India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఓ వృద్ధుడు కాల్వలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నెల్లూరు నగరంలో జరిగింది. రంగనాయకులపేటలోని రైల్వే రోడ్డు ప్రాంతంలో నివాసం ఉంటున్న జమీర్ సోమవారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లి సమీపంలో ఉన్న జాఫర్ సాహెబ్ కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
➤ నియోజకవర్గం: నెల్లూరు సిటీ
➤ అభ్యర్థి: నారాయణ (TDP)
➤ చరాస్తులు: రూ.78.66 కోట్లు
➤ స్థిరాస్తులు: రూ.207.50 కోట్లు
➤ అప్పులు: 62.43 కోట్లు
➤ భార్య చరాస్తులు: 100.84 కోట్లు
➤ భార్య స్థిరాస్తులు: రూ.437.02 కోట్లు
➤ భార్య అప్పులు: రూ.127.16 కోట్లు
➤ చేతిలో ఉన్న డబ్బులు: రూ.81,636
➤ బంగారం: 35.90 కేజీలు
➤ వాహనాలు: 4
NOTE: ఎన్నికల అఫిడవిట్ వివరాలు ఇవి.
నెల్లూరు జిల్లాలో నామినేషన్లు ఊపందుకున్నాయి. నాలుగో రోజు సోమవారం ఒక్కరోజే దాదాపు 30 నామినేషన్లను స్వీకరించినట్లు రిటర్నింగ్ అధికారులు వెల్లడించారు. నెల్లూరు పార్లమెంటు స్థానానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు రూరల్లో ఆదాల, సిటీలో నారాయణ, సర్వేపల్లిలో కాకాణి, ఆత్మకూరులో ఆనం, ఉదయగిరిలో కాకర్ల సురేశ్ నామినేషన్లు దాఖలు చేశారు.
ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి నామినేషన్ వేయడం చాలా సంతోషంగా ఉందని టీడీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. నామినేషన్ వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది నామినేషన్ కార్యక్రమం అనేకంటే నెల్లూరు జిల్లా అభివృద్ధికి శంకుస్థాపన కార్యక్రమం అనొచ్చని ఆయన వ్యాఖ్యానించారు.
మాజీ ఎంపీ మాగుంట సుబ్బరామ రెడ్డి, పార్వతమ్మ కుమారుడు మాగుంట విజయ్ రెడ్డి (విజయ్ బాబు) చనిపోయారు. నెల్లూరులోని అపోలోలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. ఆయన కుటుంబానికి పలువురు ప్రగాఢ సానుభూతి తెలిపారు. టీడీపీ ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి విజయ్ రెడ్డికి బాబాయి అవుతారు.
TDP నెల్లూరు సీటీ అభ్యర్థి నారాయణ 77 పేజీలతో ఎన్నికల అఫిడవిట్ దాఖలు చేశారు. ఆయన స్థలాల వివరాలకే దాదాపు 50 పేజీలు ఉపయోగించారు. ఆయన దగ్గర బంగారం లేకపోయినా భార్య దగ్గర రూ.22.76 కోట్ల విలువైన 35.929 కేజీల బంగారం ఉందని ప్రకటించారు. తన అప్పులు రూ.62.43 కోట్లు, భార్య పేరిట రూ.127.16 కోట్లు ఉన్నట్లు చూపారు. తనపై CID, పేపర్ లీకేజీతో పాటు నారాయణ విద్యా సంస్థలో విద్యార్థి సూసైడ్ కేసు ఉందని పేర్కొన్నారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కొత్తగా ఇద్దరు అభ్యర్థుల పేర్లతో పాటు నలుగురు అభ్యర్థులను మారుస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం ఉత్తర్వులు ఇచ్చింది.
☞ కావలి: పొదలకూరి కల్యాణ్
☞ వెంకటగిరి: శ్రీనివాసులు
☞ కోవూరు: కిరణ్ కుమార్ రెడ్డి(మోహన్)
☞ సర్వేపల్లి: PV శ్రీకాంత్ రెడ్డి(పూల చంద్రశేఖర్)
☞ గూడూరు: డాక్టర్ రామకృష్ణారావు(వేమయ్య)
☞ సూళ్లూరుపేట: చందనమూడి శివ(తిలక్ బాబు)
NOTE: బ్రాకెట్లో ఉన్న పేర్లు పాత అభ్యర్థులవి.
నెల్లూరు జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలను నిర్వహించడమే లక్ష్యంగా సాయుధ బలగాలతో కవాతు నిర్వహిస్తున్నామని ఎస్పీ కె.ఆరీఫ్ హఫీజ్ తెలిపారు. జిల్లాలోని అనంతసాగరం, మనుబోలు, కావలి రూరల్, కందుకూరు రూరల్, సంతపేట తదితర ప్రాంతాల్లో సాయుధ బలగాలతో కవాతు నిర్వహించారు. ప్రజలు భయాన్ని వీడి రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోవాలన్నారు.
వైసీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ సమర్పించనున్నారు. ఈ మేరకు ఆయన కార్యాలయ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి అందరూ పెద్ద సంఖ్యలో తరలివచ్చి మద్దతు తెలపాలని కోరారు.
డక్కిలి మండల పరిధిలోని దగ్గవోలు గ్రామంలో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 35 మందికి 35 మంది పాసయ్యారు. ఇందులో కే.శ్రావ్య 600 మార్కులు గాను 519 మార్కులు సాధించి పాఠశాలలో మొదట స్థానంలో నిలిచారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. పాఠశాలకు 100% ఉత్తీర్ణత రావడం సంతోషం అని ప్రధానోపాధ్యాయులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.