ లు ప్రచార వాహనాలకు అనుమతులు ఉన్నాయో లేదో తనిఖీ చేస్తామన్నారు.
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం వెంకటగిరి పట్టణానికి విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నారు.
ఏపీ సెట్ – 2024 పరీక్ష ఆదివారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగనుంది. విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిధిలో కాకుటూరులోని వర్సిటీ కళాశాల, జగన్స్ కాలేజీ, కృష్ణచైతన్య డిగ్రీ కాలేజీ, రావూస్ డిగ్రీ కళాశాల, డీకేడబ్ల్యూ కళాశాల, వీఆర్ ఐపీఎస్ లో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు ఏపీ సెట్ ప్రాంతీయ సమన్వయకర్త వీరారెడ్డి తెలిపారు. 1767 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు ఆయన వెల్లడించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం వెంకటగిరిలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 1.10 గంటలకు ఆయన ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ లో దిగుతారు. 1.30 గంటల నుంచి 2.15 గంటల వరకు వెంకటగిరిలోని త్రిభువని సెంటరులో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం హెలికాఫ్టర్ లో కందుకూరు బయలుదేరుతారు.
Sorry, no posts matched your criteria.