Nellore

News April 26, 2024

రూ.9500 పలికిన నిమ్మకాయల బస్తా

image

పొదలకూరు మార్కెట్లో శుక్రవారం నాణ్యమైన నిమ్మకాయలు బస్తా రూ.9.500 పలికాయి. ఈ ఏడాదిలో ఇదే అత్యధిక ధర అని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ 22వ తేదీ వరకు బస్తా రూ.4 వేలు నుంచి రూ.5 వేలు పలుకుతూ వచ్చింది. మంగళవారం ఆరు వేలకు చేరగా, గురువారం రూ.8 వేలు పలికింది. శుక్రవారం మరో రూ.1500 పెరిగింది. ఎండల తీవ్రత పెరిగడంతో ఉత్తరాది రాష్ట్రాల్లో నిమ్మకాయలకు డిమాండ్ పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.

News April 26, 2024

నెల్లూరు: 283 సెట్ల నామినేషన్లు దాఖలు

image

సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. నెల్లూరు జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు 230 మంది 283 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నెల్లూరు పార్లమెంటు స్థానానికి 21 మంది 36 నామ పత్రాలు సమర్పించారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 39 సెట్లు, రూరల్ 28, సర్వేపల్లి 23, కందుకూరు 40, కావలి 43, ఆత్మకూరు 27, ఉదయగిరిలో 41 నామినేషన్లు దాఖలయ్యాయి.

News April 26, 2024

బిట్రగుంట: మెము రైళ్లు రద్దు పొడిగింపు

image

పలు మెము రైళ్లు రద్దు పొడిగిస్తున్నట్లు విజయవాడ డివిజన్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. బిట్రగుంట-విజయవాడరైలు 29 నుంచి మే 26 వరకు, విజయవాడ-బిట్రగుంట రైలు 29 నుంచి మే 26 వరకు రద్దు చేశారు. బిట్రగుంట-చెన్నై రైలు 29 నుంచి మే 3 వరకు, మే 6 నుంచి 10 వరకు, 13 నుంచి 17 వరకు, మే 20 నుంచి 24 వరకు రద్దు చేశారు.

News April 26, 2024

నెల్లూరు జిల్లాలో అమానుష ఘటన

image

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో అమానుష ఘటన వెలుగు చూసింది. వాలీబాల్‌లో గాలి తగ్గిందని 12 ఏళ్ల బాలుడు ఓ చోటకు వెళ్లాడు. అక్కడ అనికేపల్లికి చెందిన రాజా అనే వ్యక్తి సైకిల్ పంపు ద్వారా బాలుడి మలరంధ్రాల్లో గాలి కొట్టాడు. దీంతో అతని పొట్ట ఉబ్బిపోయి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు బాలుడిని ఆస్పత్రికి తరలించారు. బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా రాజాపై పోక్సో కేసు నమోదు చేశారు.

News April 26, 2024

నెల్లూరు: చివరి రోజు 113 సెట్ల నామినేషన్లు

image

నెల్లూరు జిల్లాలో చివరి రోజు గురువారం మొత్తం 113 సెట్లు నామినేషన్లు దాఖలు చేశారు. కందుకూరు 14, కావలి 8, ఆత్మకూరు 7, కోవూరు 24, నెల్లూరు నగరం 16, నెల్లూరు గ్రామీణం 8, సర్వేపల్లి 7, ఉదయగిరిలో 14 మంది నామినేషన్ వేశారు. నేడు వీటిని పరిశీలించనున్నారు. ఈ నెల 29 వరకు ఉపసంహరణకు గడువు ఉంది.

News April 26, 2024

నెల్లూరు: రాష్ట్రంలోనే పేద అభ్యర్థి..!

image

నెల్లూరు ఎంపీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా కొప్పాల రఘు నామినేషన్ వేశారు. అఫిడవిట్ ప్రకారం రాష్ట్రంలోనే అత్యంత నిరుపేద అభ్యర్థి ఆయనే కావడం విశేషం. రఘుకి సొంత ఇల్లు, కారు, వ్యవసాయ భూమి, బంగారు ఆభరణాలు లేవు. చర, స్థిర ఆస్తులు ఏమీ లేవు. సెకండ్ హ్యాండ్ బైకు ఉంది. SBI బ్యాంక్ బ్యాలెన్స్ రూ.500. ఆయన భార్య కొప్పాల రేవతి పేరుపై కూడా చర, స్థిర ఆస్తులు లేవు. రఘుపై ఓ సోషల్ మీడియా కేసు ఉంది.

News April 25, 2024

28న నెల్లూరు జిల్లాకు జగన్ రాక

image

సీఎం జగన్ ఈనెల 28 నుంచి రోజూ 3 నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఈక్రమంలో ఆయన తొలిరోజే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. 28వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు వెంకటగిరిలో జరిగే సభలో సీఎం పాల్గొంటారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు కందుకూరుకు చేరుకుంటారు. సభ ప్రాంగణం వివరాలు తెలియాల్సి ఉంది.

News April 25, 2024

పెరిగిన అనిల్ కుమార్ ఆస్తులు

image

నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఇటీవల నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆర్వోకి అందజేసిన అఫిడవిట్‌లో పలు విషయాలను ప్రస్తావించారు. 2019లో స్థిరాస్తులు రూ.30 లక్షలు చూపగా, ఈసారి రూ.1.83 కోట్లుగా పేర్కొన్నారు. చరాస్తులు కూడా రూ.2.79 కోట్ల నుంచి రూ4.53కోట్లకు పెరిగాయి. అప్పు రూ.1.59కోట్లు ఉంది. ఈయన పేరు మీద 2 కార్లు ఉన్నాయి. అనిల్ మీద ఓ పోలీస్ కేసు నమోదైంది.

News April 25, 2024

పోలింగ్ శాతం పెరిగేందుకుకు చర్యలు: కలెక్టర్

image

ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం జిల్లాలో ఎన్నికల కోడ్ అమలు చేస్తున్నామని నెల్లూరు కలెక్టర్‌ హరి నారాయణన్‌ వివరించారు. స్థానిక ఎన్నికల కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో వ్యయ పరిశీలకులు, సాధారణ పరిశీలకులతో కలెక్టర్‌, ఎస్పీ సమావేశమయ్యారు. గత ఎన్నికల్లో 79శాతం పోలింగ్‌ నమోదు కాగా.. ఈసారి 85 శాతానికి పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.

News April 25, 2024

నెల్లూరు సిటీ బరిలో దేశాయిశెట్టి

image

నెల్లూరు నగరానికి చెందిన సీనియర్ న్యాయవాది దేశాయిశెట్టి హనుమంతరావు ఎన్నికల బరిలోకి దిగారు. సిటీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన ఆయన కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. గతంలో టీడీపీ మద్దతుతో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు.