India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇవాళ ఉదయం నెల్లూరు మద్రాసు బస్టాండ్ వద్ద ఉన్న కూరగాయల మార్కెట్లో YCP రూరల్, సిటీ MLA అభ్యర్థులు ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఖలీల్, MP అభ్యర్థి విజయసాయి రెడ్డి ప్రచారం చేశారు. వ్యాపారులు, కొనుగోలుదారులు, కార్మికులను పలకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఉన్నత ప్రమాణాలతో మార్కెట్ను ఆధునీకరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం విజయసాయి రెడ్డి కూరగాయలు అమ్మగా ఆదాల ప్రభాకర్ రెడ్డి కొనుగోలు చేశారు.
జబర్దస్ ఫేమ్ కిరాక్ ఆర్పీపై నెల్లూరు దర్గామిట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కొద్ది రోజుల క్రితం ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈక్రమంలో తరచూ ప్రెస్మీట్లు నిర్వహించి వైసీపీ నాయకులపై తీవ్ర స్థాయిలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల కిందట వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఎన్నికల తేదీ సమీపించే కొద్ది నెల్లూరు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కొద్ది రోజులుగా వాలంటీర్ల రాజీనామాల వ్యవహారంపై తీవ్ర చర్చ సాగుతోంది. పెద్దసంఖ్యలో వాలంటీర్లు రాజీనామా చేసి వైసీపీలో చేరుతున్నారు. కోవూరు నియోజకవర్గంలో పలువురు టీడీపీలోనూ చేరారు. జిల్లాలో సోమవారం నాటికి 2094 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.
ఈనెల 18వ తేదీ నుంచి నెల్లూరు జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి నామినేషన్లను స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ ఎన్నికల అధికారి హరినారాయణ పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని కలెక్టరేట్ లో ఆయన మాట్లాడుతూ.. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని తెలిపారు.
పీసీసీ ఉపాధ్యక్షుడు, సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే సీవీ శేషారెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 1959 నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగానని తెలిపారు. అనుచరులతో సమావేశమై ఇకపై రాజకీయాలకు అతీతంగా ప్రజాసేవలో ఉంటానన్నారు. సీవీ శేషారెడ్డి రెండు సార్లు సర్వేపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉమ్మడి ఏపీలో ప్రభుత్వ విప్గా వ్యవహరించారు.
ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా విడుదల కాక ముందే రాజకీయ పార్టీల ప్రచారం తారస్థాయికి చేరింది. ప్రధానంగా నెల్లూరు జిల్లా కేంద్రంలో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఇంటింటి ప్రచారంతో పాటు సోషల్ మీడియాను సైతం పూర్తిగా వాడేస్తున్నారు. ప్రధానంగా ఫోన్ కాల్స్తో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. వేర్వేరు నంబర్ల నుంచి ఎడతెగకుండా వస్తున్న ఫోన్ కాల్స్తో జనం విసుగెత్తిపోతున్నారు.
నెల్లూరుకు సమీపంలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. శ్రీకాకుళానికి చెందిన రామయ్య(44), తవిటయ్య(60), సిమ్మయ్య(42) నెల్లూరుకు వలస వచ్చారు. ముగ్గురూ కలిసి ఆదివారం బైకుపై పొదలకూరులో పనికి వెళ్లారు. సాయంత్రం తిరిగి వస్తుండగా కొత్తూరు పోలీసు ఫైరింగ్ ఆఫీసు వద్ద వీరి బైక్ను బుల్లెట్ వాహనం ఢీకొట్టింది. రామయ్య స్పాట్లోనే చనిపోగా తవిటయ్య, సిమ్మయ్య నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కన్నుమూశారు.
ఓ మహిళ ఆర్టీసీ బస్సులోనే చనిపోయిన ఘటన నెల్లూరు జిల్లా చేజర్ల మండలం ఆదూరుపల్లి వద్ద ఆదివారం వెలుగు చూసింది. నెల్లూరు నుంచి కలువాయికి వెళ్తున్న బస్సులో ఓ మహిళ అస్వస్థతకు గురైంది. ప్రయాణికులు 108కు సమాచారం అందించారు. అప్పటికే ఆమె మృతిచెందినట్లు 108 సిబ్బంది నిర్ధారించారు. ప్రయాణికులను మరో బస్సులో గమ్యానికి చేర్చారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.
నెల్లూరు జిల్లాకు చెందిన వేలాది మంది ఓటర్లు పొరుగు రాష్ట్రాల్లో ఉపాధి నిమిత్తం ఉన్నారు. ఒక్క ఉదయగిరికి సంబంధించే సుమారు 35 వేల మంది ఓటర్లు హైదరాబాద్, నల్గొండ, పూనే, ముంబయి, బెంగళూరు, చెన్నైలో ఉన్నట్లు సమాచారం. ఈక్రమంలో వలస ఓటర్లపై అన్నిపార్టీల నేతలు స్పెషల్ ఫోకస్ పెట్టారు. టీడీపీ నేతలు ఇప్పటికే హైదరాబాద్ మియాపూర్, బీఎన్ రెడ్డి నగర్లలో ఆత్మీయ సమావేశాలు నిర్వహించి తమకు మద్దతు పలకాలని కోరారు.
కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలం చౌకచర్ల పంచాయతీ పరిధిలోని13 మంది వాలంటీర్లు, కోవూరు మండలం పాటూరు పంచాయతీకి సంబంధించిన 17 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి మద్దతు పలికి వైసీపీలో చేరారు. కార్యక్రమంలో నల్లపరెడ్డి రాజేంద్రరెడ్డి, నిరంజన్ బాబు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.