India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నెల్లూరు జిల్లాలోని ఓ సచివాలయంలోనే మద్యం సీసాలు దొరకడం కలకలం రేపుతోంది. కావలి పట్టణ పరిధిలోని బుడంగుంట సచివాలయంలో మద్యం సీసాలు నిల్వ చేసినట్లు సీ-విజిల్ యాప్ ద్వారా కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు సచివాలయంలో తనిఖీలు చేశారు. 43 మద్యం సీసాలను గుర్తించారు. వాటిని సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉదయగిరి టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు నెల్లూరులోని ఓ హోటల్లో సమావేశం కావడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. అక్కడి అభ్యర్థి కాకర్ల సురేశ్ విజయానికి చేయాల్సిన కృషిపై సమాలోచనలు జరిపినట్లు పైకి చెబుతున్నా ఆ సమావేశంలో అభ్యర్థి లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. కొద్ది రోజులుగా సీనియర్ నేతలందరూ కాకర్లపై గుర్రుగా ఉన్నారనే ప్రచారం నేపథ్యంలో ఈ భేటీ ఉదయగిరి రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది.
డ్రాయింగ్, హ్యాండ్ లూమ్ వీవింగ్, టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ, లోయర్, హయ్యర్ గ్రేడ్ టైపింగ్ తదితర టెక్నికల్ కోర్సుల పరీక్షలను సోమవారం నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు నెల్లూరు ఆర్ఐఓ శ్రీనివాసులు తెలిపారు. హాల్ టికెట్లను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రానికి హాల్టికెట్తో పాటు ప్రభుత్వం నిర్దేశించిన గుర్తింపు కార్డు తీసుకురావాలన్నారు.
వెంకటగిరి టీడీపీ MLA అభ్యర్థిగా కురుగొండ్ల రామకృష్ణ పోటీలో ఉండనున్నారు. ఈమేరకు మంగళగిరికి వచ్చి బీఫారం తీసుకెళ్లాలని ఆయనకు TDP కేంద్ర కార్యాలయం నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం. ఈ సీటును ఆయన కుమార్తె లక్ష్మీసాయిప్రియకు కేటాయించారు. ఇప్పటికే ఆమెతో పాటు రామకృష్ణ నామినేషన్ వేశారు. ఆయన అయితేనే అనుకూల వాతావరణం ఉంటుందని వచ్చిన నివేదికల మేరకు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు సమాచారం.
నెల్లూరు డిప్యూటీ మేయర్ పదవికి ఖలీల్ అహ్మద్ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని మేయర్ స్రవంతికి అందజేశారు. ఆయన వైసీపీ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈక్రమంలోనే రాజీనామా చేసినట్లు చెప్పారు. రాజీనామా విషయాన్ని మేయర్ రహస్యంగా ఉంచడం అనుమానాలకు తావిస్తోంది.
ఎన్నికల నేపథ్యంలో అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టినట్లు నెల్లూరు ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. శనివారం జిల్లాలో సైదాపురం పరిధిలో-20, KP పోర్ట్-9, కొండాపురం-15, సంగం-11, దుత్తలూరు-7, జలదంకి-25, చేజెర్ల-10 మరియు SEB-217 మద్యం బాటిల్స్ లను సీజ్ చేసామన్నారు. ఎక్కడైనా ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తే సి-విజిల్ యాప్ , టోల్ ఫ్రీ నంబర్ డయల్ 112 ఫిర్యాదు చేయవచ్చన్నారు.
బైకును లారీ ఢీకొని మహిళ అక్కడికక్కడే మృతిచెందిన విషయం తెలిసిందే. స్థానికుల వివరాల ప్రకారం.. ఆర్టీసీ ఉద్యోగి మునికుమారి(45), భర్త హరితో కలిసి బైక్పై వెళ్తుండగా పెళ్లకూరు మండలం చెంబేడు క్రాస్ రోడ్డు వద్ద లారీ ట్యాంకర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో మునికుమారి అక్కడికక్కడే మృతి చెందగా.. ఆమె భర్త హరికి గాయాలయ్యాయి.
అధికారంలోకి రాగానే గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలుపుతామని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇవాళ గూడూరులోని ఓ కళ్యాణ మండపంలో జరిగిన మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన హామీ ఇచ్చారు. తిరుపతి జిల్లా కేంద్రానికి వెళ్లడం ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉందని ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ తెలపడంతో ఆయన ఈ హామీ ఇచ్చారు.
సర్వేపల్లి వైసీపీ అభ్యర్థిగా వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి ఏప్రిల్ 22న నామినేషన్ దాఖలు చేయనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు వెంకటాచలం మండల పరిషత్ కార్యాలయంలోని ఆర్వో కార్యాలయంలో నామినేషన్ సమర్పిస్తారని కాకాణి కార్యాలయ ప్రతినిధులు తెలిపారు.
ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా ఆనం రామనారాయణ రెడ్డి ఏప్రిల్ 22వ తేదీ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 9 గంటలకు ఆత్మకూరు సత్రం సెంటరు నుంచి ర్యాలీగా బయలుదేరి ఆర్టీసీ బస్టాండ్, పోలీస్ స్టేషన్, మీదుగా మున్సిపల్ ఆఫీసుకు చేరుకుంటారని ఆనం కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.
Sorry, no posts matched your criteria.