India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇవాళ ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. వెంకటగిరి నుంచి గూడూరుకు వెళ్తున్న కారు వెంగమాంబపురం సమీపంలోని పచ్చారుచేను వద్ద అదుపు తప్పింది. ఒక ఇంటి ప్రహరీ ఢీకొట్టింది. గోడ అవతలకు వెళ్లడంతో కారులో ఉన్నవారికి గాయాలయ్యాయి. మద్యం తాగి వాహనం నడపటంతోనే ప్రమాదం జరిగినట్లు గ్రామ ప్రజలు తెలిపారు.
వెంకటగిరి టీడీపీ అభ్యర్థి మార్పు విషయంలో ఆపార్టీ అధిష్ఠానం తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. మొదటి నుంచి ఈ సీటును మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆశించారు. అధిష్ఠానం మాత్రం ఆయన కుమార్తె లక్ష్మీసాయి ప్రియ వైపు మొగ్గుచూపింది. కానీ రామకృష్ణకు అనుకూలంగా సర్వే రిపోర్టులు ఉండటంతో తిరిగి ఆయన్నే అభ్యర్థిగా నిలబెట్టాలనే యోచనతో చర్చలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.
టీడీపీ కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నిన్న నామినేషన్ వేశారు. ఈక్రమంలో తమ ఉమ్మడి ఆస్తుల విలువ రూ.715.62 కోట్లుగా చూపారు. ఇందులో ప్రశాంతిరెడ్డి పేరుతో రూ.76.35 కోట్లు, భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరిట రూ.639.26 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. అప్పులు రూ.197.29 కోట్లని చెప్పారు. రూ.6.96 కోట్ల విలువైన 19 కార్లు ఉన్నాయని వెల్లడించారు. అలాగే ప్రశాంతిపై ఎలాంటి కేసులు లేవు.
24 గంటలు అందుబాటులో ఉండేలా ప్రత్యేకంగా ఎన్నికలకు పోలీసు హెల్ప్ లైన్ నంబర్స్- 9440796385, 9392903413, 0861-2328400 ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ
K.ఆరీఫ్ హఫీజ్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగపరంగా కల్పించబడిన ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేందుకు జిల్లా యంత్రాంగం ముందస్తు ప్రణాళికతో అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేసిందన్నారు .
జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఓటరు దరఖాస్తులను ఈనెల 24 లోగా పరిష్కరించి తుది ఓటరు జాబితాను ప్రచురిస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరి నారాయణన్ వెల్లడించారు.
గురువారం ఎస్ఆర్ శంకరన్ వీసీ హాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు 20,53,397 మంది ఓటర్లుగా నమోదై ఉన్నారని అన్నారు.
మర్రిపాడు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ సమీపంలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నెల్లూరు నుంచి దేకూరుపల్లికి వెళ్తున్న ఒక కారు అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు కారులో ఉన్నవారు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రమాద సమయంలో కారులో ముగ్గురు ఉన్నట్లు సమాచారం.
జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఓటరు దరఖాస్తులను ఈనెల 24 లోగా పరిష్కరించి తుది ఓటరు జాబితాను ప్రచురిస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరి నారాయణన్ వెల్లడించారు.
గురువారం ఎస్ఆర్ శంకరన్ వీసీ హాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు 20,53,397 మంది ఓటర్లుగా నమోదై ఉన్నారని అన్నారు.
సీఎం జగన్ తనకు తీరని అన్యాయం చేశాడని తిరుపతి పార్లమెంటు బిజెపి అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావు అన్నారు. వాకాడులో ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్లు ఎంపీగా, ఐదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన తనను.. ఎవరో మాటలు విని తనకు టికెట్ ఇవ్వలేదని అన్నారు. దీంతో తాను బీజేపీ తరఫున తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్నానని అన్నారు. తనను గెలిపిస్తే గూడూరు నియోజకవర్గ అభివృద్ధికి తొలి ప్రాధాన్యం ఇస్తానన్నారు.
నెల్లూరు జిల్లాలో తొలి రోజు 8 నియోజకవర్గాల్లో 9 మంది 14 నామినేషన్లు, నెల్లూరు పార్లమెంట్కు ఒక నామినేషన్ వేసినట్లు కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు. అలాగే జిల్లాలో సార్వత్రిక ఎన్నికలను పరిశీలించడానికి వ్యయ పరిశీలకులు ఇప్పటికే జిల్లాకు వచ్చారన్నారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు, పోలీసు పరిశీలకులు 24న జిల్లాకు వస్తారని వెల్లడించారు. ఇప్పటివరకు జిల్లాలో రూ.1.78 కోట్ల నగదును సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.
నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తరఫున మాజీ మేయర్ భానుశ్రీ నెల్లూరు రూరల్ రిటర్నింగ్ అధికారి మలోలకు గురువారం నామినేషన్ పత్రాలను అందజేశారు. ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా మాజీ మేయర్ భానుశ్రీతో పాటు టీడీపీ నేతలు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో 2014, 19 ఎన్నికల్లో కూడా కోటంరెడ్డి పోటీ చేశారు. ఇది వరుసగా మూడోసారి కావడం గమనార్హం.
Sorry, no posts matched your criteria.