India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నెల్లూరుకు చెందిన పుట్టా మురార్జి చేజర్ల మండలం కండాపురంలో అక్క కుమార్తె సుప్రజను వివాహం చేసుకున్నాడు. కొన్నేళ్లుగా నెల్లూరులోనే నివాసం ఉంటున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో పుట్టింటికి వచ్చిన భార్య సుప్రజపై శనివారం బాత్ రూములు శుభ్రపరిచే యాసిడ్ తో దాడి చేశాడు. సుప్రజను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు బాధిత కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేపట్టారు.
ఆత్మకూరు ప్రజాగళం సభలో చంద్రబాబుకు ఆనం రామనారాయణ రెడ్డి వినతులు విన్నవించుకున్నారు. ‘సోమశిల హైకెనాల్ పూర్తి చేసి సాగునీరు, తాగునీరు అందించాలి. నదికూడి శ్రీకాళహస్తి లైన్ టీడీపీ హయాంలో మొదలు పెడితే.. దానిని వైసీపీ తుంగలో తొక్కింది. మీరు పూర్తి చేయాలి. జిల్లా 100 పడకల ఆసుపత్రిని 250 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయాలి. సోమశీల ప్రాజెక్టును పూర్తి చేయాలి’అని కోరారు.
నెల్లూరు సిటీ 8వ డివిజన్ లో ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ఎండీ ఖలీల్ అహ్మద్, డివిజన్ కార్పోరేటర్ మొగలపల్లి కామాక్షి దేవి శనివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఐదేళ్ల కాలంలో సీఎం జగన్ చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని గుర్తించి మరోసారి తమకు అవకాశం కల్పించాలని ప్రజలను కోరారు. పలువురు అభిమానులు వీఎస్ఆర్ మాస్కులు ధరించి ఆయనతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు.
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వెంకటగిరికి రానున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారని నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి కార్యాలయ వర్గాలు తెలిపాయి. త్రిభువని కూడలి ప్రాంతంలో సభ నిర్వహణకు అవసరమైన ప్రాంతాలను స్థానిక నాయకులు పరిశీలించారు.
సార్వత్రిక ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్ది ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అందులో భాగంగా శనివారం నెల్లూరు జిల్లాలో ఇద్దరు ప్రముఖుల ప్రచార కార్యక్రమాలు జరగనున్నాయి. ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెంలో నారా చంద్రబాబు ఎన్నికల ప్రజాగళం సభలు నిర్వహిస్తుండగా, వెంకటగిరి నియోజకవర్గంలో ఆయన బామ్మర్ది నందమూరి బాలకృష్ణ రోడ్ షో జరగనుంది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న నందమూరి బాలకృష్ణ ఆదిత్య నగర్ లోని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నివాసంలో బస చేశారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం బాలకృష్ణను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నారాయణ తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. నెల్లూరు రాజకీయాలపై చర్చించారు.
ఆత్మకూరు వైద్యశాలలో బాలింత మృతిపై వివాదం నెలకొంది. అనంతసాగరం మండలం రేవూరుకి చెందిన భవాని రెండో కాన్పు కోసం రెండు రోజుల క్రితం వైద్యశాలలో చేరారు. శుక్రవారం ఉదయం మగబిడ్డకు జన్మనిచ్చింది. రాత్రి నొప్పులు అధికంగా ఉన్నాయనడంలో వైద్య సిబ్బంది ఇంజక్షన్ ఇచ్చారు. ఒక్కసారిగా పెదవి పక్కకు లాగి నూరుగు వచ్చింది. అత్యవసర వార్డుకు తరలించి సేవలందించారు. అయినా యువతి కోలుకోలేక మృతి చెందింది.
అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు సక్రమంగా లేని 41 నామినేషన్లను తిరస్కరించినట్లు జిల్లా ఎన్నికల అధికారులు వెల్లడించారు. అత్యధికంగా కావలి నియోజకవర్గంలో 10 నామినేషన్లను తిరస్కరించారు. కోవూరులో 9, నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 8, ఉదయగిరిలో ఆరు సర్వేపల్లిలో నాలుగు, ఆత్మకూరులో రెండు, కందుకూరు, నెల్లూరు రూరల్లో ఒక్కొక్కటి చొప్పున నామినేషన్లను తిరస్కరించినట్లు తెలిపారు.
మాజీ సీఎం చంద్రబాబు నాయుడు శనివారం నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెంలో నిర్వహించే ప్రజాగళం సభల్లో ఆయన పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు హెలికాప్టర్లో ఆత్మకూరు చేరుకోనున్న చంద్రబాబు.. 3.30 గంటలకు నిర్వహించే సభలో ప్రసంగిస్తారు. అక్కడి నుంచి సాయంత్రం 5.30 గంటలకు బుచ్చిలో జరిగే సభకు హాజరవుతారు. రాత్రికి బుచ్చిలోనే బస చేస్తారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు తెలిపాయి.
ఎంపీ, ఎమ్మెల్యే సీటు దక్కని కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మికి టీడీపీ జాతీయ కమిటీలో చోటు కల్పించారు. ఆమెను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. 2019, 2021 ఉప ఎన్నికలో ఆమె టీడీపీ తిరుపతి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. తనకు లేదా తన భర్తకు ఈసారి ఎమ్మెల్యే లేదా ఎంపీ సీటు ఆశించారు. ఇవేమీ దక్కకపోవడంతో పార్టీ పదవి కట్టబెట్టారు.
Sorry, no posts matched your criteria.