India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇంటర్ పరీక్షా ఫలితాలను శుక్రవారం ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ఆస్ఐఓ డాక్టర్ ఆదూరు శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. నెల్లూరు జిల్లాలో ప్రథమ సంవత్సర పరీక్షలకు 26,419 మంది, ద్వితీయ సంవత్సర పరీక్షలకు 25,657 మంది హాజరయ్యారు. మొత్తంగా 52,076 మంది ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నారు.
వెంకటాచలంలోని సర్వేపల్లి క్రాస్ రోడ్ సమీపంలో జెండా వీధిలో ఉంటున్న ఆర్టీసీ ఉద్యోగి షేక్ నసురుద్దీన్ ఇల్లు గురువారం పూర్తిగా దగ్ధమైంది. సుమారు రూ.6 లక్షల నష్టం జరిగిందని బాధితుడు నసురుద్దీన్ వాపోయాడు. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో ఎలక్ట్రికల్ పరికరాలు, బంగారం, నగదు, ఖరీదైన దుస్తులు, వస్తువులు బూడిదయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రంజాన్ రోజున రోజు తీవ్ర విషాదం నెలకొంది. గూడూరు నియోజకవర్గం కోట పట్టణానికి చెందిన SK ఉమర్ బీటెక్ చదువుతున్నాడు. ఇవాళ చికెన్ దుకాణంలో పనికి వెళ్లాడు. ఈక్రమంలో అతనికి కరెంట్ షాక్ తగలడంతో చనిపోయాడు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంక్షలతో నెల్లూరు జిల్లాలో కొన్నిచోట్ల సాయంత్రానికే మద్యం దుకాణాలు మూతపడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 271 షాపులు ఉన్నాయి. గతేడాది ఏప్రిల్లో ఒకరోజులో ఎంత మొత్తం మద్యం విక్రయించారో.. ప్రస్తుతం కూడా రోజుకు అంతే విక్రయించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించినట్లు సమాచారం. దీంతో ఉదయం 11 గంటలకు తెరుచుకుంటున్న షాపుల్లో సాయంత్రానికే టార్గెట్ పూర్తి కావడంతో మూతపడుతున్నాయి. మీ ఏరియాలో పరిస్థితి ఏంటో కామెంట్ చేయండి.
చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి నెల్లూరు రూరల్ మండలం కలివెలపాళేనికి చెందిన వారు. NRI అయిన ఆయన జనసేన ఆవిర్భావంలోనే పార్టీలో చేరారు. కీలక విభాగమైన పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కు సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. 2019 ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేసి ఓడిన మనుక్రాంత్ ఈ ఎన్నికల్లో సిటీ సీటు ఆశించారు. కీలకనేతగా ఉన్నా కేడర్ తో కనెక్ట్ కాలేకపోయారని విమర్శలు ఉన్నాయి.
మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మేనల్లుడు బిజవేముల సురేంద్ర నాధ్ రెడ్డి గురువారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నెల్లూరులోని ఆనం నివాసంలో ఆత్మకూరు టీడీపీ MLA అభ్యర్థి ఆనం రామ్ నారాయణ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఆయనతో పాటు మర్రిపాడు మండలం, బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన పలువురు టీడీపీలో చేరారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. మంగళ, బుధవారాల్లో జిల్లా వ్యాప్తంగా దాదాపు 16.90 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి పత్రాలు లేకపోవడంతో నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దాంతో పాటు అక్రమంగా తరలిస్తున్న 164 మద్యం బాటిళ్లను సెబ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
బంగాళాఖాతంలో ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు చేపల వేటను నిషేధించినట్లు కోట ప్రాంత మత్స్యశాఖ అభివృద్ధి అధికారి రెడ్డి నాయక్ తెలిపారు. చేపలు గుడ్లు పెట్టే సమయంలో మరబోట్లతో వేట నిషేధించామని వెల్లడించారు. ఉల్లంఘించిన వారి మరబోట్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు డీజిల్, ఇతర రాయితీలను రద్దు చేస్తామని హెచ్చరించారు.
జిల్లాలో పలు నియోజకవర్గాలకు ఎన్నికల కమిషన్ పరిశీలకులను నియమించింది. నెల్లూరు సిటీ, రూరల్, కోవూరు, ఆత్మకూరు నియోజకవర్గాలకు నితిన్ సింగ్ బదారియా , కందుకూరు, కావలి, ఉదయగిరికి రామ్ కుమార్ గౌతమ్, సర్వేపల్లికి కరీ గౌడ్ సాధారణ పరిశీలకులుగా నియమితులయ్యారు. పోలీస్ పరిశీలకులుగా కావలి, ఆత్మకూరు, కోవూరు, నెల్లూరు సిటీ, రూరల్, ఉదయగిరికి అశోక్ టి దూదే , సర్వేపల్లికి అరవింద్ సాల్వే ను నియమించింది.
నెల్లూరు జిల్లాలో జనసేనకు పట్టిన దరిద్రం పోయిందని ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ అన్నారు. జనసేన జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డిని వైసీపీ నాయకులు కలవడంతో సంబరాలు చేసుకున్నారు. మనుక్రాంత్ రెడ్డి జనసేనను వీడితే తమకు సంతోషమేనని.. కానీ పవన్ కళ్యాణ్ గురించి ఏమైనా తప్పుగా మాట్లాడితే అస్సలు ఊరుకోమని హెచ్చరించారు. తర్వాత బాణసంచా కాల్చి స్వీట్స్ పంచుకున్నారు.
Sorry, no posts matched your criteria.