Nellore

News April 24, 2024

పదో తరగతి ఫలితాల్లో నెల్లూరు జిల్లాకు 15వ స్థానం

image

పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో నెల్లూరు జిల్లా 88.17% ఉత్తీర్ణతతో 15 స్థానంలో నిలిచింది. 27,788 మంది పరీక్షలు రాయగా 24500 మంది పాస్ అయ్యారు. 13926 మంది బాలురు పరీక్షలు రాయగా 12003 మంది పాస్ అయ్యారు. 13862 మంది
బాలికలు పరీక్ష రాయగా 12497 మంది పాస్ అయ్యారు. అటు తిరుపతి జిల్లాలో 26625 మందికి 24151 మంది పాస్ అయ్యారు.

News April 22, 2024

నెల్లూరు: వైసీపీ రాష్ట్ర మహిళా సెక్రటరీగా నిడిగుంట అరుణ

image

వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం కమిటీ సెక్రటరీలుగా కోవూరు మండలం పడుగుపాడుకు చెందిన నిడిగుంట అరుణ, వెంకటాచలం హిమ బిందును నియమించారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో అరుణ రాష్ట్ర దిశా ఫౌండేషన్ ఛైర్మన్‌గా వ్యవహరించారు.

News April 22, 2024

నెల్లూరు: భారీగా మద్యం స్వాధీనం

image

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సైదాపురం పరిధిలో 22, వేదాయపాళెంలో 14, ఉదయగిరి, వింజమూరులో 12 చొప్పున, దుత్తలూరులో 7, చేజర్లలో 10, కలువాయి, టీపీ గూడూరులో 15 చొప్పున, కండలేరులో 20, ఏఎస్ పేటలో 6 మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. 420 బాటిళ్లను ఎస్ఈబీ అధికారులు సీజ్ చేశారు.

News April 22, 2024

నెల్లూరు: నేడు జిల్లా అంతా నామినేషన్ల కోలాహలం

image

ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సోమవారం నామినేషన్ల సందడి కొనసాగనుంది. శుభ ముహూర్తం ఉండటంతో నెల్లూరులో నారాయణ, ఆత్మకూరులో ఆనం రామనారాయణ రెడ్డి, సర్వేపల్లిలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, గూడూరులో పాశం సునీల్ కుమార్, ఉదయగిరిలో కాకర్ల సురేశ్‌తో పాటు పలువురు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఈ క్రమంలో పోలీసు అధికారులు బందోబస్తు విషయంలో అప్రమత్తమయ్యారు.

News April 22, 2024

నెల్లూరు: నేడే పదో తరగతి ఫలితాలు

image

పదవ తరగతి పరీక్ష ఫలితాలను విజయవాడ వేదికగా సోమవారం విడుదల చేయనున్నట్లు జిల్లా విద్యా శాఖ అధికారి రామారావు ఒక ప్రకటనలో తెలిపారు. నెల్లూరు జిల్లాలో దాదాపు 34 వేల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్ష రాసినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు పరీక్ష ఫలితాలను results.bse.ap.gov.in వెబ్ సైట్ లో చూడవచ్చని చెప్పారు.

News April 22, 2024

వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధిగా సమీర్ ఖాన్

image

వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధిగా సమీర్ ఖాన్‌ను నియమించారు. ఈ మేరకు వైసీపీ రాష్ట్ర కమిటీ అధికారికంగా ఆదివారం ప్రకటన జారీచేసింది. వైసీపీ మైనార్టీ నేతగా క్రియాశీలకంగా పనిచేయడంతో పాటు జిల్లాలో సోనుసూద్ ట్రస్ట్ తరఫున అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించారు. తాజాగా రాష్ట్ర అధికార ప్రతినిధి పదవి దక్కింది.

News April 21, 2024

టీడీపీ ఉపాధ్యక్షుడిగా కొమ్మి లక్ష్మయ్య నాయుడు

image

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు నియమితులయ్యారు. ఆత్మకూరు నియోజకవర్గానికే చెందిన పుట్టం బ్రహ్మానందరెడ్డిని రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమించారు. ఈ క్రమంలో ఇద్దరు నేతలను ఆత్మకూరు అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి అభినందించారు.

News April 21, 2024

కసుమూరు దర్గాలో సినీ హీరో సుమన్ పూజలు

image

దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కసుమూరు మస్తాన్ వలి దర్గాను ఆదివారం ప్రముఖ సినీ నటుడు సుమన్ దర్శించుకున్నారు. దర్గా ముజావర్లు ఆయనకు ఘన స్వాగతం పలికారు. హీరో సుమన్ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో కేఎస్ అసిఫ్, ఎంఎస్ మొహమ్మద్, ఎంఎస్ దస్తగిరి, రహీద్ తదితరులు పాల్గొన్నారు.

News April 21, 2024

స్ట్రాంగ్ రూమును పరిశీలించిన జిల్లా కలెక్టర్

image

తడ తహశీల్దార్ కార్యాలయం మరియు స్ట్రాంగ్ రూంను తిరుపతి జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ సందర్శించారు. అలాగే సూళ్లూరు పేట తహశీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఏవైనా సమస్యలు ఉంటే వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.

News April 21, 2024

వైసీపీలోకి జనసేన నేత శ్రీకాంత్

image

బీజేపీ – జనసేన జిల్లా సమన్వయకర్త శ్రీకాంత్, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ తదితరులు వైసీపీలో చేరారు. నెల్లూరు రామ్మూర్తినగర్ లోని వీఎస్ఆర్ క్యాంప్ కార్యాలయంలో వారికి ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీల్ అహ్మద్, జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆత్మీయ ఆహ్వానం పలికారు.