India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ హరినారాయణన్ పేర్కొన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఆదివారం నెల్లూరు విఆర్సి సెంటర్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. దేశానికి అంబేద్కర్ ఒక దిక్సూచి నిలిచిపోయారని కొనియాడారు. సోషల్ వెల్ఫేర్ డిడి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
వాట్సాప్ నంబరు ద్వారా విద్యుత్ శాఖకు సంబంధించిన పలు సేవలు పొందవచ్చని ఎస్పీడీసీఎల్ నెల్లూరు ఎస్ఈ విజయన్ తెలిపారు. 91333 31912 నంబరుతో వాట్సాప్ ను అందుబాటులోకి తెచ్చామన్నారు. వినియోగదారుడు తమ 13 అంకెల సర్వీస్ నంబర్ ను వాట్సాప్ లో పంపితే అందుబాటులో ఉన్న సేవల ఆఫ్షన్లు వస్తాయన్నారు. విద్యుత్ బిల్లులు కూడా చెల్లించుకోవచ్చన్నారు.
పొదలకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ఈ ఏడాది 61 మంది విద్యార్థులు ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు రాశారు. వారిలో కేవలం 9 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలోనూ 56 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైతే 28 మంది పాస్ అయ్యారు. కళాశాలలో అన్నీ వసతులున్నా చాలా తక్కువ మంది ఉత్తీర్ణులు కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సైదాపురం మండలం తూర్పుపూండ్లకు చెందిన హుస్సేన్ బాషా స్నేహితులతో కలిసి శనివారం కోడూరు బీచ్ కు వచ్చాడు. సముద్రంలో స్నానం చేస్తున్న సమయంలో అలల తాకిడికి లోనికి వెళ్లిపోయాడు. ప్రమాదాన్ని గమనించిన మెరైన్ కానిస్టేబుల్ పోలయ్య వెంటనే అప్రమత్తమై ఆ యువకుడిని బయటకు తీసుకొచ్చాడు. సీపీఆర్ చేసిన అనంతరం చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలించారు. సకాలంలో స్పందించిన పోలయ్యను పలువురు అభినందించారు.
ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రంజాన్ పండగ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న విక్రమ్ రెడ్డి ఎన్నికల నిబంధనలను అతిక్రమించారని ఎంసీసీ నోడల్ అధికారి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఆత్మకూరు ఎస్సై ముత్యాలరావు తెలిపారు.
త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎన్నికల కమిషన్ మద్యం విక్రయాలపై ఆంక్షలు విధించింది. మద్యం దుకాణాల్లో రూ.లక్ష విలువగల మద్యం విక్రయం జరగగానే షాపులను మూసివేయాలని ఉత్తర్వులు జారీచేసింది. అలాగే ప్రతి వ్యక్తికి ఒక్క మద్యం క్వార్టర్ బాటిళ్లు మాత్రమే అందజేయాలని ఆదేశాలు జారీచేసింది. గతంలో ఒక వ్యక్తికి మూడు మద్యం బాటిళ్లు ఇచ్చే వెసులుబాటు ఉండింది. ప్రస్తుతం ఒక్క బాటిల్కు మాత్రమే కుదించింది.
కందుకూరు నియోజకవర్గం జాతీయ రహదారి తేట్టు వద్ద స్టాటికల్ సర్వేలెన్స్ టీం చెక్పోస్ట్ను కలెక్టర్ ఎం హరి నారాయణన్ పరిశీలించారు. కందుకూరు నియోజక వర్గంలోని టి.ఆర్.ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో పిఓలకు , ఏపిఓలకు నిర్వహిస్తున్న ఎన్నికల శిక్షణ తరగతులు పరిశీలించారు. అనంతరం కావలి నియోజకవర్గం జాతీయ రహదారి రుద్రకోట స్టాటికల్ సర్వేలెన్స్ టీం చెక్ పోస్ట్ ను తనిఖీ చేశారు.
నెల్లూరు జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలను నిర్వహించడమే లక్ష్యంగా సాయుధ బలగాలతో కవాతు నిర్వహిస్తున్నామని ఎస్పీ కె.ఆరీఫ్ హఫీజ్ తెలిపారు. జిల్లాలోని ఏఎస్ పేట, చిన్న బజారు తదితర ప్రాంతాల్లో సాయుధ బలగాలతో శనివారం కవాతు నిర్వహించారు. ప్రజలు భయాన్ని వీడి రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోవాలన్నారు.
చేజర్ల మండల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ మెుదటి సంవత్సరంలో 43 మంది విద్యార్థులు చదువుతున్నారు. నిన్న విడుదలైన ఇంటర్ ఫలితాల్లో మొదటి సంవత్సరంలో ఒక్క విద్యార్థి మాత్రమే పాసయ్యారు. 42 మంది విద్యార్థులు ఫెయిల్ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది ప్రభుత్వ అధ్యాపకుల నిర్లక్ష్యమని విమర్శలు వస్తున్నాయి. సీనియర్ ఇంటర్ లో 27 మందికి గాను 13 మంది ఫెయిల్ అయ్యారు.
మండలంలోని ఈదగాలి గ్రామానికి చెందిన వెందోటి సుబ్రహ్మణ్యం, వెంకటలక్ష్మమ్మ దంపతులు. వారిద్దరూ శుక్రవారం సాయంత్రం బైక్పై వెళ్తుండగా ఇడిమేపల్లి ప్రాంతంలోని సర్వేపల్లి రైల్వే గేట్ సమీపంలో స్కూల్ వ్యాన్ ఢీ కొట్టింది. దీంతో వెంకటలక్ష్మమ్మ (30) అక్కడికక్కడే మృతిచెందింది. సుబ్రహ్మణ్యంకు గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.