Nellore

News April 25, 2024

నెల్లూరులో ప్రచారానికి బాలయ్య రాక

image

టీడీపీకి మద్దతుగా హీరో బాలకృష్ణ ప్రచారానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన తొలివిడత స్వర్ణాంధ్ర సాకార యాత్ర పూర్తి అయ్యింది. రెండో విడతలో భాగంగా ఈనెల 26న నెల్లూరు జిల్లాలో ఆయన పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు కందుకూరులో సభ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు నెల్లూరుకు చేరుకుంటారు. రూరల్, సిటీ నియోజకవర్గ పరిధిలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తారు.

News April 25, 2024

జనసేన నేత బొబ్బేపల్లిపై తిరుగుబాటు

image

జనసేన సర్వేపల్లి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడిపై ఆ పార్టీకి చెందిన 5 మండలాల అధ్యక్షులు తిరుగుబాటుకు దిగారు. వెంకటాచలంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. పార్టీ కోసం కష్టపడే జన సైనికులపై ఆయన దూషణలకు దిగడం సరికాదన్నారు. ఆయన తీరు నచ్చకే కొందరు ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేశారన్నారు. అతనితో కలిసి పనిచేయబోమని.. తామంతా సోమిరెడ్డి గెలుపునకు కృషి చేస్తామన్నారు.

News April 25, 2024

జిల్లా పోలీస్ అబ్జర్వర్‌గా అశోక్ టి.దుధే

image

ఎన్నికలకు సంబంధించి ఎటువంటి సందేహాలున్నా నివృత్తి చేసుకోవచ్చునని పోలీస్ అబ్జర్వర్ అశోక్ టి.దుధే ఓ ప్రకటనలో తెలిపారు. నెల్లూరు జిల్లా పోలీసు పరిశీలకులుగా ఆయన నియమితులయ్యారు. ఉదయం 10.30 నుంచి 11.30 వరకు నెల్లూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లోని గెస్ట్ హౌస్‌లో ఆయన అందుబాటులో ఉంటారు. అత్యవసర సమయంలో 7569618685, policeobserver73@gmail.com ద్వారా ఆయన్ను సంప్రదించవచ్చు.

News April 25, 2024

నెల్లూరు: ఇటీవల టీడీపీలో … నేడు వైసీపీలో చేరిక

image

ఇటీవల టీడీపీలోకి వెళ్లిన మత్స్యకార నాయకుడు, కావలి రూరల్ మాజీ జడ్పీటీసీ సభ్యుడు సోమయ్యగారి రాంబాబు తిరిగి వైసీపీలో చేరారు. నెల్లూరులో ఇవాళ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు రాంబాబుకి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. 

News April 25, 2024

ఐదో రోజు మొత్తం 36 మంది నామినేషన్లు

image

2024 సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో ఐదో రోజు మంగళవారం పలు రాజకీయ పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. జిల్లా వ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాలకు 36 మంది అభ్యర్థులు 44 సెట్లు, నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గానికి ఐదుగురు అభ్యర్థులు ఐదు సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు అందజేశారు.

News April 25, 2024

నెల్లూరులో మద్యం, నగదు స్వాధీనం

image

జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల సోమవారం రాత్రి నుంచి మంగళవారం వరకు పోలీసులు తనిఖీల్లో నగదు, మద్యం గుర్తించి సీజ్ చేశారు. చిన్నబజారు పోలీసు స్టేషన్ పరిధిలో రూ.2 లక్షలు, సంతపేట పరిధిలో రూ.1.16 లక్షలు, దుత్తలూరులో రూ.65 వేలు స్వాధీనం చేసుకున్నారు. కావలిలో 10, బిట్రగుంటలో 30, అల్లూరులో 13, కొండాపురంలో 38, కలిగిరిలో 11, జలదంకిలో 17, వరికుంటపాడులో 18, సంగంలో 10, కందుకూరులో 14 మద్యం సీసాలను సీజ్ చేశారు.

News April 25, 2024

నెల్లూరు నగరంలో యువకుడి దారుణహత్య 

image

నెల్లూరు భక్తవత్సలనగర్‌కు చెందిన రామయ్య కుమారుడు దశరథ తాతతో కలిసి పుచ్చకాయల వ్యాపారం చేస్తున్నాడు. సోమవారం సాయంత్రం పని ఉందని ఇంట్లో నుంచి వెళ్లిన దశరథ తిరిగి రాలేదు. మంగళవారం ఆటోనగర్‌లో దశరథ మృతదేహం వెలుగుజూసింది. కత్తులతో తీవ్రంగా దాడిచేయడంతో దశరథ ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించి మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించి పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

News April 25, 2024

రూ.9.64 కోట్ల బంగారు ఆభరణాలు స్వాధీనం

image

చిల్లకూరు మండలం బూదనం టోల్ ప్లాజా వద్ద చిల్లకూరు పోలీసులు మంగళవారం అకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈక్రమంలో రూ.9.64 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలు పట్టుబడ్డాయి. సరైన పత్రాలు లేకుండా నెల్లూరు నుంచి తిరుపతి, మదనపల్లె, చిత్తూరుకు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఆభరణాలను సీజ్ చేసినట్లు గూడూరు రూరల్ సీఐ వేణుగోపాల్ రెడ్డి వెల్లడించారు.

News April 25, 2024

నెల్లూరు: 9 గంటల నుంచే ఓపీ సేవలు

image

నెల్లూరులోని జీజీహెచ్ లో ఉదయం 9 గంటల నుంచి ఓపీ సేవలు ప్రారంభించాలని సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధానాయక్ ఆదేశించారు. సాయంత్రం 4 గంటల వరకు వైద్యులు అందుబాటులో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. రోగులకు మెరుగైన సేవలు అందించడం ద్వారా ఓపీతో పాటు సర్జరీలు, ఇతర సూపర్ స్పెషాలిటీ సేవలు పెంచాలన్నారు. జీజీహెచ్ లోని అన్ని విభాగాల అధికారులతో ఆయన ఈ మేరకు సమీక్ష నిర్వహించారు.

News April 25, 2024

కెమెరాలు చూస్తున్నాయ్.. జాగ్రత్త!

image

NLR: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈసీ ఆదేశాల మేరకు అధికారులు నిఘా పెంచారు. ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు కూడా నిబంధనల ఉల్లంఘనుల కోసం జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలో సీసీ కెమెరాలు బిగించిన వాహనాలు కూడా రోడ్డెక్కాయి. ఈసీ నిబంధనలను ఉల్లంఘించే వారి కోసం డేగ కళ్లతో వేటాడుతున్నాయి.